Search This Blog

Featured Post

The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrahmendra Swamy time-travel to the 21st century? వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు!

వణుకు పుట్టిస్తున్న బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజాలు! అసలు ఆ వీరభోగ వసంతరాయల రాక ఎప్పుడు? The Man Who Saw Tomorrow - Did Sri Pothuluri Veerabrah...

Saturday, December 31, 2022

ప్రతి హిందువూ తెలుసుకోవలసిన జనవరి 1 చరిత్ర! New Year History

జనవరి 1న ప్రపంచమంతా, కొత్త సంవత్సర వేడుకలను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయితే, ఈ జనవరి ఒకటి కొత్త సంవత్సరానికి ఆరంభం అనే విషయం వెనుక, చరిత్రతో పాటు, ఎన్నో వివాదాలు కూడా ఉన్నాయనే విషయం, మనలో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు మనం వాడుతున్న ఈ Calendar ని ఎవరు కనిపెట్టారు? పూర్వం ఏ నెలలో కొత్త సంవత్సర వేడుకలు జరుపుకునేవారు? మన దేశంలో, ఈ ఆంగ్ల Calendar ఎలా అమలులోకి వచ్చింది? అత్యంత పురాతన సంస్కృతి గల మన దేశంలో, జనవరి 1 న కొత్త సంవత్సరాన్ని ఎప్పుటి నుండి జరుపుకుంటున్నారు? అనేటటువంటి విషయాల గురించి, ఈ రోజు తెలుసుకుందాము..

 

జనవరి ఒకటి నుంచి, కొత్త సంవత్సరం ఆరంభం అవుతుందనీ, ఆ రోజుని New Year గా సంబరాలు జరుపుకోవడం వెనుక, చాలా పెద్ద చరిత్రే ఉందనీ చెప్పాలి. హిందూ, Babylonia, Zoroastrianism, Hebrew, Roman వంటి ప్రాచీన నాగరికతలకు చెందిన ప్రజలు, కొన్ని వేల ఏళ్ల క్రితం, వారి వారి క్యాలెండర్లను రూపొందించుకున్నారు. ఈ Calendars అన్నీ, సూర్యమానం, లేదా చంద్రమానం ఆధారంగా రూపొందినవే. అయితే, నేడు మనం ఉపయోగిస్తున్న ఆంగ్ల Calendar పుట్టుక, Roman Calendar నుంచి వచ్చింది. సామాన్య శక పూర్వం, 7000 సంవత్సరాల ముందు వరకూ, రోమన్స్ తమ కొత్త సంవత్సరాన్ని మార్చి నెలలో జరుపుకునే వారు. అప్పట్లో వారి Roman Calendar లో, కేవలం పది నెలలు మాత్రమే ఉండేవి. ఈ Calendar ని సంస్కరించాలనే ఉద్దేశ్యంతో, సామాన్య శక పూర్వం, 7వేల వ సంవత్సరంలో, ఆనాడు రోమ్ ను పాలించిన (న్యూమా పాంటీలియస్), జనవరి, ఫిబ్రవరి అనే రెండు నెలలను ప్రవేశపెట్టాడు. రోమన్లు ఎదైనా నూతన పని ప్రారంభించాలంటే, మొదటి పూజ, జానూస్ అనే దేవతకు చేసేవారు. ఆమె పేరు ఆధారంగా, జనవరి అనే నెలని రూపొందించడం వలన, ఆ నెలనే కొత్త సంవత్సరానికి ఆదిగా చెయ్యాలని నిర్ణయించాడు.

అయితే, ఈ Calendar లో ఎన్నో తప్పులుండడం వలన, సామాన్య శక పూర్వం, 45వ సంవత్సరంలో, ఆనాటి రోమ్ చక్రవర్తి Julius Caesar, పాత రోమన్ Calendar ని సమూలంగా మార్చి, కొత్త కాలెండర్ ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీనినే Julius Calendar అని పిలిచేవారు. అంతేకాదు, ఇదే తొలి సౌరమాన Calendar గా, పేరుగాంచింది. అయితే, ఈ Calendar రూపకల్పన తరువాత కూడా, పాశ్చాత్య దేశాలు చాలా సంవత్సరాల పాటు, తమ కొత్త సంవత్సరాన్ని, మార్చి 25 న జరుపుకునేవి. కాలగమనంలో, అది ఏప్రిల్ కి మారింది. సామాన్యశకం మధ్యకాలంలో, డిసెంబర్ 25 ని క్రీస్తు జన్మదినంగా జరుపుకోవడం ఆరంభమవ్వడంతో, కొన్ని దేశాల వారు, క్రీస్తు పుట్టిన రోజునే, తమ కొత్త సంవత్సరంగా జరుపుకునే వారు. అయితే, ఈ భిన్న సంవత్సరాదులు పోయి, అందరూ ఒక రోజునే కొత్త సంవత్సరాన్ని జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో, 1580 లలో, అప్పటి క్రైస్తవ మత గురువు Pope Gregory-13, Julius Calendar ని మరింత మెరుగుపరచడం మొదలుపెట్టి, 1582, అక్టోబర్ లో కొత్త Calendar ని ప్రవేశపెట్టాడు. దానినే, Gregorian Calendar గా పిలుస్తున్నారు. 

ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్నది, ఈ Gregorian Calendar నే. ఈ Calendar అమలులోకి వచ్చిన తరువాత, జనవరి 1 నే, నూతన సంవత్సరం ఆరంభంగా జరుపుకోవాలని, Pope Gregory గట్టిగా ప్రతిపాదించాడు. pope ప్రతిపాదనను అంగీకరించి, ముందుగా France, Italy, Portuguese, Spain దేశాల వారు అమలులోకి తెచ్చారు. ఆ తరువాత సామాన్యశకం, 1699 లో జర్మనీ, 1752 లో ఇంగ్లాడు, 1873 లో జపాన్, 1912 లో చైనా, 1916 లో బల్గెరియా, ఆఖరిగా 1918 లో రష్యా దేశాల వారు, ఈ Gregorian calendar ని అమలులోకి తెచ్చారు. ఇక బ్రిటీషు వారు, 17, 18 వ శతాబ్దాలలో, తమ ఆధీనంలో ఉన్నఅన్ని దేశాలలో, ఈ calendar ని అమలులొకి తీసుకురావడం జరిగింది. ఆ కాలంలో, మన భారతదేశం కూడా వారి పాలనలో ఉండడం వలన, ఈ ఆంగ్ల calendar అమలులోకి రావడం, వారి కొత్త సంవత్సరాన్ని మనం కూడా జరుపుకోవడం మొదలైంది. అయితే, ఈ Gregorian Calendar లో, ఎన్నో తప్పులున్నట్లు, ‘మన దేశ’ పండితులే కాకుండా, పాశ్చాత్య ఖగోళ శాస్త్రవేత్తలు కూడా ఒప్పుకున్నారు. ఈ Calendar లో ఉన్న తప్పులను సరిచేయడానికి, అప్పట్లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ, ఈ Gregorian Calendar ని క్షుణ్ణంగా పరిశీలించి, అందులో ఉన్న చాలా లోపాలను చూపిస్తూ, సామాన్య శకం 1926 లో, ఒక రిపోర్టు ఇచ్చింది. అయితే, ఆ నివేదికను, క్రైస్తవ సమాజం పూర్తిగా పక్కన పెట్టేసింది. అందువల్ల, ఈ Calendar లో తప్పులున్నా, ప్రపంచీకరణ నేపద్యంలో, అన్ని దేశాల వారూ, జనవరి 1 ని,  సంవత్సరాది ప్రారంభంగా జరుపుకుంటున్నారు.

