నిర్లక్ష్యమూ, సోమరితనమూ, మరియు నిద్రచే భ్రమకు గురి చేసేది ఏది? భగవద్గీత Bhagavadgita
నిర్లక్ష్యమూ, సోమరితనమూ, మరియు నిద్రచే భ్రమకు గురి చేసేది ఏది? 'భగవద్గీత' చతుర్దశోధ్యాయం – గుణత్రయ విభాగ యోగం (05 – 08 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 13 నుండి 18 వరకూ ఉన్న అధ్యాయాలను జ్ఞాన షట్కము అంటారు. దీనిలో పద్నాలుగవ అధ్యాయం, గుణత్రయ విభాగ యోగము. ఈ రోజుటి మన వీడియోలో, గుణత్రయ విభాగ యోగములోని, 05 నుండి 08 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/wK2c-rdTcMI ] నాశములేని నిత్య జీవాత్మను, నశ్వర దేహమునకు బంధించేవి ఏంటో, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు.. 00:49 - సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతిసంభవాః । నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ।। 5 ।। ఓ మహా బాహువులుగల అర్జునా.. భౌతిక ప్రాకృతిక శక్తి అనేది, సత్త్వ గుణము, రజో గుణము, మరియు తమో గుణమను త్రిగుణములను కలిగి ఉంటుంది. ఈ గుణములే, నాశములేని నిత్య జీవాత్మను, నశ్వర దేహమునకు బంధించును. పురుషుడు, మరియు ప్రకృతి చేతనే, సమస్త జీవ రాశులూ ఉద్భవించాయని చెప్పిన శ్రీ కృష్ణుడు, ఇప్పుడు ప్రకృతి జీవాత్మను ఎలా బంధించివేస్తుందో, వివరించబోతున్నాడ