Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Monday, January 27, 2025

Discover the REAL Story Behind Kumbh Mela! | 'కుంభ' మేళా! లక్షల సంవత్సరాల చరిత్ర!


కుంభమేళా! లక్షల ఏళ్ల చరిత్ర! TELUGU VOICE
144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా!

ఇదే నేడు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన వార్తా పత్రికలలోనూ కనిపిస్తున్న ముఖ్య వార్త.. అన్ని దేశాలూ, అంతరీక్షంలో ఉన్న శాటిలైట్స్ సహాయంతో వీక్షించాలని తహతలాడుతున్న ఏకైక పరిణామం, ఆఖరికి ఇస్లాం పుట్టుకకు మూలమైన మధ్య ఆసియా దేశాల ప్రజల నుంచి, మన పొరుగునే ఉన్న పాకిస్తాన్ లోని జనాల వరకూ, ఒక్కసారైనా వెళ్ళాలని అనుకుంటున్న డెస్టినేషన్, అఖండంగా, ఆమోఘంగా, దేదీప్యమానంగా, ఏ బాష వర్ణనకీ అందనంత ఘనంగా మన దేశంలో జరుగుతున్న మహాకుంభమేళా గురించే అని చెప్పడం, ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు.. భారత దేశంలోని ఉత్తర్ ప్రదేశ్ లో గల ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకి తరలి వస్తున్న కోట్లాదిమంది భక్తులనూ, అక్కడికి వచ్చే ఎందరో నాగ సాధువులు, అఘోరాలు, యోగులూ, మహాపురుషుల వంటి వారిని చూసి, ప్రపంచం మొత్తం తాదాత్మ్యం చెందుతోంది. ఈ క్రమంలో ఇతర దేశస్థులతో పాటు, మన దేశంలో ఉన్న చాలా మందికి, అసలు కుంభమేళ అంటే ఏమిటి..? మహా కుంభమేళ విశిష్టత ఏమిటి..? ఇది ఎప్పుడు మొదలైంది..? ఎలా మొదలైంది..? కుంభమేళా పూర్తి చరిత్ర ఏమిటి..? వంటి ఎన్నో సందేహాలు కలుగుతాయి. మరి అటువంటి అనేక సందేహాలకు సమాధానాలతో పాటు, ఈ భూమిపై మొట్టమొదటగా పురుడు పోసుకుని, నేటికీ దేదీప్యమానంగా భాసిల్లుతున్న హిందువుల చరిత్రను తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/TGyS9rZg8bc ]


కుంభమేళ అనేది అనంత హైందవ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యం.. కుంభమేళ అంటే ఎల్లలు లేని ఆధ్యాత్మిక ప్రయాణంలో మన ముందు సాక్షాత్కరించే ధృవతార.. కుంభమేళ అనేది ఆధునిక శాస్త్రవేత్తలను సైతం నివ్వెరపరిచే సైన్స్. ముందుగా కుంభమేళ చరిత్ర గురించి తెలుసుకుంటే, అసలు ఆ సమయంలో నదీ స్నానం ఎందుకు చేస్తాం అనే ప్రశ్నకు దాదాపు సమాధానం దొరికినట్లే అని, చరిత్రకారులతో పాటు ఈ విషయంపై పరిశోధనలు చేసిన నిపుణులు సైతం చెబుతున్నారు. కుంభమేళ మొదలుకు కారణం గురించి భాగవత మహా కావ్యంలో స్పష్టంగా చెప్పబడితే, ఆ అనంత మహాయాగం జరిగిన తీరు గురించి, రామాయణం, మహాభారతం, పద్మపురాణం వంటి అనేక ఇతిహాసాలలో ప్రస్థావించబడింది.

పూర్వం సృష్టి సమతుల్యతకూ, నిర్మాణానికీ దేవతలు పాటు పడుతుంటే, ఈ సృష్టిపై తమ ఆధిపత్యం ఉండాలనే అత్యాశతో, దారుణాలకు తెగబడ్డ జాతి దానవులు. ఆ కారణం చేతనే, దేవదానవుల మధ్య నిరంతరం యుద్ధాలు జరుగుతూనే ఉండేవి. ఈ క్రమంలో దానవులు తమ ఆమోఘమైన తపశ్శక్తితో, ఆ శివయ్యానూ, బ్రహ్మదేవుడినీ మెప్పించి, అనేక వరాలు పొందడమే కాకుండా, తమ గురువైన శుక్రాచార్యుడి అద్భుతమైన శక్తి యుక్తుల చేత, దేవతలపై నిరంతరం యుద్ధాలు చేసేవారు. ఈ క్రమంలో దేవతలు తమ శక్తులను కోల్పోతూ, శక్తి హీనులై, తమ ఆవాసమైన స్వర్గాన్ని సైతం కోల్పోవడంతో, దిక్కు తోచని దేవతలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని, తమ సమస్యకు పరిష్కారం చూపమని బ్రహ్మ దేవుడిని కోరారు.

