Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, February 20, 2023

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home


పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? వారికి రోజూ నైవేద్యం పెట్టాలా?

పుట్టిన వాడు మరణించక తప్పదు, మరణించినవాడు మరల జన్మించిక తప్పదని, భగవద్గీతలో గీతాచార్యుడు ఎంతో స్పష్టంగా చెప్పాడు. జనన మరణాల మధ్య జరిగే జగన్నాటకంలో, మనమంతా కేవలం పాత్రధారులము మాత్రమే అని పెద్దలంటూ ఉంటారు. ఇది నాటకమో, జీవితమో చెప్పడం కష్టంకానీ, పోయిన వాళ్ళను తలుచుకుంటూ, బ్రతికున్న రక్త సంబంధీకులూ, ఆత్మీయులూ, తక్కిన జీవితం గడిపేస్తూ ఉంటారు. ఈ క్రమంలో, పోయిన వారి గుర్తుగా ఫోటోలను కూడా ఇంట్లో ప్రత్యేకంగా పెట్టుకుంటారు. అయితే, ఈ ఫోటోలకు రోజూ నైవేద్యం పెట్టవచ్చా? వారి ఫోటోలను దేవుడి మందిరంలోనే పెట్టుకుని పూజించవచ్చా? అసలు పోయిన వారి ఫోటోలను, ఏ దిక్కున పెట్టుకోవాలి? వంటి సందేహాలేన్నో మనలో చాలా మందికి కలుగుతుంటాయి.

మనిషి జీవితంలో చేసే ప్రతి పనిలో పాటించాల్సిన కొన్ని నియమాలను, మన హైందవ ధర్మంలో ఎంతో స్పష్టంగా చెప్పబడి ఉంది. అందులోనూ, జనన మరణాల విషయంలో, ఈ నియమాలు ఎంతో కఠినంగా, ఎంతో స్పష్టంగా ఉన్నాయి. ఆ నియమాలను పాటించడంలో, ఏ చిన్న పొరపాటు జరిగినా, ఆ తర్వాత సంభవించే పరిణామాలు, ఎంతో దారుణంగా ఉంటాయని, పెద్దలు చెబుతున్నారు.

మరీ ముఖ్యంగా, చనిపోయిన వారి విషయంలో పాటించాల్సిన ఏ చిన్న నియమాన్నీ ఉల్లంఘించకూడదు. అటువంటి నియమాలలో, చనిపోయిన వారి ఫోటోల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా ఉన్నాయి. చాలా మంది, ఇంట్లో చనిపోయిన పెద్దల ఫోటోలను, ఎక్కడపడితే అక్కడ పెడుతూ ఉంటారు. మరి కొంతమంది, ఏకంగా దేవుడి గదిలోనో, దేవుడి పటాల ప్రక్కనో పెట్టి, భగవంతుడికి నిత్య పూజ చేసినప్పుడు, చనిపోయినవారికి కూడా ప్రసాదాలను నివేదించడం, మంగళ హారతులు ఇవ్వడం వంటివి చేస్తారు. ఆ విధంగా చేస్తే, ఆ ఇంట్లోని వారు దైవానుగ్రహాన్ని పూర్తిగా కోల్పోయి, ఎన్నో ఇబ్బందులు పడే అవకాశం ఉందని, శాస్త్ర వచనం.

అసలు చనిపోయిన పెద్దల ఫోటోలు, కేవలం దక్షణం దిక్కున తప్ప, మరెక్కడా పెట్టకూడదు. దక్షిణం దిక్కున మరణించిన వారి ఫోటోలు తప్ప, దేవుడి ఫోటోలూ, బ్రతికున్న వారి ఫోటోలూ పెట్టకూడదని, శాస్త్ర వచనం. ఇక గతించిన వారికి నైవేద్యం కూడా, ప్రతి రోజూ పెట్టకూడదు. కేవలం వారి జయంతి, వర్ధంతి రోజులలో మాత్రమే, బ్రతికి ఉన్నప్పుడు వారు ఇష్టంగా తిన్న రెండు మూడు వంటలు పెట్టాలి. అంతేకాదు, ఆ రోజు.. పోయినవారి పేరు చెప్పి, వస్త్ర దానం, అన్న దానం లాంటివి కూడా చేస్తే మంచిది.