అయితే, జనవరి 1 తో పాటు, ప్రపంచంలో అనేక దేశాల వారు, ఇప్పటికీ వారికి సాంప్రదాయంగా వస్తున్న నూతన సంవత్సర వేడుకను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మన దేశంలో కూడా, ఈ ఆంగ్ల సంవత్సరాదిని వేడుకగా జరుపుకున్నా, మన ప్రాచీన నాగరికతను విడువలేదు. అందువల్ల, పంటలు చేతికి వచ్చే సమయంలో కానీ, ఋతువులూ, పుణ్యదినాలను పురస్కరించుకుని కానీ, నూతన సంవత్సర పండుగను, చాలా వైభవోపేతంగా జరుపుకుంటున్నాం. ఈ విధంగా మన దేశంలో ప్రాంతాల వారీగా, 8 విధాలుగా, నూతన సంవత్సర పండుగను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మన రెండు తెలుగు రాష్ట్రాలైనా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాతో పాటు, కర్ణాటక వారూ, చైత్ర మాసంలో వచ్చే శుక్ల పాడ్యమి నాడు, ఉగాది పర్వదినాన్ని నూతన సంవత్సరాదిగా, తెలుగు సంవత్సరాదిగా జరుపుకుంటున్నారు. ఇక తమిళనాడులో, ప్రతీ సంవత్సరం ఏప్రిల్ మధ్యలో, తమిళ సంవత్సరాదిని జరుపుకుంటారు. ఆ పర్వదినాన్ని, వారు పుత్తండు లేదా వరుష అనే పేర్లతో పిలుచుకుంటారు. కేరళ వారు, తమ ప్రాచీన పంచాగాన్ని అనుసరించి, ప్రతీ సంవత్సరం Medam అనే నెల మొదటి రోజున, నూతన సంవత్సర పర్వదినంగా జరుపుకుంటారు. ఆ పండుగనే, వారు విషు అని పిలుచుకుంటారు. కేరళ వారి శాస్త్రాల ఆధారంగా వచ్చే ఈ Medam అనే నెల, ప్రతి సంవత్సరం ఏప్రిల్ మధ్యన ఆరంభమై, మే నెల మధ్యలో ముగుస్తుంది.

గుజరాత్ వారు, ప్రతీ ఏడూ వచ్చే దీపావళి మరుసటి రోజుని, తమ నూతన సంవత్సర పర్వదినంగా జరుపుకుంటారు. దానినే వారు బెస్తు వారాస్ అని పిలుస్తారు. ఆ రోజున గుజరాత్ వారు, శ్రీ కృష్ణుణ్ణి విశేషంగా ఆరాధిస్తారు. పంజాబ్ వారు, బైసాఖి అనే పండుగను తమ కొత్త సంవత్సరాదిగా పేర్కొంటారు. సిక్కుల 10 వ మతగురువైన గురు గోబింద్ సింగ్ కలశ స్థాపన చేసిన రోజునే, బైసాఖిగా జరుపుకుంటారు. మహారాష్ట్ర వారైతే, గుడి పడ్వా అనే రోజుని, తమ నూతన సంవత్సరాదిగా జరుపుకుంటారు. ఈ పండుగను, అనాదిగా, వారి రాష్ట్రంలో మామిడి పంట చేతికి వచ్చిన రోజున, జరుపుకుంటారు. అస్సాం వారు, ఏప్రిల్ మధ్య నుంచి, వ్యవసాయం చేయడానికి అనువుగా, సంవత్సరాదిగా జరుపుకుంటారు. దానిని వారు రొంగాలి బిహు లేదా బొహగ్ అని పిలుస్తారు.

ఇక బెంగాల్ వారికి ఏప్రిల్ మధ్యలో, తమ కొత్త సంవత్సరాది వస్తుంది. దానిని వారు Pahela Baisaakh అని పిలుచుకుంటారు. ఈ పర్వదినాన్ని, బెంగాలీయులు చాలా ఘనంగా జరుపుకుంటారు. అయితే, మన భారతదేశమే కాకుండా, చాలా దేశాల వారు తమ నూతన సంవత్సరాదిని, జనవరి ఒకటిని కాకుండా, వేరు వేరు సమయాల్లో, చాలా ఘనంగా చేసుకుంటారు. జపాన్ వారు, జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19వ తేదీల మధ్య, నూతన సంవత్సరాన్ని జరుపుకునేవారు. దానిని వారు యాబురీ అని అంటారు. అయితే, ప్రస్తుతానికి జపాన్ వారు, జనవరి 3న, ఆ పండుగను జరుపుకుంటున్నారు. థాయ్ లాండ్, మయన్మార్ లలో, నూతన సంవత్సరాన్ని, ఏప్రిల్ 13 నుంచి 15 వరకు జరుపుకుంటారు. దీనిని వారు తిజాన్ అని పిలుస్తారు. ఇరాన్ ప్రజలు, సూర్యుడు మేషరాశిలో అడుగుపెట్టిన రోజుని, తమ కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు.

ఇక అసలు విషయానికి వస్తే, మన కొత్త సంవత్సరం అదేనండి మన పండుగ “ఉగాది” నాటికి వాతావరణంలో మార్పులు కనిపిస్తాయి, మరియు ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. మన పండుగ మనకు గొప్ప. కనుక అదే జరుపుకుందాం. ఈ ఆంగ్ల (క్రైస్తవ) నూతన సంవత్సరానికి వారికి శుభాకాంక్షలు..

జై సనాతన ధర్మ!

Saturday, December 24, 2022

మనిషి శరీరాన్ని పోలిన మెత్తటి శరీరం గల నరసింహ స్వామి విగ్రహం ఎక్కడుంది? Hemachala Lakshmi Narasimha Swamy Mallur


సంతాన భాగ్యాన్ని ప్రసాదించే 4 వేల సంవ‌త్సరాల నాటి హేమాచ‌ల నృసింహ‌ ఆల‌య ర‌హ‌స్యాలు!

ఆర్త జ‌న బాంధవుడిగా, భ‌క్త కోటి ర‌క్షకుడిగా, శంఖచ‌క్రధారిని స‌మ‌స్త జనులూ, భ‌క్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు. ధ‌ర్మ ర‌క్షణా, దుష్ట శిక్షణ కొర‌కు, ఆ శ్రీ మ‌హా విష్ణువు వివిధ అవ‌తారాలెత్తిన‌ట్లు, మ‌న‌ పురాణాలు చెబుతున్నాయి. ఆయనెత్తిన అవ‌తారాల‌లో, న‌ర‌సింహ స్వామి అవ‌తారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందువ‌ల్ల, ఆ స్వామిని యుగ‌యుగాలుగా,  సామాన్యుల నుంచి రారాజుల వ‌ర‌కూ, ఎన్నో ఆల‌యాల‌ను నిర్మించి, భ‌క్తితో కొలుస్తున్నారు. అటువంటి ఒ‌క పురాత‌న న‌ర‌సింహ స్వామి వారి ఆల‌యంలోని మూల‌విరాట్టు, ఎంతో ఆశ్చర్యాన్ని క‌లిగిస్తోంది. 4000 సంవ‌త్సరాల‌ మునుపు క‌ట్టిన ఆ ఆల‌యంలోని స్వామి వారి విగ్రహాన్ని చూసిన వారు, నోట మాట రాక, సంభ్రమాశ్చార్యాల‌లో మునిగిపోతే, శాస్త్రవేత్తలు మాత్రం, ఈ వింత ఎలా జ‌రుగుతోంద‌నే విష‌యం అంతుబ‌ట్టక, త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. అంద‌రినీ ఆశ్చర్యప‌రుస్తోన్న ఆ న‌ర‌సింహ స్వామి వారి విగ్రహంలో దాగిన రహస్యమేంటి? ఆ ఆల‌యం ఎక్కడుంది?  దాని వెనుక‌నున్న అస‌లు చ‌రిత్ర ఏమిటి? అనే విష‌యాల‌ను, ఈ రోజు తెలుసుకుందాము..

