DNA Study Sheds Light on 7000-Year-Old WAR! | DNA బయటపెట్టిన 7000 ఏళ్లనాటి చరిత్ర!
DNA బయటపెట్టిన 7000 ఏళ్లనాటి చరిత్ర!
కురుక్షేత్ర సంగ్రామం తరువాత భూమిపై మగవాళ్ల జనాభా తుడిచిపెట్టుకుపోయిందా?
‘D N A’ అంటే డియోక్సిరైబో న్యూక్లియిక్ ఆసిడ్ కణాలు.. ఒక మనిషి ఆరోగ్య స్థితిని తెలిపేది ఈ DNA.. ఏదైనా వింత రోగంతో బాధపడుతున్న వారి ఆ స్థితికి కారణం తెలియచేసేది DNA.. రక్త సంబంధాలనూ, వంశ మూలాలనూ తెలియచేసేది DNA.. కానీ ఇప్పుడు అదే DNA ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది. అదే DNA, ఒక చరిత్రను బయటపెట్టి, చరిత్ర పుస్తకాలను తిరగరాసేలా చేసింది. ఈ మాటలు వింటుంటే, మనిషి ఆరోగ్య స్థితిని అంచనా వేయడానికి మెడికల్ ఫీల్డ్ లో వాడే DNA, కనుమరుగయిన చరిత్రను తిరిగి మనుగడలోకి ఎలా తీసుకువచ్చింది..? DNA వల్ల బయటపడ్డ ఆ నిజాలు ఏమిటి..? అసలు ఈ పరీక్షలు ఎప్పుడు జరిగాయి..? వంటి ఎన్నో సందేహాలు కలగడం సహజం. అటువంటి సందేహాలన్నీటికీ సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/dNxXA8WkPNg ]
ఈ ప్రపంచంలో ప్రతి రోజు ఏదో ఒక ప్రయోగమో, పరిశోధనో జరుగుతూ ఉంటుందనే విషయం తెలిసిందే. ఇలాంటి ప్రయోగాల వల్లే ఆధునిక యుగానికి బాటలు పడ్డాయి. ఎన్నో ఆధునిక పరికరాలను కనుగొన్నాము. అంతు బట్టని ఎన్నో భయంకర వ్యాధులను సైతం జయించగలిగాము. అటువంటి ప్రయోగాలలో ఒకటే DNA. ఎంతో కాలంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు మనిషి మనుగడకు మూలమైన DNAపై ఎన్నో పరిశోధనలు చేస్తూ వస్తున్నారు. సాధారణంగా మనిషిలో వచ్చే జబ్బుల నుంచి, వంశ పారంపర్య రోగాలూ, అసాధారణ, వింత జబ్బుల వంటి వాటిని కూడా, DNA పరిశోధనలతో కనుగొన్నారు.
ఈ క్రమంలో కొంతమంది శాస్త్రవేత్తలు, DNA ఆధారంగా అసలు భూమిపై మనిషి పుట్టుక మొదట ఎక్కడ జరిగింది, అతను వేరు వేరు ప్రదేశాలకు ఎలా వెళ్ళాడు, ఇప్పుడు ప్రపంచంలో వివిధ దేశాలలో ఉన్న మనుషుల మూలాలు ఆ దేశంలోనే మొదలయ్యాయా? లేక పూర్వ కాలంలో వేరే ప్రాంతాల నుంచో వేరే ఖండాల నుంచో అక్కడికి వచ్చారా అనే విషయాలు తెలుసుకోడానికి, DNA పై చాలా ఏళ్లుగా ప్రయోగాలు చేస్తూన్నారు. ఈ క్రమంలో వారికి ఓ వింత సంఘటన ఎదురైంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం మనిషి చరిత్రను తవ్వి తీసే పనిలో, ఒక్కసారిగా వారికి లింక్ కట్ అయ్యింది.