సర్వేజనాః సుఖినోభవంతు!

Where to hang dead person photo as per Vastu!

You can place the pictures of our late family members in the south direction facing towards the north direction. You can also place the photos in the southwest direction. You should not keep them in the east, west, or north direction. This is all on the dead person photo direction.

Important Vastu Tips Regarding the Photos of Dead Person:

1. The ancestor photo as per Vastu should not be kept in any place in the middle of the home.
2. The photos should not be placed at any place from where they can be seen directly while leaving or entering the house.
3. You should not place photos of a dead person in your bedroom or at multiple places in your house. 
4. You should not place photos of any dead person outside of your family.

Saturday, February 18, 2023

శివరాత్రి నాడు అభిషేకం చేస్తూ ఏ మంత్రాన్ని జపిస్తే మంచిది? Abhisheka Mantra


శివరాత్రి నాడు అభిషేకం చేస్తూ ఏ మంత్రాన్ని జపిస్తే మంచిది?

ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడని, శాస్త్ర వచనం. అంతేకాదు, ఆ శివయ్యకు.. పాలు, నీళ్ళు, పంచదార, పంచామృతాలు, ఇలా ఒక్కో రకమైన ద్రవ్యంతో అభిషేకం చేస్తే, ఒక్కో విధమైన ఫలితం ఇస్తాడాని, వేదాలు చెబుతున్నాయి. అందులోనూ, మహా శివరాత్రి లాంటి పర్వదినంలో, పరమేశ్వరుడికి చేసే అభిషేకాలు, మరింత పుణ్యం చేకూరుస్తుందని, శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల, రాబోయే శివరాత్రి నాడు, భక్తకోటి మొత్తం, స్వయంగా శివ లింగానికి అభిషేకం చేయాలని, ఆశిస్తారు. అయితే, ఇలా అభిషేకం చేసే సమయంలో, ఏ విధమైన మంత్రాలు చదవాలి? ఏ మంత్రాలు చదివితే స్వామిని ప్రసన్నం చేసుకోగలం? అనే సందేహాలు, మనలో చాలా మందికి ఉంటాయి. మరి ఆ సందేహాలకు సమాధానాలు చూడండి.

భక్తితో, త్రికరణ శుద్ధిగా పోసే చెంబెడు నీళ్ళు చాలు, ఆ భోళా శంకరుడి కరుణకు పాత్రులవ్వడానికని, పెద్దలు చెబుతూ ఉంటారు. అభిషేక ప్రియుడిగా పేరు తెచ్చుకున్న ఆ పరమేశ్వరుడికి, ఎన్ని పూజలు చేసినా, కాసిన్ని నీళ్ళతో కానీ, ఆవు పాలతో కానీ అభిషేకం చేస్తే, మన బాధలన్నీ దూరం చేసేస్తాడు. అందుకే, ఆ స్వామికి ప్రపంచ వ్యాప్తంగా, ప్రతి రోజు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. అందులోనూ, శివరాత్రి నాడు స్వామికి అభిషేకం చేయడం ద్వారా, మరింత ఉత్తమమైన ఫలితం పొందవచ్చని, శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, అలా చేసేటప్పుడు, ఏ మంత్రం చదవాలనే సందేహం మనలో చాలా మందికి ఉంటుంది.

సాధారణంగా, ఆలయాలలో కానీ, వేదం చదినవారు కానీ, గురు ముఖతా మంత్రం నేర్చుకున్నవారు కానీ, శివ లింగానికి అభిషేకం చేసేటప్పుడు.. నమకం, చమకం, రుద్రం వంటివి ఎక్కువుగా చదువుతూ ఉంటారు. అయితే, వీటిని చదవడానికి కొన్ని నియమాలు ఉండటం వలన, పైన చెప్పిన విధంగా నేర్చుకున్నవారు తప్ప, తక్కినవారు ఆ మంత్రాలను చదవకూడదు. ఇలా వేద విరచితమైన నమక, చమకాలను చదవలేనివారు,

మహాదేవ మహాదేవ మహాదేవ దయానిధే 
భవానేవ భవానేవ భవానేవ గతిర్మమ ।।

అనే మహా దేవ శ్లోకాన్ని పఠించడం ఉత్తమమని, పండితులు చెబుతున్నారు. అది గుర్తులేని వారు, “ఓం నమః శివాయ” అనే శివ పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ శివ లింగానికి అభిషేకం చేయవచ్చు.