సృష్టికర్త ఆ సమస్యకు పరిష్కారం చెప్పగలిగినది ఆ దేవదేవుడే అని, శ్రీమహా విష్ణువు దగ్గరకు తీసుకువెళ్లాడు. ఆ స్వామి ప్రసన్న వదనంతో, దేవతల ఆయుషు పెరగాలన్నా, వారిని అమరులుగా చేయాలన్నా ఒకేఒక్క పరిష్కారం, పాల కడలి నుంచి అమృతాన్ని బయటకు తియ్యడం అని చెప్పి, దానికోసం మంధర పర్వతాన్ని, వాసుకి సహాయంతో చిలకమని చెప్పాడు. అంత పెద్ద కార్యం దేవతలు మాత్రమే చేయలేక, దానవులతో ఒక ఒప్పందం కుదుర్చుకుని, వారి సహాయంతో పాలకడలిని చిలకడం, ఈ నేపద్యంలో శ్రీ మహా విష్ణువు కూర్మావతారం ఎత్తి, మంధర పర్వతాన్ని ఎత్తడం, తొలిగా వచ్చిన హాలహలాన్ని శివయ్య తన కంఠంలో దాచుకోవడం, ఆఖరుగా ఒక బంగారు కుంభంలో అమృతం పైకి రావడం వంటి వివరాలు ప్రతి హిందువుకూ తెలిసినవే.

అయితే అమృతం పైకి వచ్చాక, దేవ దానవులు దానికోసం 12 పగళ్ళూ, 12 రాత్రులూ మహా యుద్ధం చేశారు. ఆ సమయంలో శ్రీమహా విష్ణువు చాకచక్యంగా అమృత కుంభాన్ని చేజిక్కించుకుని, దానిని తన వాహనమైన గరుత్మంతుడికి ఇవ్వగా, ఆయన ఆ అమృత కుంభాన్ని తీసుకుని వెళుతున్నప్పుడు, నాలుగు చుక్కలు జారి భూమిపై పడ్డాయనీ, అలా పడ్డ ప్రదేశాలే ప్రయాగ్ రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని అని మన ఇతిహాసాలు చెబుతున్నాయి. దేవతల ఒక రోజు, మనకు ఒక సంవత్సరం. అంటే వారు 12 రోజులు పోరాడిన తర్వాత అమృతాన్ని పొందారు. అందుకే 12 సంవత్సరాలకు ఒకసారి, మన దేశంలోని ఈ నాలుగు క్షేత్రాలలో కుంభమేళ జరుగుతుంది. కుంభం నుంచి జారిపడిన అమృత బిందువుల వల్ల ఏర్పడ్డ ప్రదేశాలలో జరిగే మహా మేళ అవ్వడం చేత, దీనికి కుంభమేళ అనే పేరు వచ్చినట్లు ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు.

సూర్యుడు, బృహస్పతి గమనాన్ని ఆధారంగా చేసుకుని, కుంభమేళాని నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి కలిసి సింహా రాశిలోకి వచ్చినప్పుడు, నాసిక్ లోని త్రయంబకేశ్వరంలోనూ.. సూర్యుడు మేష రాశిలో ఉన్నప్పుడు హరిద్వార్ లోనూ, సూర్యుడు, బృహస్పతి వృశ్చిక రాశిలో ఉనప్పుడు ఉజ్జయినీ లోనూ, ఆఖరుగా బృహస్పతి వృషభ రాశిలో, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు, ప్రయాగ్ రాజ్ లోనూ కుంభమేళాను నిర్వహిస్తారు. ఈ కుంభమేళాని కూడా నాలుగు విధాలుగా విభజించడం జరిగింది. మొదటగా సాధారణ కుంభమేళా.. ఇది ప్రతి 4 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. రెండవది, అర్ధ కుంభమేళా.. ఇది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మూడవది పూర్ణ కుంభమేళా.. ఇది ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఇక మహా కుంభమేళా.. ఇది 144 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే, ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతుంది. ఇదే ప్రస్తుతం జరుగుతోంది..