2015 లో, DNA పై పరిశోధన చేసే ఓ శాస్త్రవేత్తల బృందం, ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఆ పరిశోధన ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మగాళ్ల బ్లడ్ లైన్ లో ఒక బ్రేక్ ఉందనీ, కొన్ని వేల ఏళ్ల క్రితం భూమిపై నుంచి దాదాపుగా మగవాళ్ల జనాభా తుడిచిపెట్టుకుపోయిందనీ గుర్తించారు. అదెలా అంటే, వైద్య పరి భాషలో X, Y chromosomes అనే పదాలు వినే ఉంటారు. గర్భంలో ఉన్న పిండం మగ బిడ్డగా మారబోతుందా, ఆడ బిడ్డగా రూపు దిద్దుకోబోతుందా అనే విషయాలు తెలియచేసేది, ఈ X, Y chromosomes. నేటి శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, ప్రతి మహిళలో రెండు X chromosomes ఉంటే, మగాళ్ల DNA లో ఒక X, ఒక Y chromosomes ఉంటాయి. స్త్రీ పురుషుల సంపర్కం జరిగినప్పుడు, మగవారిలో ఉండే Y chromosome వచ్చి మహిళ పిండలో చెరినప్పుడు, ఆమెలో ఉన్న X chromosome తో కలిసి, మగ బిడ్డ పుట్టుకకు కారణం అవుతుంది. అదే మగవాళ్ళలో ఉన్న X chromosome స్త్రీలోని X chromosome తో కలిస్తే, ఆడ బిడ్డగా రూపుదిద్దుకుటుంది.
ఈ theory ఆధారంగా, DNA పై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు, కొన్ని వేల ఏళ్ల క్రితం ఒక్కసారిగా భూమిపై నుంచి Y chromosome దాదాపుగా అంతమైపోయిందని తెలిసింది. అంటే, మగవాళ్ల blood line అంతరించి పోయి, కేవలం ఆడవాళ్ళ X chromosome మాత్రమే కొనసాగుతూ వచ్చిందని గుర్తించారు. దీనినే శాస్త్రవేత్తలు Neolithic Y chromosome Bottleneck అని పిలుస్తారు. ఎంత దారుణంగా అంటే, ప్రతి 17 మంది మగవాళ్లలో కేవలం 1 మగాడు మాత్రమే బ్రతికినట్లు ఈ పరిశోధన తెలియజేస్తోంది. ఈ షాకింగ్ discovery తో, ఉన్నట్లుండి మగాళ్ల జనాభా భూమిపై నుంచి తుడిచిపెట్టుకుపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి? అని అన్వేషణ మొదలు పెట్టారు. ఒకప్పుడు భూమిపై సంభవించిన ప్రకృతి ప్రళయాలూ, ఉన్నట్లుండి విరుచుకుపడే pandamic ల వంటి ఎన్నో విషయాల చుట్టూ వారి అన్వేషణ తిరిగి, వారి వెతుకులాట ఒక చోట ఆగింది. అదే మహాభారతం.
నేటి ప్రపంచం చూడని మహోన్నత చరిత్ర.. భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే ఇతిహాసం.. మహాభారతం. ద్వాపర యుగంలో జరిగిన ఈ గాథ ప్రతి హిందువుకూ సూపరిచితమే. ధర్మ రక్షణ కోసం జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొంటే, అందులో పాండవుల వైపు 7 అక్షౌహిణుల సైన్యం ఉండగా, కౌరవుల వైపు 11 అక్షౌహిణుల సైన్యం నిలిచిందని చరిత్ర చెబుతోంది. ఇందులో ఒక్కో అక్షౌహిణి, 21,870 రథాలూ, మరో 21,870 ఏనుగులూ, 65,610 గుర్రాలూ, 1,09,350 పదాతి దళ సైనికులతో కూడి ఉంటుంది. ఈ లెక్కన 18 అక్షౌహిణుల సైన్యం లెక్క ఎన్ని లక్షల్లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇంతమంది సైన్యం 18 రోజుల పాటు పోరాడగా, చివరకు మిగిలింది కేవలం రెండు పదులు కూడా లేరని తెలుస్తోంది. ఇలా మిగిలిన వారిలో ముఖ్యంగా శ్రీ కృష్ణ భగవానుడు, పంచ పాండవులు, కృత వర్మ, అశ్వత్థామ పేర్లు మాత్రమే మనకు తెలుసు.
శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ప్రకారం, దాదాపు 5 నుంచి 7 వేల ఏళ్ల క్రితం మగవారి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా అంతమైందనీ, ఆ కాలంలో ఇంచుమించు 4 నుంచి 5 మిలియన్ల మగవారు ఉన్నట్లుండి చనిపోయారనీ తెలుసుకున్నారు. అంతమంది మగవారు ఒక్కసారిగా చనిపోయారంటే, అది కేవలం యుద్ధంలో పాల్గొనడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ప్రపంచ యుద్ధ చరిత్రలో ఇన్ని లక్షల మంది చనిపోయేంత యుద్దం ఏదని అన్వేషించిన శాస్త్రవేత్తలకు, కురుక్షేత్ర మహాసంగ్రామం ఒక్కటే కనిపించింది. ఇంతకాలం ఇది హిందువులు మాత్రమే చెప్పుకునే ఒక కాల్పనిక కథగా భావించిన పాశ్చాత్య శాస్త్రవేత్తలకు, కురుక్షేత్ర సంగ్రామం నిజంగా జరిగిందనే విషయం మింగుడు పడలేదు. అయినా వేరే దారి లేక, మగవాళ్ల బ్లడ్ లైన్ మాయం అవ్వడానికీ, కూరుక్షేత్రానికీ ఉన్న లింకులు వెతకడం మొదలు పెట్టారు. అప్పుడే వారికి కొన్ని ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి.
కురుక్షేత్ర యుద్ధంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో రాజ్యాల రాజులూ, వారి సేనలూ, కురు పాండవుల ఇరు పక్షాలలో ఏదో ఒక పక్షాన ఉండి యుద్ధంలో పాల్గొన్నాయని, మహాభారతంలో పేర్కొన బడి ఉంది. ఈ వివరణ చూసి చాలా మంది చరిత్రకారులు, వారంతా అఖండ భారతావనిలోని రాజ్యాల నుంచి వచ్చి ఉంటారనీ, మహా అయితే ఆసియాలోని చైనా, మధ్య ఆసియా, తూర్పు ఆసియా వంటి ప్రదేశాలలోని ఇంకొన్ని రాజ్యాల రాజులు పాల్గొని ఉండవచ్చనీ అనుకున్నారు. కానీ చరిత్రను మరింత క్షుణ్ణంగా పరిశీలిచిన శాస్త్రవేత్తల ప్రకారం, కూరుక్షేత్రంలో పాల్గొన్నది కేవలం, భారతీయులు, ఆసియా వాసులు మాత్రమే కాదనీ, మధ్య ఆసియా, యూరోప్, అమెరికా ఖండాల నుంచి కూడా రాజులు వారి సేనలతో కూడి యుద్ధంలో పాల్గొన్నారనీ తెలుస్తోంది.