ఓం నమః శివాయ!

Friday, February 17, 2023

సత్కర్మలు చేస్తే సత్ఫలితాలే వస్తాయి! Karma Siddhantha


మన జీవితాలలో చాలా కష్టాలకు కారణం పూర్వ జన్మ కర్మలే!

ప్రారబ్ద కర్మ ఎలా ఉంటుందో పురాణాలలోనే కాకుండా, నిత్య జీవితంలో కూడా అనుభవిస్తూ ఉంటాం మనం!

రాముడు దండకారణ్యంలో 14 ఏళ్ళు అరణ్యవాసం చేయడానికి కారణం ఒక మహా పతివ్రత శాపం!

సత్య యుగంలో దేవాసుర సంగ్రామ సమయంలో, మృత సంజీవనీ మంత్ర బలంతో, చావు లేకుండా, దౌర్జన్యాలు చేస్తున్న రాక్షసులను తుద ముట్టించడానికి, శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. తనను శరణు వేడిన రాక్షసులను తన ఆశ్రమంలో దాచి, వారిని చంపకుండా తాను గుమ్మం ముందు నిలుచుందా ఋషి పత్ని!

విధి లేక శ్రీమహావిష్ణువు, ఆమెను కూడా రాక్షస సంహారంలో భాగంగా, తన సుదర్శన చక్రంతో హతమార్చాడు. ఇది తెలిసి అక్కడికి వచ్చిన మహా తపోధనుడైన ఆమె భర్త, హతురాలై పడి ఉన్న భార్య శవాన్ని చూసి విలపిస్తూ, శ్రీమహావిష్ణువును శపించాడు. తన భార్యను హతమార్చి, తమకు పత్నీ వియోగం కల్పించినందుకు గాను, అతడు కూడా భార్యా వియోగంతో బాధపడాలని శపించాడు! అందుకే త్రేతాయుగంలోని రామావతారంలో, రాముని వనవాసానికి కైక, మందర లేదా దశరథుడు కారణం కాదనీ, వారు నిమిత్త మాత్రులనీ స్పష్టమౌతున్నది.

ఇక్కడ మనం గమనించ వలసినది, అవతార పురుషుడైన శ్రీరాముడికి కూడా కర్మానుభవం తప్పలేదు. అలాగే, రామునికి పట్టాభిషేకం నిర్ణయించినప్పుడు, రాత్రికి రాత్రి, అనుకోని విపరీత పరిణామాలు చోటు చేసుకున్న సందర్భంలో, కైకమ్మ వరాల విషయంగా వనవాసం చేయడానికి వెళ్తున్న రాముడిని చూసి, లక్ష్మణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు.. "ముసలి తండ్రిని చంపి, రాముడి పట్టాభిషేకానికి అడ్డుగా వచ్చిన వారెవరైనా సరే, వారిని వధిస్తాను” అని అన్నాడు.

అప్పుడు రాముడు తమ్మునితో, “నాయనా! నేనంటే అపరిమిత ప్రేమ కలిగిన తండ్రిగారు, నిన్నటి రోజున నాకు పట్టాభిషేకం నిర్ణయించి, ఇప్పుడు మౌనంగా ఉండటం, ఆయన తప్పు కాదు. అతి బలీయం, విధి విధానం! అది ఎంత బలవత్తరంగా ఉంటుందో ముందుగా తెలుసుకో. పైగా, నాకు వనవాస యోగం ఉందని ప్రాజ్ఞులు చెప్పి ఉన్నారు. ఈ ప్రారబ్ద కర్మను తప్పించడం ఎవరి తరమూ కాదు. కనుక కోపాన్ని తగ్గించుకుని, తండ్రి ఆజ్ఞను పాలించేందుకు నీవు నాకు సహకరించు లక్ష్మణా!” అని అన్నాడు.