కుంభమేళా సమయంలో ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ఆయా ప్రదేశాలకు వచ్చి, అక్కడున్న పుణ్య నదులలో స్నానాలు చేస్తారు. ముఖ్యంగా ప్రయాగ్ రాజ్ దగ్గర గంగా, యమునా, సర్వసతీ నదుల త్రివేణి సంగమం ఉండటంతో, అక్కడ చేసే నదీ స్నానానికి మరింత విశిష్టత ఉంది అనాదిగా. రాముడు, కృష్ణుడి వంటి యుగ పురుషులు సైతం, కుంభమేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానమాచరించినట్లు, చరిత్ర చెబుతోంది.

కుంభమేళా సమయంలో దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ శక్తి పీఠాలు, అఖాడాల నుంచి, ఎందరో సాధువులు, యోగులు, మహా పురుషులూ వచ్చి, ఈ పుణ్య నదులలో స్నానాలు చేయడంతో పాటు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం సమారాధనలు జరుపుతారు. కుంభమేళా అనగానే అందరినీ ప్రధానంగా ఆకర్షించే మరో అద్భుత ఘట్టం, అక్కడకి లక్షల సంఖ్యలో తరలి వచ్చే నాగ సాధువులు. ఒంటినిండా విభూతిని పూసుకుని, జడలు కట్టిన కేశాలతో దిగంబరంగా, ఒక్కసారిగా వచ్చి పుణ్య నది స్నానాలు చేసి, మళ్ళీ ఒక్కసారిగా అంతమంది, చిన్న జాడ కూడా విడువకుండా వెళ్లిపోతారు. ఎక్కడో హిమాలయాలలో, మన దేశంలో ఉండే పలు పుణ్య ప్రదేశాలలో, అత్యంత రహస్యంగా తపస్సు చేసుకుంటూ జీవించే ఈ నాగ సాధువులు, కేవలం కుంభమేళా సమయంలో మాత్రమే అంత పెద్ద మొత్తంలో ఎలా వస్తారు, ఎలా వెళ్తారు అనేది, Science పరంగా నేటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. దీనికి సంబంధించి మనం గతంలో చేసిన, ‘సూక్ష్మ శరీర యానం’ అనే వీడియోను కూడా చూడండి. చూడని వారికోసం ఆ వీడియో link ను పైన I-cards లోనూ, Description లోనూ పొందుపరిచాను.

ఇక కుంభమేళా సమయంలో నదీ స్నానం చేయడం వెనుక, చాలా పెద్ద సైన్స్ దాగి ఉన్నట్లు, శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సాధారణంగా జీవనదులలో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. వాటితో పాటు నదిలో ఉండే కరెంట్స్ వల్ల, మన చర్మంపై ఉన్న అనేక రోగాలను తగ్గించడమే కాకుండా, నాడీ వ్యవస్థను ఉత్తేజ పరిచి, అనేక శారీరక, మానసిక రోగాలను తగ్గిస్తాయి. అందుకే ఇటువంటి పుణ్య సమయాలలోనైనా నదీ స్నానం చేయాలని మన యోగులు, ఋషులు ఏనాడో చెప్పారు. దానితో పాటు, అంతరీక్షంలో జరిగే గ్రహాల కదలికల ఆధారంగా జరిగే కుంభమేళా సమయంలో నదీ స్నానం చేయడం వల్ల, ఆ గ్రహాల కదలికల నుంచి వచ్చే కొన్ని కిరణాలూ, వాయువులూ, మన నదులను మరింత శక్తివంతంగా మారుస్తాయనీ, ఆ సమయంలో నదీ స్నానం చేయడం వల్ల, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను మనిషి పొందుతాడనీ, మన మహర్షులు ఏనాడో చెప్పారు. అందుకే కుంభమేళా అంటే ఆధ్యాత్మిక కలయికే కాకుండా, నేటి శాస్త్రవేత్తలకు అంతు చిక్కని అద్భుత సైన్స్.

మరి ఇప్పుడు జరుగుతున్న 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే మహాకుంభమేళా అవకాశాన్ని వదులుకోవడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని ఒకసారి ఆలోచించండి..

🚩 హర హర మహాదేవ🙏

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...