ఈ ఆశ్చర్యక‌ర క్షేత్రం, వ‌రంగ‌ల్ జిల్లాలోని మంగ‌పేట తాలూకాలో గ‌ల, మ‌ల్లూరు అనే గ్రామానికి, 4 కిలోమీట‌ర్ల దూరంలో ఉంది. ఆ స్వామిని శ్రీ హేమాచ‌ల‌ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామిగా పిలుస్తారు. చుట్టూ ప‌చ్చని ప్రకృతి ర‌మ‌ణీయ‌త మ‌ధ్యా, ఎన్నో ఔష‌ధ గుణాలు గ‌ల మొక్కల మ‌ధ్యా, శ్రీ హేమాచ‌ల ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి వారి ఆల‌యం ఉంది. ఈ క్షేత్రాన్ని సుమారు, 4797 సంవ‌త్సరాల క్రితం, శాత‌వాహ‌న శ‌కం నాటి దిలీప‌క‌ర్ణి మ‌హారాజు నిర్మించిన‌ట్లు, చారిత్రక ఆధారాల‌ను బ‌ట్టి తెలుస్తోంది. ఈ ఆల‌యంలో ఉన్న స్వామి విగ్రహం, మాన‌వ శ‌రీరంలా మెత్తగా ఉండ‌డ‌మే కాకుండా, ఛాతీ మీద రోమాలు కూడా ఉంటాయి. 9 అడుగుల 2 అంగుళాల ఎత్తున్న స్వామి వారి మూల‌విరాట్టుపై, ఎక్కడ ముట్టుకున్నా మెత్తగా ఉండ‌డమే కాకుండా, వ్రేలితో నొక్కగానే సొట్ట కూడా ప‌డి, అక్కడి నుండి వేలు తీయ‌గానే, మ‌ళ్లీ సాధార‌ణ స్థితికి వ‌చ్చేస్తుంది. ఇటువంటి వింతైన విగ్రహం, ప్రపంచంలో మ‌రెక్కడా లేద‌నే చెప్పాలి.

అయితే, స్వామి వారి విగ్రహం, అచ్చం మాన‌వ శ‌రీరంలా ఎలా ఏర్పడింది? అనే విష‌యం, ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. అంతేకాదు, స్వామి వారి విగ్రహంలో మ‌రో విశేషం, ఆయ‌న పొట్ట నుండి కారే ద్రవం అని చెప్పాలి. ఈ ద్రవం కారడం వెనుక‌ ఒక గాధ కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన శాత‌వాహ‌న శ‌క ప్రభువు దీలీప‌క‌ర్ణికి, ఒక‌నాడు క‌ల‌లో, తాను ఫ‌లానా ప్రదేశంలో ఉన్న గుహ అంత‌ర్భాగంలో, స్వయంభువుగా వెల‌సి ఉన్నాన‌ని సెల‌విచ్చాడట ఆ స్వామి‌. దాంతో ఆ రాజు, మ‌ర్నాడుద‌య‌మే ఆ ప్రాంతానికి వెళ్ళి, 76 వేల మంది సైన్యంతో, ఆ ప్రాంత‌మంతా త్రవ్విస్తుండ‌గా, అనుకోకుండా ఒక గున‌పం, స్వామి నాభిలోకి గుచ్చుకుంద‌ట‌. అప్పటి నుండి, ఆ గాయం నుండి ద్రవం కారుతోంది. ఈ ద్రవాన్ని సేవిస్తే, సంతాన భాగ్యం క‌లుగుతుంద‌ని, భ‌క్తులు బాగా విశ్వసిస్తారు. నేడు ఆ ద్రవం కారే ప్రదేశాన్ని, ప‌సుపూ, చంద‌నాల‌తో మూసి ఉంచుతున్నారు. కానీ, ప్రతీ శ‌నీ, ఆదీ, సోమ‌వారాల‌లో, ఆ చంద‌న‌పు లేప‌నాన్ని తొల‌గించి, అక్కడి నుండి కారే ద్రవాన్ని ప‌ట్టి, భక్తుల‌కు ప్రసాదంగా ఇస్తారు.

అంతేకాదు, ఈ న‌ర‌సింహ స్వామి వారి పాదాల నుంచి, నిత్యం నీళ్లు కారుతూ, ఆల‌యానికి  వంద‌డుగుల దూరంలోని చింతామ‌ణి, అనే చిన్న జ‌ల‌పాతంగా మారుతుంది. ఈ నీరు కొద్ది కొద్దిగా, కొన్ని రోజుల పాటు త్రాగితే, అన్ని రోగాలూ త‌‌గ్గిపోతాయ‌నీ, ఆ జలం స‌ర్వ రోగ నివారిణి అనీ, భ‌క్తులు విశ్వసిస్తారు. స్వామి పాదాల నుంచి వ‌చ్చే ఆ నీరు, చింతామ‌ణి జ‌ల‌పాతాన్ని స‌మీపించే లోపు, అనేక ఔష‌ధ విలువ‌లు గ‌ల చెట్ల క్రింది నుండి రావ‌డం వ‌ల్ల, ఆ నీటికి అంత‌టి శ‌క్తి పెంపొందిందని అంటారు. పూర్వం తెలుగు నేల‌ను కాక‌తీయ వంశ‌స్థులు పాలించే కాలంలో, ఆ ఆల‌యానికి కొంత దూరంలో, రాణీ రుద్రమ‌దేవి, శ‌త్రువుల‌తో యుద్ధం చేసిందట‌. ఆ స‌మ‌యంలో ఆమెకు అనారోగ్యం చేయ‌డంతో, వైద్యులు ఆల‌య‌ స‌మీపంలో చికిత్స చేయ‌డ‌‌మే కాకుండా, ఆ జ‌ల‌పాతంలోని జ‌లం యొక్క విశిష్ఠత తెలిసి, రోజూ ఆ నీటిని ఆమెకు ప‌ట్టించడంతో, ఆమె అనారోగ్యం నుంచి బ‌య‌ట‌ప‌డి, పూర్తి ఆరోగ్యవంతురాలయ్యింది.

