Posts

Showing posts from October, 2022

సప్తబుుషులు ఆకలిబాధతో ‘శవాన్ని తినడానికి సిద్ధపడ్డారా’?

Image
సప్తబుుషులు ఆకలిబాధతో ‘శవాన్ని తినడానికి సిద్ధపడ్డారా’? ధర్మరాజుతో భీష్ముడు చెప్పిన ‘సప్త బుుషులు - వృషాదర్భి మహారాజు కథ’! భీష్ముడు అంపశయ్యపై ఉన్నప్పుడు, ఎన్నో గొప్ప గొప్ప విషయాలను ధర్మరాజుకు తెలియజేశాడు. రాజ్యాన్ని ఎలా పాలించాలి? ప్రజలను ఎలా చూసుకోవాలి? రాజనీతి, రాజపాలనకు సంబంధించీ, సమాజ జీవనానికి సంబంధించీ, అనేక ఉదాహరణలతో క్షుణ్ణంగా వివరించాడు, భీష్మ పితామహుడు. గాంగేయుడు తెలియజేసిన అనేక ధర్మ సూక్ష్మాల సంగ్రహణం నుండి, ఈ రోజుటి మన వీడియోలో, దానానికి సంబంధించి ధర్మరాజు అడిగిన ప్రశ్న, దానికి భీష్ముడు తెలియజేసిన సప్త బుుషులు - వృషాదర్భి మహారాజు కథను తెలుసుకుందాము. మరి ఆ కథేంటో, అందులో భీష్ముడు తెలియజేసిన నీతేంటో తెలుసుకోవాలనుకుంటే, ఈ వీడియోను చివరిదాకా చూడండి. మొత్తం వీడియో చూడకుండానే దయచేసి ఎవరూ కామెంట్ చేయవద్దని మనవి. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/XqWXGXTEZ8g ] ధర్మరాజు భీష్ముడితో, "పితామహా! ఉన్నదాంట్లో ఇతరులకు దానం చేసే వాడూ, ఎవరి వద్దా ఉచితంగా ఏమీ తీసుకొననివాడూ, వీరి గుణములు ఎలాంటివి?" అని అడిగాడు. అందుకు సమాధానంగా భీష్ముడు, "ధర్మనందనా! ఈ సందర్భంలో న

మూలహేతువు! భగవద్గీత Bhagavadgita

Image
మూలహేతువు! వ్యక్తిని ఉన్నతమైన స్థాయికి చేర్చేదేమిటి? 'భగవద్గీత' దశమోధ్యాయం - విభూతి యోగం (38 – 42 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదవ అధ్యాయం, విభూతి యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విభూతి యోగములోని 38 నుండి 42 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. [ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/fOgRdtl3lig ] శ్రీ కృష్ణుడు తన మహిమలను ఇలా వివరిస్తున్నాడు.. 00:43 - దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతామ్ । మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్ ।। 38 ।। న్యాయరాహిత్యాన్ని నివారించటానికి ఉన్న విధానాలలో, నేను ధర్మబద్ధమైన శిక్షనూ, జయాభిలాష గలవారిలో సత్ప్రవర్తననూ, రహస్యములలో నేను మౌనమునూ, జ్ఞానులలో జ్ఞానమును నేనే. మానవ స్వభావం ఎలాంటిదంటే, జనులలో మంచి నడవడిక కోసం, కేవలం ధర్మోపదేశం మాత్రమే సరిపోదు. సరియైన సమయంలో, న్యాయబద్ధంగా ఇవ్వబడిన దండన, మంచి నడవడిక, శిక్షణకూ మరియు పాపిష్ఠి ప్రవర్తన యొక్క సంస్కరణకూ సహకరించే ముఖ్యమైన ఉపకరణము. దీని లక్ష్యాల్లో ఒకటేమిటంటే, సమాజంలో చెడు పను

విభీషణుడి కుమారుడు ‘నీలుడి కథ’! Purushottama Kshetra / Neeladri

Image
దేవలోకంపై యుద్ధానికి వెళ్ళిన అసురుడు నీలాచలేశ్వరుడిగా వెలిశాడా? చింతామణి, కామధేనువు, కల్ప వక్షం అనేవి, దేవతా వస్తువులు. కానీ, అటువంటి అద్భుత వస్తువులను అసురుడైన నీలుడు సంపాదించుకున్నాడు. విభీషణుడి కుమారుడైన నీలుడు, పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించి వరం సంపాదించి, ఇంద్రుడిపై యుద్ధం చేశాడు. దేవతలపై యుద్ధం చేయడానికి వెళుతున్న నీలుడిని, రామభక్తుడైన విభీషణుడు ఎందుకు అడ్డుకోలేదు? అసురుడైన నీలుడికి గురువైన శుక్రాచార్యుడిచ్చిన సలహా ఏంటి? దేవతా స్త్రీలలోని అత్యంత సుందరీమణి అయిన వన సుందరిని, నీలుడు ఎలా పొందాడు - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/pGLkcLVZvBA ] రావణ వధ తర్వాత, లంకాపూరికి విభీషణుడు పట్టాభిషిక్తుడయ్యాడు. ఆయన ధర్మబద్ధంగా రాజ్య పాలన చేస్తుండేవాడు. విభీషణుడి కొడుకు పేరు నీలుడు. ఇతడు గుణమూ, బలమూ, విద్యలలో మేటి. ఒక సారి నీలుడు, తండ్రి విభీషణుడి దగ్గరకు వెళ్ళి నమస్కరించి, ఇలా అన్నాడు. "తండ్రీ! మీ పరిపాలనలో ప్రజలంతా సుఖ, సంతోషాలతో వర్ధిల్లుతున్నారు. వారికేమీ లోటు లేదు. మనకు ధన సంపదలకు కొదవ కూడా లేదు. అయినా మన రా