భగవద్గీతలో చెప్పిన "స్థితప్రజ్ఞత" అంటే ఇదే! కష్టాల్లో కృంగిపోవడం, సుఖాల్లో పొంగిపోవడం కాకుండా, వాటిని దైవానుగ్రహంగా భావించడం, తన కర్మానుభవంగా గుర్తించడమే భావ్యం.." అని రాముడి నడవడి ద్వారా మనం గ్రహించాలి.

భగవద్గీతలోని 18వ అధ్యాయం, 61వ శ్లోకంలో, “ప్రతీ జీవునిలో అంతర్యామిగా ఉంటూ, జీవుడి కర్మలకు అనుగుణంగా బుద్దిని ప్రేరేపిస్తూ ఉంటాను!" అని గీతాచార్యుడు చెప్పినట్లుగా, సీతారాముల కష్టాలకు కారణం, వారి పూర్వ జన్మల కర్మలే అని మనము తెలుసుకోవాలి.

వారే కాదు.. భూమిపై జన్మించిన ఏ ప్రాణి కూడా కర్మలకు అతీతుడు కాడు. దానికి ఎవరినో బాధ్యులను చేయకూడదు. మనం కర్మలు చేయవలసిందే, ఆ కర్మల ఫలితం, సుఖమైనా, దుఃఖమైనా, ఇష్టమున్నా లేకున్నా, రాముడైనా, కృష్ణుడైనా, అనుభవించ వలసిందే.

చెట్టు చాటున దాక్కుని వాలిని ఒక్క బాణం వేటుకు హతమార్చిన రాముడు, ద్వాపరయుగంలోని తన మరుజన్మ అయిన కృష్ణావతారంలో, అవతార పరిసమాప్తి సమయంలో, తన నిర్యాణం కోసం అదే బాణం దెబ్బకు ఒక వేటగాడి చేతిలో కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పలేదు.

మరో దృష్టాంతం.. ద్రౌపది వస్త్రాహరణం చేసిన దుష్ట చతుష్టయంతో బాటు, తమ కళ్ళ ముందు జరిగిన ఒక అబలపై అత్యాచారాన్ని ఆపకుండా, చూస్తూ ఉండిపోయిన మహానుభావులు భీష్మ, ద్రోణ, కృపాచార్యులు కూడా, జరిగిన పాపాన్ని పంచుకోక తప్పలేదు. భారత మహాసంగ్రామంలో మిడతలలా మాడిపోయారు.

అలా అన్యాయం చేస్తున్న వారితో బాటు, సమర్థత ఉండీ, అన్యాయం జరగకుండా అడ్డుకునే శక్తి ఉండి కూడా, చూస్తూ మిన్నకుండి పోయినవాళ్లు కూడా అంతే పాపాత్ములుగా పరిగణించబడతారని మనం గుర్తెరగాలి. కనుకనే శిక్షకు పాత్రులవుతున్నారు. ఎంతటి ప్రజ్ఞా శాలియైనా, తాను చేసిన కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు.

రామాయణ, భారత, భాగవతాలన్నీ, “సత్కర్మలు చేస్తే సత్ఫలితాలే వస్తాయి” అని బోధిస్తున్నాయన్న విషయం మనం గ్రహించాలి.

దేవుడు మనిషికి రెండు వరాలు అనుగ్రహించాడు. ఒకటి జ్ఞానం, రెండు మాట్లాడే ప్రతిభ. వీటిని తమ తమ జీవితాలలో, సత్ ప్రవర్తన, సత్ చింతనతో సద్వినియోగం చేసుకోవాలి. ఉత్కృష్టమైన మానవ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇదే పరమాత్మ ఆంతర్యం కూడా.

పర పీడనం, పాపాన్నీ, తాపాన్నీ కలిగిస్తుంది. నవ్వులాటకైనా ఏ ప్రాణినీ హింసించ కూడదు. ఎందుకంటే, అన్ని శరీరాలలోనూ ఉన్నది పరమాత్మయే. అతడు అంతర్యామిగా అంతటా ఉంటూ, అన్నీ గమనిస్తూ.. మనలోనే ఉంటూ, మన పాప పుణ్యాల కర్మలను లెక్క గడుతూ ఉన్నాడన్న సత్యాన్ని మరువ కూడదు.