ఆ త‌రువాత అక్కడి నీటి విశిష్ఠత తెలుసుకున్న రుద్రమ‌దేవి, ఆ జ‌ల‌పాతానికి చింతామ‌ణి అనే పేరు పెట్టింది. నేటికీ ఆ జ‌ల‌పాతాన్ని చింతామ‌ణి జ‌ల‌పాతంగానే పిలుస్తున్నారు. ఇన్ని విశిష్ఠత‌లు గ‌ల హేమాచ‌ల నృసింహ క్షేత్రం, ఒక అద్భుత‌‌‌మ‌ని చెప్పొచ్చు. ఆ ఆల‌య ప్రాంగ‌ణంలోనే, అత్యంత పురాత‌న ల‌క్ష్మీదేవీ, గోదా దేవీల ఆల‌యాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, స్వామి ప్రధాన ఆల‌యానికి 2  కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న ద‌ట్టమైన అడ‌విలో, శిఖాంజ‌నేయ స్వామివారి చిన్న మందిరం కూడా ఉంది. ఈ ఆంజ‌నేయ స్వామి వారి విగ్రహం ఎప్పుడు వెలసింది? అన్న విషయం, నేటికీ తెలియ‌దు. కానీ, ఈ శిఖాంజ‌నేయ స్వామి వారే, శ్రీ హేమాచ‌ల నృసింహ క్షేత్రానికి, క్షేత్రపాల‌కుడ‌ని భక్తుల న‌మ్మిక‌. ఇవి, మ‌న తెలుగు రాష్ట్రాల‌లో ఒక‌టైన తెలంగాణాలో ఉన్న, ఆశ్చర్యక‌ర‌మైన శ్రీ హేమాచ‌ల నృసింహ క్షేత్ర విశేషాలూ, అక్కడున్న మాన‌వ‌శ‌రీరం వంటి విగ్రహ విశిష్ఠతలు..

ఓం నమో భగవతే వాసుదేవాయ!

Friday, December 23, 2022

నవ 'బ్రహ్మల' ఆలయాలు - Alampur Navabrahma Temples


భగవంతుడు ఈ సృష్టిని రూపొందించిన క్రమంలో, రూపొందించిన తర్వాతా జరిగిన పరిణామాల గురించి, మన పురాణాలూ ఇతిహాసాలూ ఎంతో స్పష్టంగా తెలియజేస్తాయి. అటువంటి వాటిలో అతి ముఖ్యమైనవి, ఆది దేవుళ్ళయిన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల గురించిన సంఘటనలని చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ సృష్టిని నిర్మిండానికీ, దానిని నడిపించాడానికీ మూలం, ఆ త్రిమూర్తులే అనీ, అందుకే వారు ఆది దేవుళ్లుగా కీర్తింపబడుతున్నారనీ, శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, ఆ ముగ్గురిలో శివ కేశవులకు మన భూమిపై ఎన్నో ఆలయాలు ఉండగా, బ్రహ్మకు మాత్రం విగ్రహ పూజ, ఆలయాలూ ఉండవు. అందుకు కారణం, ఒకనాడు బ్రహ్మ దేవుడు చేసిన ఒక తప్పిదం వల్ల, శివుడు ఇచ్చిన శాపం అని మనలో చాలా మందికి తెలుసు.

కానీ, మన తెలుగు రాష్ట్రంలో మాత్రం, ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా బ్రహ్మ దేవుడి పేరుమీద, తొమ్మిది ఆలయాలు ఉన్నాయి. అంతేకాదు, ఏ శివుడైతే బ్రహ్మకు విగ్రహారాధన ఉండకూడదని శాపమిచ్చాడో, అదే శివుడు, బ్రహ్మ పేరు మీద తొమ్మిది ఆలయాలు వెలియడానికి కారణమయ్యాడని, మన పురాణ ఇతిహాసాలూ, శాస్త్రాలూ చెబుతున్నాయి. ఈ మాటలు వినగానే, మన తెలుగు రాష్ట్రంలో ఆ నవ బ్రహ్మల ఆలయాలు ఎక్కడ ఉన్నాయి? ఏకంగా ఒకే చోట, తొమ్మిది బ్రహ్మ ఆలయాలు ఎందుకు వెలిసాయి? ఆ ఆలయాల వెనకున్న అసలు చరిత్ర ఏమిటి? వాటిని ఏ పేర్లతో పిలుస్తున్నారు? ఇప్పుడు ఆ ఆలయాలు ఎలా ఉన్నాయి - వంటి ఎన్నో ప్రశ్నలు, మనలో చాలా మందికి కలుగుతాయి. మరి ఆ సందేహాలకు సమాధానాలు తెలియాలంటే, ఈ శీర్షికను పూర్తిగా చదవండి.

బ్రహ్మదేవుడికి ప్రత్యేకమైన విగ్రహాలూ, వాటికి నిత్యం ఆగమ సంప్రదాయ రీతిలో పూజలూ.. వంటి మాటలు వినడానికి చాలా వింతగా ఉన్నా, ఇది పచ్చి నిజం. ఈ పుణ్య క్షేత్రం, మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణాలో ఉన్న అలంపూరంలో ఉన్నాయి. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా, అలంపూరం జోగులాంబా దేవిని, యుగ యుగాలుగా పూజిస్తున్న విషయం మనకు తెలిసిందే. అదే పుణ్య క్షేత్రంలో, ఎంతో శక్తి వంతమైన ఈ నవ బ్రహ్మ క్షేత్రాలు కూడా ఉండటంతో, మన పురాణ ఇతిహాసాలలో, అలంపూరానికి ఎంతో విశిష్టమైన స్థానం ఏర్పడింది.

అయితే, ఇక్కడున్న మరో వింత ఏమిటంటే, అలంపూరంలో ఉన్న నవ బ్రహ్మల ఆలయాలలో, బ్రహ్మ దేవుడి విగ్రహాలు ఉండవు. అందుకు బదులుగా, ఆ ఆలయాలలో బ్రహ్మ దేవుడి పేరు మీద, శివుడే కొలువై ఉన్నాడు. బ్రహ్మ దేవుడి పేరుమీద శివుడే స్వయంభువుగా వెలియడం, అది కూడా శక్తి పీఠమైన జోగులాంబ క్షేత్రం దగ్గరే ఈ నవ బ్రహ్మ ఆలయాలు కూడా ఉండటంతో, అలంపురానికి ఎంతో విశిష్టత చేకురుందని, ఆద్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. అంతేకాదు, ఈ కారణాల వల్లనే, అలంపురాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారనీ, తమ జీవిత కాలంలో కాశీకి వెళ్లలేని వారు, కనీసం అలంపురానికైనా వెళ్తే, కాశీని సందర్శించిన ఫలితం దక్కుతుందనీ, స్కంద పురాణంలో స్పష్టంగా చెప్పబడింది.

ఈ క్షేత్రంలో శివుడు, బ్రహ్మ దేవుడి పేరు మీద వెలియడం వెనుక ఒక గాధ ఉందని, స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. పూర్వం దక్షిణ అలంపురం క్షేత్రానికి సమీపంలో, బ్రహ్మత్వం కోసం బ్రహ్మ తపస్సు చేయగా, శివుడు ప్రత్యక్షమై, బ్రహ్మదేవునికి తొమ్మిది రూపాలలో దర్శనభాగ్యం కలిగించి, బ్రహ్మ దేవుడికి బ్రహ్మ తత్వం గురించి వివరించి చెప్పాడు. దాంతో ఎంతగానో సంతోషించిన బ్రహ్మదేవుడు, తనకు బ్రహ్మ తత్వం చెప్పిన ఈ ప్రాంతంలోనే, ఆ తొమ్మిది రూపాలలో, శివుడిని తన పేరుమీద నవ బ్రహ్మేశ్వర స్వామిగా వెలియమని కోరగా, అందుకు ఒప్పుకున్న శివుడు, నవ బ్రహ్మలుగా, తొమ్మిది రూపాలలో వెలియడం జరిగింది. అందుకే ఈ క్షేత్రాన్ని కార్తీక మాసంలో దర్శిస్తే, మనకున్న ఈతిబాధలు తొలగిపోయి, ఎంతో ప్రశాంతత వస్తుందని, శాస్త్రాలు చెబుతున్నాయి.