కొన్ని విషయాలు మనకు ఆశ్చర్యం కలిగించక మానవు.. నాటి మన భారతీయ రాజులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రముఖ రాజ్యాలతో వర్తక వ్యాపార సంబంధాలే కాకుండా, వివాహ సంబంధాలు కూడా ఏర్పరచుకునేవారని వాస్తవ చరిత్ర చెబుతోంది. అందుకు ఉదాహరణగా, నాడు మనవారు వాడిన పదాలనూ, కొన్ని గుర్తులనూ చూపిస్తున్నారు. నేడు ఆసియా వ్యాప్తంగా లభిస్తున్న హైందవ ఆనవాళ్ళూ, భారతీయులతో ఆయా ప్రాంతాలలోని రాజ్యాలకున్న సంబంధాల గురించీ, చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే మన పురాణాలలో చెప్పబడిన పాతాళ లోకం, అక్కడికి వెళ్ళినప్పుడు కనిపించే గుర్తులను బట్టి, నేటి శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలలో అది నేటి దక్షిణ అమెరికా ప్రాంతం అని తెలుస్తోంది. పాతాళం అంటే సంస్కృతంలో మనకి కింద ఉన్నది అని అర్ధం. మన దేశం నుంచి ఒక గీత సరిగ్గా క్రింది వైపుకు గీసినప్పుడు, అది దక్షిణ అమెరికా దగ్గర ఆగుతుంది. దానిని బట్టి మన దేశానికి క్రింద ఉన్న ప్రాంతాన్ని నాడు పాతాళ లోకంగా అభివర్ణించేవారని అర్ధం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని మనం గతంలో వివరంగా చెప్పుకున్నాము.
ఇక యూరోపియన్ దేశాలను మ్లేచ్ఛ లోకాలుగా, అక్కడున్నవారిని మ్లేచ్ఛులుగా పిలిచేవారు. మ్లేచ్ఛులు అంటే వావి వరసలు మరచి శృంగారం చేసేవారు, అన్నీ రకాల జీవులనూ భక్షించేవారు, నీతి, నియమం, ధర్మం వంటి వాటిని పాటించని వారనే అర్ధం వస్తుందని, భాషా పండితులు చెబుతున్నారు. నాటి యూరోప్ చరిత్రను పరిశీలిస్తే, వారు ఎక్కువగా విశృంఖల శృంగారానికి మక్కువ చూపేవారు. ఆవు, పంది అనే తేడా లేకుండా, కనిపించిన ప్రతి జంతువునూ భక్షించేవారు. నేటికీ, హిందువులు ఆవు మాంసాన్నీ, ముస్లింలు పంది మాంసాన్నీ ముట్టరు. కానీ ఆ రెండింటిని తినేది కేవలం యూరప్ వాసులు. అలా చూసుకుంటే, యూరప్ నుంచి వలస వెళ్ళి, స్థానికులను నిర్దయగా ఊచకోత కోసి, తమ దేశాలుగా చెప్పుకుంటున్నది, అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలలోని వారు మాత్రమే అని చెప్పవచ్చు.
మహాభారతంలో అత్యంత బలశాలిగా, ఓటమి ఎరుగని వీరుడిగా, అఖండ కురు సామ్రాజ్య స్థాపనకు కృషిచేసిన వ్యక్తిగా, పాండవుల తండ్రి అయిన పాండు రాజుకు పేరు. ఆయనకు ఇద్దరు భార్యలు కాగా, రెండవ భార్య మాద్రి. నేడు చరిత్రకారులు కనిపెట్టిన వివరాలు ప్రకారం, మాద్రి కూడా ఒక మ్లేచ్ఛ జాతికి చెందిన రాజకుమారి. ఆమె మద్ర దేశానికి చెందిన రాజకుమారి. ఆమె సోదారుడు శల్యుడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. కొన్ని పరిశోధనల ప్రకారం ఈ మద్ర రాజ్యమే నేడు Spain లో ఉన్న Madrid గా కనుగొన్నారు. ఇక కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కర్ణుడికి శల్యుడు సారథిగా చేసిన ‘శల్య సారధ్యం’ గురించి తెలిసిందే. ఆ సమయంలో కర్ణుడిని శల్యుడు నానా విధాలా నిందిస్తున్నప్పుడు, ‘వావి వరుసలు మరచి తిరిగే ప్రాంతం నుంచి వచ్చినవాడివీ, గో మాంసాన్ని భుజించే మ్లేచ్ఛుడివీ, నువ్వా నాకు నీతులు చెప్పేది’ అని కర్ణుడు దూషించడం కూడా మహాభారతంలో ఉంది. దాని ఆధారంగా కూడా వారు మాద్రి, ఆమె సోదరుడు శల్యుడు, యూరోప్ ఖండానికి చెందిన వ్యక్తులుగా పేర్కొంటున్నారు. ఆ విధంగా నాడు యూరోప్ నుంచి కూడా అనేక మంది రాజులూ, వారి సేనలూ కూరుక్షేత్రంలో పాల్గొన్నట్లు చరిత్రకారులు నిర్ధారించారు.
