Posts

ఛత్రపతి శివాజీ జయంతి 2025 Chhatrapathi Shivaji Maharaj Jayanthi

Image
అందరికీ 'ఛత్రపతి శివాజీ జయంతి' శుభాకాంక్షలు 💐 teluguvoice.in స్వతంత్ర మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి, హిందూ మతధర్మాన్ని పరిరక్షించిన ఘనత, ఛ‌త్ర‌ప‌తి శివాజీకే దక్కుతుందనడంలో అతిశయోక్తిలేదు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఖ్యాతి పోందిన శివాజీ రాజే భోంస్లే, 1630 ఫిబ్ర‌వ‌రి 19న షాహాజీ, జిజాబాయి పుణ్య దంప‌తుల‌కు జ‌న్మించాడు. శివాజీ తండ్రి, వ్య‌వ‌సాయ బోస్లే కులానికి చెందిన వారు. అత‌ను నిజాంషాహీల ప్రతినిధిగా ఉంటూ, మొఘల్ రాజులను వ్యతిరేకిస్తూ యుద్ధాల్లో పాల్గొనేవాడు. త‌ల్లి జిజాబాయి యాద‌వ క్ష‌త్రియ వంశ‌పు ఆడ ప‌డుచు. శివాజీకి ముందు పుట్టిన వారంద‌రూ మృతి చెందారు. దాంతో జిజాబాయి, తాను పూజించే పార్వ‌తీ దేవి మరోపేరైన శివై పేరును క‌లిపి శివాజీకి పెట్టింది. ఆమె సంర‌క్ష‌ణ‌లో పెరిగిన శివాజీ, రామాయ‌ణ‌ మ‌హాభార‌తాల‌ విశిష్ట‌తనూ, హిందూమ‌తం యొక్క గొప్ప‌త‌నాన్నీ తెలుసుకున్నాడు. ప‌ర‌మ‌త స‌హ‌నం, స్త్రీలను గౌర‌వించ‌డం, శివాజీకున్న గోప్ప ల‌క్ష‌ణం. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/it7JY1jp20A ] దాదాజీ ఖాండ్ దేవ్ ద‌గ్గ‌ర శిక్ష‌ణ తీసుకున్న శివాజీ, వీరుడిగా యుద్ద రంగంలో అడుగుపెట్టాడు. తండ్రి ప‌రాజ‌యాల‌...

దయ్యాలు కట్టిన భారీ శివాలయం Forgotten Shiva Temple Built by Ghosts in One Night

Image
ఒకే రాత్రిలో ‘దయ్యాలు కట్టిన భారీ శివాలయం’! Forgotten Shiva Temple Built by Ghosts in One Night మన దేశంలో ఎంతో అద్భుత శాస్త్ర పరిజ్ఞానంతో నిర్మించబడిన ఎన్నో పురాతన ఆలయాలున్నాయి. ఎటువంటి క్రేన్ లూ, ఆధునిక పరికరాలూ లేని కాలంలోనే మన పూర్వికులు, ఎంతో అద్భుతమైన ఆలయాలను నిర్మించారు. అటువంటి ఆలయాలను చూడటానికీ, ఆ నిర్మాణ నైపుణ్యంపై పరిశోధనలు చేయడానికీ, మన దేశం నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి కూడా శాస్త్రవేత్తలు వస్తుంటారు. కానీ, కొన్ని శతాబ్దాల క్రితం మన దేశంలో నిర్మింపబడిన ఓ ఆలయాన్ని, ఏ శాస్త్రవేత్త తాకే ప్రయత్నం చేయడంలేదు. కనీసం దాని దగ్గరకు వెళ్ళడానికి కూడా భయపడతున్నారు. ఎటువంటి ఆధునిక పరికరాలూ, సాంకేతికతా లేని ఆ కాలంలో, అంత భారీ ఆలయం కేవలం ఒక్క రాత్రిలో నిర్మించబడిందంటే నమ్మశక్యం కాదు. శాస్త్రవేత్తలకు ఆ ఆలయం జోలికి వెళ్ళాలంటే వెన్నులో వణుకు పుడుతుందని నిపుణులంటున్నారు. కొన్ని శతాబ్దాల క్రితం ఒక్క రాత్రిలో అంత భారీ ఆలయాన్ని ఎవరు, ఎలా నిర్మించారు? అంతటి అద్భుత కట్టడంపై పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్తలు ఎందుకు భయపడుతున్నారు? ఇంతకీ ఆ ఆలయాన్ని మనుషులే కట్టారా? అసలు ఆ ఆలయం ఎక్కడ ఉంది? దాని చరిత్...

Hidden Facts of Vikramaditya: The Legendary King of Ancient India | విక్రమాదిత్యుడి భైరవసేన!