అంతేకాదు, బ్రహ్మ దేవుడి కోరిక మేరకు, అలంపురం జోగులాంబా మాత ఆలయానికి దగ్గర్లోనే శివయ్య వెలసినా, చాలా ఏళ్ల వరకూ వాటిని ఎవరూ గుర్తించక, ఆలయ నిర్మాణం జరగలేదు. అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత, సిద్ధుడనే మహా తపస్వి, అక్కడ నవ బ్రహ్మలకు ఆలయాలు నిర్మించినట్లు, స్థల పురాణం చెబుతోంది. దాని ప్రకారం, పూర్వం కాశీ క్షేత్రంలో ఒక మహిళ, చిన్న వయసులోనే వితంతువుగా మారింది. అయితే, ఆమెకు సంతానం కావాలన్న కోరికతో శివుడు గురించి తపస్సు చేయగా, శివుడు ప్రసన్నమై, ఆమె కోరిక మేరకు ఒక బిడ్డను వరంగా ప్రసాదించాడు. ఆ బిడ్డడే, సిద్ధుడనే నామధేయంతో ఎదిగాడు. అయితే, అతడు పెద్దవాడయ్యే క్రమంలో, తండ్రి గురించి తెలుసుకోవాలనీ, తండ్రి లేకుండా ఎలా జన్మించావని తోటి పిల్లలు హేళన చేయడంతో, తన తల్లిని గట్టిగా అడగగా ఆమె, అతడి తండ్రి శివుడేననీ, ఆ విశ్వేశ్వరుడి వరప్రభావంతోనే అతడు పుట్టాడనీ చెప్పింది.

అది విన్న సిద్ధుడు, ఆ పరమేశ్వరుడి సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేశాడు. సిద్ధుడి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, అతడు కారణ జన్ముడనీ, దక్షిణ కాశీలో బ్రహ్మ కోరిక మేరకు తొమ్మిది రూపాలలో వెలసిన తనకు, బ్రహ్మ పేరుతో తొమ్మిది ఆలయాలు నిర్మించే పుణ్య కార్యం చేయమని చెప్పి, చెట్లమూలికల రసంతో బంగారం చేసే వరం ప్రసాదించాడు. ఆ వరంతో రససిద్ధుడనే పేరు తెచ్చుకుని, తన శిష్యులతో కాశీ క్షేత్రం నుండి దక్షిణ కాశీ అయిన అలంపురానికి వచ్చి, ఆలయాల నిర్మాణం చేశాడు.

ఇది జరిగిన కొన్ని వేల ఏళ్ల తర్వాత, సిద్ధుడు కట్టించిన ఆ ఆలయాలు శిధిలావస్థకు చేరుకోగా, దాదాపు పదిహేను వందల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య రాజులు, నవ బ్రహ్మల ఆలయాలను ఇంకా పెద్దగా, ఎంతో వైభవంగా నిర్మించారు. ఇప్పటికీ ఆ పురాతన నిర్మాణాలు, ఎంతటి వారినైనా మంత్ర ముగ్ధులను చేస్తాయి. ఆ తమ్మిది ఆలయాల వివరాలూ ఇప్పుడు తెలుసుకుందాము..

తుంగభద్రా నది యొక్క ఎడమ ఒడ్డున, 'నవబ్రహ్మల ఆలయాలు' ఒకే ప్రాంగణంలో ఉన్నాయి.

వాటిలో మొదటిది, తారక బ్రహ్మ ఆలయం -

ఈ ఆలయం, పాక్షికంగా శిథిలావస్థలో ఉంది. దీని గర్భగుడిలో ఎటువంటి విగ్రహమూ లేదు!..

రెండవది, స్వర్గ బ్రహ్మ ఆలయం -

అక్కడ ఉన్న దేవలయాలన్నీటిలో, ఇది మిక్కిలి సుందరమైనదిగా చెప్పబడుతుంది. ఇది చాళుక్య ప్రభువుల నిర్మాణ కౌశల్యానికి ఓ మచ్చుతునకగా, చరిత్రకారులు చెబుతారు.

మూడవది, పద్మ బ్రహ్మ ఆలయం -

ఇది కూడా పాక్షికంగా శిథిలమైవుంది. ఇందులో శివయ్య ఎంతో అద్భుతమైన స్పటిక శివలింగంగా కొలువై ఉన్నాడు.

నాలుగవది, విశ్వ బ్రహ్మ ఆలయం -

ఈ ఆలయాన్ని చూడటానికి, రెండు కళ్ళూ చాలవని చెబుతారు. ముఖ్యంగా ఇక్కడ, రామాయణ, మహాభారత దృశ్యాలను, శిల్పాలపై మహాకావ్యాలుగా, అత్యంత అద్భుతంగా చెక్కారు.

ఐదవది, బాల బ్రహ్మేశ్వరాలయం -

అలంపురంలోని నవబ్రహ్మల ఆలయాలలోకెల్లా, బాల బ్రహ్మ దేవాలయం ముఖ్యమైనది, పెద్దది. ఇక్కడ ఇప్పటికీ పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ గుడిలో సప్తరుషుల విగ్రహాలను మనం చూడవచ్చు. ఈ దేవాలయంలోని విగ్రహం, వింతగా ఉంటుంది. ఒక లింగం మధ్యలో బిలం ఉంటుంది. ఈ బిలంలో, మరోక శివలింగం ఉంటుంది. ఈ ఆలయంలో ఇంకొక విగ్రహం కూడా, చూడటానికి వింతగా ఉంటుంది. ఒక నల్లరాతి పై నగ్నంగా రెండు మోకాళ్లనూ దవడలకు తగులునట్లుగా పెట్టుకుని కుర్చున్న ఒక స్త్రీ విగ్రహాన్ని మనం చూడవచ్చు. దీనిని భూదేవి విగ్రహంగా చెబుతారు.

ఆరవది, గరుడ బ్రహ్మ ఆలయం -

ఈ ఆలయ గోపురములు శిథిలమై పోయాయి. అయినా, ఆలయ గోడలపై ఉన్న శిల్పాలు ఎంతో అద్భుతంగా మనకు దర్శనమిస్తాయి.

ఏడవ ఆలయం, అర్క బ్రహ్మ ఆలయం -

ఈ ఆలయం, కుమార బ్రహ్మ ఆలయం లాగానే నిర్మించబడింది.

ఎనిమిదవ ఆలయం, కుమార బ్రహ్మ ఆలయం -

ఇక్కడ ముఖమంటపం, ప్రవేశమంటపం, దాని వెనుక గర్భాలయాలు ఉన్నాయి. అక్కడి స్తంభాలపై ఉన్న విగ్రహాలు, అచ్చం అజంతా ఎల్లోరా శిల్పాలలా ఉంటాయి.