ధర్మో రక్షతి రక్షితః!

Thursday, February 16, 2023

37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? Siva Ratri Puja


37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి?

సకల లోక రక్షకుడూ శిక్షకుడూ ఆ పరమేశ్వరుడొక్కడే అని, వేదాలు సుస్పష్టంగా చెబుతాయి. కంటికి కనపడని సూక్ష్మ జీవుల నుంచి, సృష్టిని నడిపించే శక్తుల వరకూ, అన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయి. అందుకే యుగ యుగాలుగా ఆ స్వామిని ప్రసన్నం చేసుకోడానికీ, ఆయన కరుణకు పాత్రులవ్వడానికీ, సమస్త ప్రాణి కోటీ ఎంతగానో పరితపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన శివ రాత్రి పర్వదినం నాడు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్త కోటి మొత్తం ఆయనను విశేషంగా పూజిస్తారు. అందులోనూ, ఈ సారి శివరాత్రి పర్వదినంతో పాటు, శనిత్రయోదశి కూడా వచ్చింది. అందుకే ఈ 2023 మహాశివరాత్రి చాలా విశేషమయినది, అరుదైనది. ఇటువంటి కలయిక, ఇంతకు మునుపు 26-2-1881, 23-2-1952, 8-3-1986 తేదీలలో, ఇప్పుడు 18-2-2023 న, తరువాత ఈ శతాబ్దిలో మళ్ళీ 34 ఏళ్లకు, అంటే 3-3-2057 న, ఆ తరువాత 37 ఏళ్ళకు అంటే, 13-2-2094 న ఏర్పడుతుంది. ఇదొక అద్భుత యోగం, మరియు అత్యంత పుణ్యకాలం. ఇది మన తరానికి రావటం మన అదృష్టం. దినదిన గండంగా జీవనం సాగిస్తున్న ఈ కాలంలో, మరో 34 ఏళ్ల నిరీక్షణ అందరికీ సాధ్యపడకపోవచ్చు. కావున, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంటూ, ఆత్మీయులందరికీ తెలియజేయగలరు. ఎన్నో ఏళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఇటువంటి మహత్తర పర్వదినం నాడు ఏ విధమైన పూజలు చేయాలి? ఉపవాసం ఏ విధంగా చేయాలి? జాగరణ ఎలా చేయాలి? వంటి విషయాలు ఈ రోజు తెలుసుకుందాము.. 

సాధారణంగా ప్రతి సంవత్సరం పర్వదినాలు వస్తూ ఉంటాయి. కానీ, కొన్ని సందర్భాలలో మాత్రం, కొన్ని పుణ్య తిధులూ, నక్షత్రాలూ, వారాలూ కలవడం వల్ల, ఒకేరోజు రెండు పర్వదినాలు కలిసివస్తూ ఉంటాయి. అటువంటి పర్వదినాలను మహా పర్వదినాలనీ, అతి పవిత్రమైన రోజులనీ, ఆ రోజున చేసే పూజల ఫలితాలు, మరింత ప్రభావవంతంగా దక్కుతాయనీ, పండితులు చెబుతూ ఉంటారు. అంతేకాదు, మళ్ళీ అటువంటి పర్వదినం చూడాలంటే, మూడు దశాబ్దాలపైనే ఆగాల్సి వస్తుందని కూడా అంటున్నారు. అటువంటి మహత్తర పర్వదినమే, ఈ సంవత్సరం వస్తున్న శివరాత్రి అని, పండిత వచనం.

ఈసారి శివరాత్రితో పాటు, శని త్రయోదశి కూడా కలిసి వచ్చింది. ఇలా ఎన్నో సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సాధ్యపడుతుందని, శాస్త్రాలు చెబుతున్నాయి. అందువల్ల, ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ, బ్రహ్మ ముహూర్తంలోనే లేచి, కాలకృత్యాలు తీర్చుకుని, తల స్నానం చేసి, శుచిగా, దగ్గరలో ఉన్న శివాలయనికి వెళ్ళి, ముందుగా శనీశ్వరుడికి తైలాభిషేకం కానీ, నువ్వుల అభిషేకం గాని చేస్తే, శని బాధలు పోయి, అన్ని విధాలా మంచి జరుగుతుందని తెలుస్తోంది.