Image
విక్రమాదిత్యుడి భైరవసేన! ఈజిప్ట్ ను వణికించిన ‘విక్రమాదిత్యుడు’! అరబ్ చరిత్ర పుటలలో కీర్తించబడిన హిందూ మహాపురుషుడు! The Great Wall Of China కీ విక్రమాదిత్యుడు చక్రవర్తి కావడానికీ సంబంధం ఉందా?  భూమి పొరల్లో మరుగుతూ దాగుండే లావా, సమయం వచ్చినప్పుడు ఎలా అయితే ఒక్కసారిగా ఉబికి బయటకు వస్తుందో, అలాగే చరిత్ర కూడా! ధూర్తులు ఎంత అణచిపెట్టే ప్రయత్నం చేసినా, తనలో దాచుకున్న మహాత్ముల గాధలను, సమయం వచ్చినప్పుడు బయటకు తీస్తుంది. అజ్ఞానంతో మూసుకుపోయిన కళ్ళను తెరిపిస్తుంది. అలా నేడు మళ్ళీ మన ముందుకు, చరిత్ర పదిలంగా దాచుకున్న ఓ మహా విరుడి గాధను తీసుకు వచ్చింది. భారత దేశంతో పాటు, ఆంగ్లేయుల సరిహద్దుల వరకు వ్యాపించిన ఆయన మహా సామ్రాజ్యపు ఎల్లలను మనకు చూపిస్తోంది. కలియుగంలో రామ రాజ్యాన్ని స్థాపించిన ఓ అజానాబాహుడి ఔచిత్యాన్ని నిరూపిస్తోంది. భారతీయ పురాతన గ్రంధాలలోనే కాకుండా, ఇస్లామిక్ చారిత్రక పుస్తకాలలో సైతం మహా పురుషుడిగా కీర్తించబడిన ఆ చక్రవర్తి గాధనూ, మనలో చాలా మందికి తెలియని ఆయన చరిత్రనూ, కుహనా మేధావులు దాచాలని ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్న ఇతిహాసాన్నీ, కేవలం చందమామ కథల్లో వినిపించే కాల్పనిక పాత్రగా మా...

భీష్మ ఏకాదశి 2025 Bhishma Ekadashi

Image
ఈ రోజు 08-02-2025 'భీష్మ ఏకాదశి' విశేషం   @TeluguVoice మాఘ శుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాము. శ్రీ విష్ణు సహస్రనామం భీష్మపితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తి అయిన తర్వాత భీష్మపితామహుడు అంపశయ్యపైనే ఉండి పొయ్యాడు. ఎక్కడి వాళ్ళు వారి వారి రాజ్యాలకు వెళ్ళి పోయారు. సుమారు నెల రోజులు గడిచాయి, పాండవులు శ్రీకృష్ణుడు సల్లాపాలు ఆడుకొనే ఒక సమయంలో ఒక నాడు హటాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుడిని అడిగారు. శ్రీకృష్ణుడు వారికి సమాధానం చెబుతూ "మాంధ్యాతి భగవాన్ భీష్మః తపోమే తద్గతం మనః" కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మపితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నామనస్సు అక్కడికి వెళ్ళి పోయింది. 'హే పాండవులారా! బయలుదేరండి, భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోశణం పట్టినవాడు. శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు. మానవాళి తరించడానికి కావల్సిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు. సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లానో అవగతం చేసుకొన్న మహనీయుడు. ధర్మ విషయం...

RAVANA'S LANKA: The Landscape of a Lost Kingdom | సముద్ర గర్భంలో కలిసిపోయిన రావణ లంక!

Image
సముద్ర గర్భంలో కలిసిపోయిన రావణ లంక! కుబేర నిర్మితం, స్వర్ణ శోభిత భవంతులతో దేదీప్యమానంగా వెలిగిన ప్రదేశం, ఆ యుగం చూడని అద్భుతమైన శాస్త్ర పరిజ్ఞానం కలిగిన నగరం, రావణ ఆక్రమిత ‘లంక’. అసుర రాజు ఏలిన లంక.. సీత మాత కన్నీటితో మలినమైన లంక.. హనుమ దహించిన లంక.. రాముడి చేతిలో పరాజయం పొందిన లంక.. నేడు మనకు కనిపిస్తున్న శ్రీలంక కాదా..? మరి రావణ పాలిత లంక నేడు ఉన్న శ్రీలంక కానప్పుడు, అసలు లంక ఎక్కడ ఉంది..? అలాంటప్పుడు ధనుష్కోటి నుంచి శ్రీలంకను కలుపుతున్న రామసేతు, రాముడు నిర్మించినదెలా అయ్యింది? రావణ లంక కుమారీ ఖండంలో భాగమా..? మరి ఇప్పుడున్న శ్రీలంక ఏమిటి? అసలు శ్రీలంకను రావణ లంకగా ఎందుకు భావిస్తున్నారు..? వంటి ఎన్నో సందేహాలకు సమాధానాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.. [ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ZgGKSd_PD_Q ] నేటి శ్రీలంక రావణ లంక కాదా? అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే, అసలు రామాయణం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది అనే విషయాలు స్పష్టంగా తెలియడానికి మనకు ముందుగా కనిపించే ఆధారం వాల్మీ...