ఇక ఆఖరిదీ, తొమ్మిదవదీ, వర  బ్రహ్మ ఆలయం -

ఈ గుడిలో ఒక వేదికపై లింగం ప్రతిష్ఠింపబడి ఉంటుంది. ఆ వేదికకు నాలుగు వైపులా రాతిస్తంభాలున్నాయి. ఈ ఆయాలంలో శివయ్యతో పాటు, తాండవ నృత్యం చేసే శివుని విగ్రహం, ప్రణయగోష్ఠిలో ఉన్న గంధర్వ దంపతుల బొమ్మలూ చూడవలసినవి.

ఓం నమః శివాయ!

Monday, December 19, 2022

సఫల ఏకాదశి - Saphala Ekadashi


'సఫల ఏకాదశి' విశిష్టత..

ధనుర్మాసంలో వచ్చే చివరి పండుగ అయిన సఫల ఏకాదశి గురించి తెలుసుకుందాము..  ఈ సఫల ఏకాదశి మహాత్మ్యాన్ని, పాండవుల్లో అగ్రజుడైన ధర్మరాజుకు శ్రీ కృష్ణుడు చెప్పినట్లు, శాస్త్రాలు చెబతున్నాయి. మార్గశిర మాసంలో వచ్చే బహుళ ఏకాదశినే, సఫల ఏకాదశి అని అంటారు.

ఈ రోజున నిష్ఠతో ఉవవసించి, జాగరణ చేసి, శ్రీ విష్ణుమూర్తిని పూజించడం ద్వారా, పాపాలు నశించిపోతాయి, ముక్తి లభిస్తుంది. ఈ రోజున శ్రీ మహా విష్ణువును ఉసిరితోనూ, దానిమ్మ పండ్లతోనూ పూజించే వారికి, సకల సంపదలో చేకూరుతాయి. ఈ రోజున రకరకాల పండ్లను స్వామికి సమర్పించి, ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తే, శుభప్రదం. ఈ సఫల ఏకాదశి రోజున దీప దానం చేస్తే, జీవితంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి.

సఫల ఏకాదశి రోజున జాగరణ చేసి, ఆలయాలలో దీపాలను వెలిగిస్తే, ఐదువేల సంవత్సరాలు తపస్సు చేసిన ఫలితం దక్కుతుంది. దీనికి సమానమైన యజ్ఞం కానీ, తీర్థం కానీ లేదు.

సఫల ఏకాదశి పవిత్రను చాటిచెప్పే కథను కూడా, శ్రీకృష్ణుడు పాండవులకు చెప్పినట్లు, పురాణాలు చెబతున్నాయి. పూర్వం చంపావతి రాజ్యమును మహిష్మంతుడనే రాజు పాలించేవాడు. అతనికి నలుగురు కుమారులుండేవారు. వారిలో జేష్ఠ పుత్రుడు లుంపకుడు.

లుంపకుడు అధర్మ వర్తనుడై జీవిస్తుడడంతో, కుమారుడని వాత్సల్యం చూపక, రాజు వానికి రాజ్య బహిష్కరణ శిక్షను విధించాడు. లుంపకుడు అడవుల పాలై, ఆహారము దొరకక, తన పరిస్థితికి చింతిస్తూ, పశ్చాత్తాప పడుతూ, ఒక అశ్వత్థ వృక్షము వద్ద రాత్రంతా గడిపి, ఆకలి దప్పులకు తాళలేక సృహ తప్పి పడిపోయాడు.

ఆనాడు ఏకాదశి.. ఆహారం లభించక, అప్రయత్నముగా ఉపవాసమును పాటించడంతో, శ్రీహరి కటాక్షముతో రాజ్యాన్ని పొందినట్లు, పురాణాలు చెబతున్నాయి. లుంపకుడు సక్రమమైన పరిపాలన చేసి, మరణాంతరము వైకుంఠానికి చేరుకున్నాడని, బ్రహ్మాండ పురాణ కథనం.

ఈ ఏకాదశి వ్రత మాహాత్మ్యాన్ని, పరమ శివుడు స్వయముగా పార్వతికి చెప్పినట్లు, పద్మ పురాణం చెబుతోంది. అందుకే ఈ రోజున, తెలిసి కానీ, తెలియక కానీ ఉపవాస దీక్షను చేస్తే, పుణ్య లోకాలను పొందుతారు. వైకుంఠ ప్రాప్తీ, ఐశ్వర్యాలూ కలుగుతాయని, శ్రీకృష్ణుడు పాండవులతో చెప్పినట్లు పురాణ విదితం.

హరినామ స్మరణం సమస్తపాప హరణం.. జై శ్రీమన్నారాయణ!

Saphala Ekadashi

The eleventh day of the lunar phase is known as Ekadashi. Each Ekadashi is considered holy and has a special significance intended for Lord Vishnu worship. The Saphala Ekadashi is observed in the month of “Pausa” during the Krishna Paksha or the waning phase of the Moon. According to the Gregorian calendar, this corresponds to December and January.

Like all other Ekadashi days, Saphala Ekadashi, also referred to as “Pausa Krishna Ekadashi,” is devoted to Lord Vishnu. On this day, worshippers offer intense devotion to Lord Krishna, a manifestation of Lord Vishnu. In comparison to other Ekadashi days, Saphala Ekadashi is considered to be superior. The person is absolved of all of their sins in life. In Hindi, the word “Saphala” denotes success or prosperity.

It is believed that keeping vrat on Saphala Ekadashi day will bring the devotee great happiness and success in life. The Ekadashi days are traditionally considered as days when a person’s spiritual needs come before their physical needs. The day of Saphala Ekadashi is extremely important to Vaishnavism devotees. Special pujas are performed on this day in Lord Krishna temples all over India.

The kingdom of Champavati was ruled by King Mahishmat, who had five sons. Prince Lumpaka was the eldest of all. Prince Lumpaka was unruly, careless, and impolite. He engaged in a lot of sinful activities and was always challenging the authority of Lord Vishnu. Lumpaka was expelled from the kingdom by the king when his crimes reached new heights. However, Lumpaka persisted in his immoral actions and pillaged the riches of the underprivileged villagers. Finally, the king’s men caught him in the act.

However, because he was still a prince, he was freed and absolved of the crime. Lumpaka lived under a banyan tree all day and all night. He would consume raw meat from slaughtered animals. But over time, his conscience began to grow heavier due to his sense of isolation and melancholy. Lumpaka began to reflect and understood how his actions, habits, and behavior had ruined his life.

He felt guilty about his sins and felt remorse. Later, on Saphala Ekadashi, Lumpaka fell ill. As a result, he was unable to eat anything during the day or sleep during the night. Lumpaka thus unwittingly performed the Saphala Ekadashi Vrat. The next day, Lumpaka went into the forest as he felt better and picked some fruits, and then offered them to Lord Vishnu. Lumpaka’s life was completely altered by this incident.

He restarted his life the following day and went back to his kingdom. The king appointed Lumpaka as his successor after learning of his transformation. The vrat that Lumpaka unknowingly observed on the Ekadashi Tithi bore fruit for Lumpaka. Lumpaka then ruled his kingdom for a very long time. After his death, he was granted a place in Vaikuntha (abode of Lord Vishnu).

సంపాతి కథ Story of Sampati


యుగాలు నిరీక్షించిన ‘సంపాతి’..
సంపాతికి నిశాకర మహర్షి చూపిన మార్గమేమిటి?