ఇన్ని నిర్ధారణలు జరుగుతున్నా, చాలా మంది పాశ్చాత్య శాస్త్రవేత్తలకు ఇంకా మహాభారతంపై అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిని పటాపంచలు చేస్తూ Nilesh Nilkanth Oak అనే పరిశోధకుడూ, రచయిత, మహా భారతం జరిగిందని నిరూపించడానికి మరికొన్ని ఆధారాలను బయటపెట్టారు. ప్రపంచంలోని ఏ చరిత్ర చూసినా, రాజులూ, వారి వంశాల చుట్టూ మాత్రమే అల్లబడి ఉంటుంది. కానీ, మన దేశంలో మాత్రమే, రాజులకూ, వారి వంశాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఆ కాలంలో జరిగిన ముఖ్య సంఘటనల సమయంలో సంభవించిన astronomical events కూడా పొందు పరచబడి ఉంటాయి. రామాయణ, మహాభారత గ్రంథాలలో ఇలాంటి ఎన్నో astronomical events, ఆ సమయంలో భూమిపై సంభవించిన పరిణామాల గురించీ స్పష్టంగా పేర్కొనబడి ఉండటం గమనించవచ్చు.
మహాభారత కాలంలో జరిగిన 215 astronomical events ని గుర్తించారు Nilesh Nilkanth Oak. అలాంటి ఖగోళ వింతలు, ఘటనలు పూర్వం ఎప్పుడు జరిగాయనే విషయాన్ని, నేడు ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా పరిశీలించిన Oak, అవన్నీ దాదాపు 10 వేల ఏళ్ల క్రితం సంభవించినట్లు నిర్ధారించారు. అంటే, మాహాభారత ఘట్టం జరిగి ఇంచుమించు 10 వేల సంవత్సరాలవుతున్నట్లు ఒక అంచనాకి వచ్చారు. ఆ పరిశోధనలను నాసా శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు. ఉదాహరణకు, కుజ గ్రహం రాత్రి సమయంలో అది వెళ్తున్న కక్ష్యలో కాస్త వెనక్కి వచ్చి, మళ్ళీ ముందుకెళ్లినట్లు మహా భారతంలో చెప్పబడి ఉంది. వృశ్చిక రాశి నక్షత్ర మండలిలో ఉన్న జ్యేష్ఠా నక్షత్రం దగ్గర ఈ పరిణామం సంభవించిందనీ, అప్పుడే కురుక్షేత్ర యుద్ధం మొదలైందనీ చరిత్రకారులు చెబుతున్నారు. అలాంటి వింత పరిణామం అంతరిక్షంలో నిజంగా సంభవించిందా అని పరిశోధించగా, సరిగ్గా సామాన్య శక పూర్వం 5591 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 7 నుంచి 8 వేల ఏళ్ల క్రితం అంతరీక్షంలో ఇలాంటి ఘటన సంభవించినట్లు, శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇలాంటి astronomical events ని బట్టి, మహా భారత యుద్ధం వాస్తవంగా జరిగిందని Nilesh Nilkanth Oak ఘంటాపథంగా చెబుతున్నారు. వారి వాదననకు, 2015 వ సంవత్సరంలో బయటపడిన Neolithic Y chromosome Bottleneck కూడా మ్యాచ్ అవ్వడంతో, మరోసారి మహాభారత కావ్యం కల్పితం కాదనీ, కేవలం కుతంత్రంతో దాచబడుతున్న భారతీయ ఘన చరిత్ర అనీ, ప్రపంచానికి తెలిసింది.
🚩జై శ్రీ కృష్ణ 🙏
Comments
Post a Comment