Discover the REAL Story Behind Kumbh Mela! | 'కుంభ' మేళా! లక్షల సంవత్సరాల చరిత్ర!

Image
కుంభమేళా! లక్షల ఏళ్ల చరిత్ర! 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా! ఇదే నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన వార్తా పత్రికలలోనూ కనిపిస్తున్న ముఖ్య వార్త.. అన్ని దేశాలూ, అంతరీక్షంలో ఉన్న శాటిలైట్స్ సహాయంతో వీక్షించాలని తహతలాడుతున్న ఏకైక పరిణామం, ఆఖరికి ఇస్లాం పుట్టుకకు మూలమైన మధ్య ఆసియా దేశాల ప్రజల నుంచి, మన పొరుగునే ఉన్న పాకిస్తాన్ లోని జనాల వరకూ, ఒక్కసారైనా వెళ్ళాలని అనుకుంటున్న డెస్టినేషన్, అఖండంగా, ఆమోఘంగా, దేదీప్యమానంగా, ఏ బాష వర్ణనకీ అందనంత ఘనంగా మన దేశంలో జరుగుతున్న మహాకుంభమేళా గురించే అని చెప్పడం, ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు.. భారత దేశంలోని ఉత్తర్ ప్రదేశ్ లో గల ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకి తరలి వస్తున్న కోట్లాదిమంది భక్తులనూ, అక్కడికి వచ్చే ఎందరో నాగ సాధువులు, అఘోరాలు, యోగులూ, మహాపురుషుల వంటి వారిని చూసి, ప్రపంచం మొత్తం తాదాత్మ్యం చెందుతోంది. ఈ క్రమంలో ఇతర దేశస్థులతో పాటు, మన దేశంలో ఉన్న చాలా మందికి, అసలు కుంభమేళ అంటే ఏమిటి..? మహా కుంభమేళ విశిష్టత ఏమిటి..? ఇది ఎప్పుడు మొదలైంది..? ఎలా మొదలైంది..? కుంభమేళా పూర్తి చరిత్ర ఏమిటి..? వంటి ఎన్నో సందేహాలు కలుగుతాయి. మరి అటువంటి...

anjore Brihadeeswara: Ancient Secrets Revealed | 1000 ఏళ్ల క్రితం ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి?

Image
1000 ఏళ్ల క్రితం ఇవన్నీ ఎలా సాధ్యపడ్డాయి? నీడ నేలపై పడని అతి పెద్ద ఆలయ రహస్యం! ఆది మానవుడి పుట్టుక ఎప్పుడు సంభవించిందో తెలియదు కానీ, ముందుగా నాగరికత నేర్చి, మన దేశాన్ని విశ్వ గురువు స్థానానికి చేర్చిన ఘనకీర్తి పొందిన వారు మన పూర్వీకులు. నేడు భూమిపై అగ్ర రాజ్యాలుగా చలామణి అవుతున్న దేశాలలోని ప్రజలకు, కనీసం గుడిసెలు కట్టుకోవడం కూడా తెలియని సమయంలో, ఇక్కడ పెద్ద పెద్ద భవనాలూ, అద్భుతమైన మందిరాలూ నిర్మించబడ్డాయి. అలా ఆ నాడు కట్టబడిన అద్భుత నిర్మాణాలలో ఎన్నింటినో, గోరీ, బాబర్ వంటి ధూర్తులు నాశనం చేసినా, నేటికీ కొన్ని నిర్మాణాలు నాటి మనవారి నిర్మాణ కౌశలానికి సాక్షీభూతాలుగా నిలుస్తున్నాయి. అటువంటి కట్టడాలలో ఒక ఆలయం, మన దక్షణ భారత దేశంలోనే కొలువై ఉంది. మనకు అందుబాటులో ఉన్న వివరాల ప్రకరం ఆ ఆలయ నిర్మాణం ఓ వింత అయితే, దాని గోపుర నిర్మాణ పద్ధతి, ఓ అంతుచిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ప్రపంచలో మరెక్కడా లేని విధంగా, 13 అంతస్తుల ఎత్తైన ఆ ఆలయ గోపురం నీడ భూమిపై పడదు. ఇన్ని వింతలకూ రహస్యాలకూ నెలవై వున్న ఆ ఆలయం, మన దక్షిణ భారత దేశంలో ఎక్కడ ఉంది? దానిని ఎవరు, ఎప్పుడు నిర్మించారు? అసలు ఆ ఆలయం పేరేంటి? ఆ ఆలయ నిర...