కశ్యప ప్రజాపతి, వినత దంపతులకు కలిగిన సంతానమైన అనూరుడు, శ్యేని ద్వారా, సంపాతి, జటాయువులనే కుమారులను పొందాడు. వీరి పాత్ర రామాయణంలోని ముఖ్య ఘట్టాలలో కనిపిస్తుంది. సీతమ్మ తల్లిని రావణాసురుడు అపహరించిన సందర్భంలో, జటాయువు ఆమెను కాపాడబోయి, మరణించిన విషయం మనలో చాలామందికి తెలిసిందే. ఇక సంపాతి తన రెక్కలను ఎందుకు కొల్పోయాడు? వానరులను ఎలా కలిశాడు? సంపాతి రెక్కలు తిరిగి రావడానికి నిశాకర మహర్షి ఉపదేశించిన మార్గం ఏమిటి - వంటి ఆసక్తికర అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/fuBE0AZCoNA ]


సీతమ్మను వెతకడానికి దక్షిణ దిశకు వెళ్ళిన జాంబవంత, హనుమదాది మహావీరుల బృందానికి, అంగదుడు నాయకుడు. అన్వేషణ దాదాపు విఫలమైందని భావించి, ప్రాయోపవేశానికి సిద్ధమైనపుడు మాత్రమే, నిసృహతో అంగదుడు సుగ్రీవుని విమర్శించడం గమనార్హం. అది తప్పితే, మిగిలిన అన్ని సందర్భాలలోనూ అతని రాజ భక్తీ, రామకార్యం పట్ల నిరతీ, చాలా దృఢంగా ప్రదర్శించాడు. ఇక అసలు విషయానికి వస్తే, ఆ సమయంలో అంగదుడు, "శ్రీ రాముడి కార్యం నెరవేర్చలేకపోయాం. ఇంతలో ఈ ఆపద సంభవించింది. సీతాదేవికి మేలుచేయాలనుకున్న జటాయువుకు ఏం జరిగిందో తెలుసుకదా! అలాంటి గతే మనకిప్పుడు తటస్థించింది. రామ చంద్రమూర్తికి ఉపకారం చేయడానికే, ధర్మం తెలిసిన జటాయువు శరీరాన్ని విడిచి, కీర్తిని గడించాడు. కాబట్టి ఆయన పుణ్యాత్ముడు. దశరథుడు చనిపోవడం, సీతమ్మను రావణుడు అపహరించడం వల్ల, మనకు ప్రాణాపాయం సంభవించింది. ఆనాడు మా నాన్న దుందుభిని చంపడానికని ఒక బిలంలోకి ప్రవేశించాడు. కానీ, సుగ్రీవుడికి ఉన్న రాజ్య కాంక్ష చేత, మా నాన్న తిరిగిరాకుండా ఉండడం కోసమని, ఆ బిలద్వారానికి ఒక శిలను అడ్డుపెట్టాడు. మా నాన్న బతికున్నాడని తెలిసి కూడా, మా అమ్మని తన భార్యగా అనుభవించాడు. నా మీద కుమారుడన్న ప్రేమ సుగ్రీవుడికి ఎన్నడూ లేదు. నేను తిరిగివస్తే, సాకు దొరికిందని నన్ను చంపుతాడు. సుగ్రీవుడి చేతిలో మరణించడం కన్నా, ప్రాయోపవేశం చేసి మరణించడం నాకు ఇష్టం. మీరు వెళ్ళి, నేను నా పినతండ్రికీ, నా తల్లికీ, నా పినతల్లికీ, పెద్దలకీ నమస్కారం చేశానని చెప్పండి." అని మిగిలిన వానరులకు దూరంగా, ప్రాయోపవేశం చెయ్యడం కోసమని దర్భల మీద పడుకోవడానికి సిద్ధపడ్డాడు, చనిపోవాలని అనుకున్న అగందుడు.

ఒక పెద్ద పక్షి వాళ్ళను చూస్తూ, తనకు మంచి ఆహారం దొరకబోతోందని అనుకుంది. అయితే, వానరులు రాముడి కథను చెప్పుకుంటూ, జటాయువు చనిపోయిన విషయం మాట్లాడుకుంటుంటే ఆ పక్షి విని, "జటాయువు గురించి మాట్లాడుకుంటున్నారు.. మీరెవరు?" అని అడిగింది. అప్పుడు వానరులు ఆ పక్షితో రాముడి కథనంతా చెప్పి, "జటాయువు గురించి అడుగుతున్నావు.. నీవెవరు??" అని అడిగారు. "సంపాతి అనబడే నేనూ, జటాయువూ సోదరులము. సూర్యుడు ఉదయించినప్పటినుండీ అస్తమించేలోపు, ఆయనతో సమానంగా ప్రయాణం చెయ్యాలని, మేము ఒకనాడు పందెం కాసుకున్నాము. అనుకున్న ప్రకారం నేనూ, జటాయువూ సూర్యుడి వెనకాల వెళుతుండగా, మిట్ట మధ్యాహ్నం వేళ, మేము సూర్యుడికి దగ్గరగా వెళ్ళాము. సూర్యుడి వేడిని భరించలేక, జటాయువు స్పృహతప్పి కిందపడిపోబోయాడు. పెద్దవాడిని కనుక, తమ్ముడిని రక్షించాలని నేను నా రెక్కలను జటాయువుకు అడ్డంగా పెట్టాను. అప్పుడు సూర్యుడి వేడికి నా రెక్కలు కాలిపోయి, వింధ్య పర్వతం మీద పడిపోయాను. కానీ నా తమ్ముడు ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలియలేదు. మళ్ళీ ఇంతకాలానికి, మీ వలన నా తమ్ముడి గురించి విన్నాను. నా తమ్ముడు చనిపోయాడన్న వార్త వినడం వలన, నాకు చాలా బాధ కలుగుతోంది. చనిపోయిన నా తమ్ముడికి జలతర్పణం ఇవ్వాలని అనుకుంటున్నాను. కానీ, నేను ఎగురలేను. మీరు నన్ను తీసుకెళ్ళి, ఆ సముద్ర జలాల దగ్గర దింపండి. నేను నా తమ్ముడికి తర్పణాలు ఇస్తాను" అని అన్నాడు సంపాతి.

ఆ విధంగా తన కోరిక మేరకు, సంపాతిని సముద్ర తీరానికి తీసుకువెళ్ళారు వానరులు. ఆయన అక్కడ జటాయువుకు తర్పణాలు సమర్పించాడు. మళ్ళీ వెనక్కి తిరిగొచ్చాక, వానరాలు సంపాతితో, "జటాయువు రామకార్యంలో సహాయం చేశాడు. నువ్వు కూడా రామకార్యంలో ఏమన్నా సహాయం చెయ్యగలవా? నీకు సీతమ్మ జాడ ఏమైనా తెలుసా?" అని అడిగారు. అప్పుడు సంపాతి, తను ఇంకా బ్రతికి ఉండడానికి గల కారణాన్ని వివరించాడు. "వింధ్య పర్వత శిఖరం మీద రెక్కలు కాలిపోయి పడినప్పుడు, 6 రోజుల పాటు స్పృహ లేకుండా ఉన్నాను. తరువాత తెలివొచ్చింది. నా తమ్ముడు ఎటో ఎగిరిపోయాడు. నాకేమో రెక్కలు కాలిపోయాయి. అందుకని, ఈ పర్వతం మీది నుండి కిందికి దూకి, మరణిద్దామని అనుకున్నాను. కానీ, ఇంతలో ఒక ఆలోచన వచ్చింది.