ఇలా చేసిన తర్వాత, గుడి వద్దనే కాళ్ళు కడుక్కుని, ఆ వెంటనే పరమేశ్వరుడిని దర్శించుకోవడమో, కుదిరితే అభిషేకం చేయించుకోవడమో చేయాలని పండితులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల, ఈశ్వరుడి కరుణ, శనైశ్చరుడి కటాక్షం కలిగి.. ఆర్ధిక, ఆరోగ్య ఇబ్బందులన్నీ తొలగి, కుటుంబంతో సంతోషంగా గడుపుతారని, శాస్త్ర విదితం.

ఇక ఆ రోజు పూర్తి ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఉపవాసం చేసేటప్పుడు నీరసంగా అనిపిస్తే, కేవలం పళ్ళు మాత్రమే తీసుకోవచ్చు. వండిన పదార్థాలేవీ తీసుకోకుడదు. ఇక అర్ధ రాత్రి 12 గంటల వరకు మెలకువుగా ఉండి, సరిగ్గా లింగోద్భవ కాలంలో, కుదిరితే ఆ ప్రమేశ్వరుడికి నీళ్ళతో అభిషేకం చేస్తే, ఎంతో మంచి జరుగుతుంది. అభిషేకం చేయడానికి కుదరని వారు, ఆ సమయంలో కనీసం, 108 సార్లు శివ పంచాక్షరీ మంత్రాన్ని పఠించాలని పండితులు చెబుతున్నారు. ఇక ఓపిక ఉన్నవారు రాత్రంతా జాగారం చేసి, దైవ నామ స్మరణ చేయడమో, లేక పురాణ పారాయణమో వినడమో వంటివి చేయాలి. తెల్లవారిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకుని, తలస్నానం చేసి, పరమేశ్వరుడికి పరమాన్నం నైవేద్యంగా సమర్పించి, ఆ ప్రసాదాన్ని తొలిగా స్వీకరిండం ద్వారా శివరాత్రి ఉపవాస దీక్ష ముగుస్తుంది. ఈ విధంగా ఈ సారి శివరాత్రి పర్వదినాన్ని చేసుకున్నవారికి, ఆర్ధిక ఇబ్బందులు తొలగి, సకల శుభాలూ కలుగుతాయి.

ఓం నమః శివాయ!

Wednesday, February 15, 2023

శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించవచ్చా? Worshiping Shiva Linga at home


శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించవచ్చా?

శివుడు అభిషేక ప్రియుడనే నానుడి యుగయుగాలుగా, భక్తుల మనస్సులలో నాటుకుపోయి ఉంది. క్షీర సాగర మధనంలో, లోక సంకటమైన కాలకూట విషం ముందుగా ఉద్భవించగా, ఆ విషాన్ని తన కంఠంలో దాచుకుని, గరళకంఠుడనే పేరును స్థిరపరుచుకున్నాడా పరమేశ్వరుడు. అలా తాను మింగిన విషం వలన కలిగే తాపం నుంచి రక్షించుకోవడానికే, ఆ స్వామి హిమగీరులపై నివశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అదే కారణాన ఆయన అభిషేక ప్రియుడిగా కూడా పేరుగాంచాడు. అలా అభిషేకం చేయడం ద్వారా శివయ్య త్వరగా ప్రసన్నం చెంది, కోరిన కోర్కెలు తిరుస్తాడాని, శాస్త్ర వచనం. అందుకే అనాదిగా మానవులనుంచి, దేవతల వరకు, ఆ పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోడానికి అభిషేకాలు చేస్తూ ఉన్నారు. అందులోనూ శివ రాత్రి నాడు స్వామికి చేసే అభిషేకం వల్ల మరింత పుణ్య ఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అయితే, శివరాత్రి నాడు తమ ఇంట్లోనే శివయ్యకు అభిషేకం చేసుకోవాలనుకునే వారిలో చాలా మందికి, అసలు ఆ స్వామికి ఏవిధమైన లింగం పెట్టుకుని అభిషేకం చేయాలి? అసలు ఇంట్లో శివ లింగానికి అభిషేకం చేసుకోవచ్చా, లేదా? అనే సందేహాలు కలుగుతుంటాయి.

ఈ సృష్టిలో ఉన్న అతి శక్తివంతమైన ప్రతిమలలో, శివలింగాలు చాలా ముఖ్యం. సాక్ష్యత్తు ఆది దేవుడైన పరమేశ్వరుడే లింగాకారంలో భక్తులను రక్షిస్తున్నాడని వేదాలు చెబుతున్నాయి. అటువంటి శివ లింగాన్ని ప్రతిష్టంచాలన్నా, పూజించాలన్నా, ఎన్నో విధి విధానాల గురించి వేదాలలో చెప్పబడ్డాయి. వాటిలో ఏ ఒక్కటి సరిగ్గా పాటించకపోయినా శివగణాలు అస్సలు సహించవనీ, దాంతో తీవ్రమైన దుష్ఫలితాలను చవిచూడాల్సి వస్తుందనీ పండితులు చెబుతున్నారు. ఈ కారణంగానే, శివలింగాలను ఆలయాలలో తప్ప, ఇళ్ళలో పెట్టుకోకూడదని ఆర్యోక్తి.

అయితే, ఆ శివయ్యపై అమితమైన భక్తి ఉన్నవారు మాత్రం, ఇళ్ళలో ఖచ్చితమైన నియమాలు పాటిస్తూ, ఆ పరమేశ్వర లింగాన్ని ఇంట్లో పెట్టుకుని పూజలూ, అభిషేకాలూ చేస్తూ ఉంటారు. కానీ, అలా చేసేటప్పుడు కూడా, కొన్ని నియమాలను పాటిస్తారు. అవేమిటంటే, ముఖ్యంగా ఇళ్ళలో పెట్టుకునే శివలింగం, మన బొటనివేలు పరిమాణం కంటే ఎక్కువ పొడవు ఉండకూడదు. ఆ సైజులో లింగాన్ని తెచ్చుకున్నా, అది స్వచ్ఛమైన స్పటికతో చేసిన శివలింగాన్ని మాత్రమే తెచ్చుకోవాలి. కేవలం శివరాత్రి నాడు మాత్రమే కాకుండా, ఆ లింగం ఇంట్లో ఉన్నన్ని రోజులూ, శుచిగా శివయ్యకు పూజా పునస్కారాలూ, అభిషేకాలూ, ఖచ్చితంగా చేయాలి. ఆ ఇంట్లో ఉండే ఆడవారికి నెలసరి వస్తే, ఆ ఐదు రోజులూ ఎవరినీ ముట్టుకోకుండా ఓ పక్కనే ఉండాలనీ, అలా చేయకపోతే, ఇల్లంతా మైలు అయ్యే అవకాశం ఉందనీ, దాని వల్ల శివ లింగ నియమాలకు భగం వాటిల్లుతుందనీ పెద్దలు చెబుతున్నారు. అందుకే ఇంట్లో శివ లింగాన్ని పెట్టుకుని అభిషేకం చేయాలనుకునేవారు, ఈ నియమాలన్నీ తప్పక పాటించాలి.

అయితే, కేవలం శివ రాత్రి నాడు మాత్రమే, ఇంట్లో శివాభిషేకం చేసుకోవాలనుకునేవారి కోసం, మరో ఉపాయాన్ని కూడా వేద పండితులు చెబుతారు. అదేమిటంటే, పుట్టమన్ను తెచ్చి, స్వచ్ఛమైన ఆవు నేతితో ఓ లింగాన్ని తయారు చేసి, బిల్వ పత్రాలూ, గరికనూ క్రింద పరచి, దానిపై పుట్ట మన్నుతో చేసిన లింగాన్ని ప్రతిష్టించి, ఆ రోజంతగా నిష్టగా శివయ్యకు పూజలూ, అభిషేకాలూ చేయాలి. శివ రాత్రి మర్నాడు ఆ లింగానికి ఉద్వాసన పలికి, దగ్గరలో పారే నదిలో ఆ లింగాన్ని కలపాలని, పండితులు చెబుతున్నారు.

ఓం నమః శివాయ!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...