మా ఇద్దరికీ రెక్కలు ఉన్న రోజుల్లో, నేనూ నా తమ్ముడూ కామరూపులము కాబట్టి, మనుష్య రూపాన్ని పొందేవాళ్ళము. అక్కడ ఉండేటటువంటి నిశాకర మహర్షి పాదములకు నమస్కారం చేస్తుండేవాళ్ళము. అందుకని ఒకసారి ఆ మహర్షి పాదాలకు నమస్కరించి, ప్రాణాలు విడిచిపెడదామని అనుకుని, మెల్లిగా పాకుతూ ఆ మహర్షి ఉండే ఆశ్రమానికి వచ్చాను. అప్పుడే మహర్షి స్నానం చేసి వెళుతున్నారు. ఆయన నాకు, అభిషేకం చెయ్యబడ్డ బ్రహ్మ వెళుతున్నట్టు అనిపించింది. బ్రహ్మ చుట్టూ ప్రాణులన్నీ ఎలా చేరుతాయో, అలా నిశాకర మహర్షి స్నానం చేసి వెళుతుంటే, ఆయన చుట్టూ ఎలుగుబంట్లూ, పులులూ, సింహాలూ, పాములూ చేరి ఉన్నాయి. ఆయన లోపలికి వెళ్ళగానే, ఆ మృగాలన్నీ వెళ్ళిపోయాయి.

తరువాత ఆయన బయటకి వచ్చి నన్ను చూసి, నిన్ను చాలాకాలం నుండి చూస్తున్నాను, నువ్వూ, నీ తమ్ముడూ వచ్చి నాకు నమస్కారం చేసేవారు కదా? నువ్వు రెక్కలు కాలిపోయి ఇలా ఉన్నావేమిటి? అని అడిగారు. అప్పుడు నేను జరిగిన కథంతా చెప్పాను. అప్పుడాయన, "సంపాతి! బెంగ పెట్టుకోకు. భవిష్యత్తులో నీ వలన ఒక మహత్కార్యం జరగవలసి ఉంది. నువ్వు కొంతకాలానికి, సీతాపహరణాన్ని చూస్తావు. ఆ సీతమ్మను అన్వేషిస్తూ, వానరులు వస్తారు. వాళ్ళకు నువ్వు మాట సాయం చెయ్యి. నేను నీకు అభయం ఇస్తున్నాను. అలా చేస్తే నీ కాలిపోయిన రెక్కలు మళ్ళీ వస్తాయి. నాకు కూడా రామలక్ష్మణులను చూడాలని ఉంది. కానీ, అంతకాలం ఈ శరీరంలో ఉండాలని నాకు లేదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టేద్దామని అనుకుంటున్నాను. నువ్వు మాత్రం ఈ కొండమీదే వేచి ఉండు. నీకు ఇంకొక విషయం చెబుతాను. సీతమ్మను అపహరించిన తరువాత, ఆమెను వశం చేసుకుందామని రావణాసురుడు తన అంతఃపురం చూపిస్తాడు. దివ్యమైన భోజనము పెడతాడు. కానీ, ఆ తల్లి కన్నెత్తి కూడా చూడదు. ఒక్క మెతుకు కూడా ముట్టదు. ఆ తల్లికోసం దేవేంద్రుడు, ప్రతి రోజూ, దేవతలు కూడా చూడనటువంటి దివ్యమైన పాయసాన్ని పంపిస్తాడు. కానీ, సీతమ్మ ఆ పాయసాన్ని తినదు. ఆమె కొంచెం పాయసాన్ని తీసి, ఈ భూమండలంలో ఎక్కడైనా సరే, రామలక్ష్మణులు బతికుంటే, ఈ పాయసం వారికి చెందుగాక. ఒకవేళ రామలక్ష్మణులు శరీరాలను విడిచిపెట్టి ఉంటే, ఊర్ధ్వ లోకములలో ఉన్న వాళ్ళకి, ఈ పాయసం చెందుగాక. అని భూమి మీద కొంచెం పాయసాన్ని పెడుతుంది. ఆ సీతమ్మ తిన్న అన్నం, రావణుడు పెట్టినది కాదు. ఈ విషయాన్ని ఆ వానరులు వచ్చాక వాళ్ళకి చెప్పు" అని ఆనాడు నిశాకర మహర్షి నాకు చెప్పారు.

అందుకే, కొన్ని వేల సంవత్సరాల నుండీ ఇలా బతికి ఉన్నాను. ఆ నిశాకర మహర్షి చెప్పినట్లుగానే, సీతమ్మను రావణుడు ఆకాశ మార్గంలో తీసుకెళుతున్నప్పుడు, ఆమె ఆభరణాలను కొంగుకు చుట్టి విడిచిపెట్టడం నేను చూశాను. రావణాసురుడు విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు. సాక్షాత్తూ కుబేరుడి తమ్ముడు. ఆయన లంకా నగరానికి అధినేత. ఈ సముద్రానికి దక్షిణ దిక్కున, 100 యోజనముల అవతల లంక ఉంటుంది. ఆ లంకలో ఎక్కడ చూసినా బంగారు స్తంభములతో నిర్మింపబడ్డ భవనాలు ఉంటాయి. అటువంటి లంకా నగరంలో, దీనురాలై, పచ్చని పట్టు పుట్టం కట్టుకుని, ఏడుస్తూ, చుట్టూ రాక్షస స్త్రీలు ఉండగా సీతమ్మ ఉంది.. అయితే, ఈ విషయాలన్నీ నాకు ఎలా తెలుసని అడుగుతారేమో.. నేను ఇక్కడే కూర్చుని సీతమ్మను చూడగలను. నేను దివ్య దృష్టితో చూడగలను. నాకు ఆ శక్తి ఉంది. ఎందుకంటే, భూమి నుండి ఆకాశానికి కొన్ని అంతరములు ఉన్నాయి. మొదటి అంతరములో తమ కాళ్ళ దగ్గర ఉన్న ధాన్యాన్ని ఏరుకొని తినే కులింగములనే పక్షులు ఎగురుతాయి. రెండవ అంతరంలో, చెట్ల మీద ఉండే ఫలాలను తినే పక్షులు ఎగురుతాయి. మూడవ అంతరంలో, భాసములూ, క్రౌంచములూ ఎగురుతాయి. నాలుగవ అంతరంలో, డేగలు ఎగురుతాయి. అయిదవ అంతరంలో గ్రద్దలు ఎగురుతాయి. ఆరవ అంతరంలో హంసలు ఎగురుతాయి. ఏడవ అంతరంలో వినత పుత్రులమైన వైనతేయులము కాబట్టి, మేము ఎగురుతాము.

మేము తినే తిండి చేతా, మేము జన్మించిన జాతి చేతా, 100 యోజనముల అవతల ఉన్న విషయాన్ని కూడా ఇక్కడే ఉండి చూడగల దృష్టిశక్తి మా కంటికి ఉంది. దూరంగా లంకా పట్టణంలో, అశోక వనంలో సీతమ్మ కూర్చుని ఉండడం నాకు కనిపిస్తుంది. మీలో ఎవరైనా సాహసం చేసి 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళగలిగిన వాడు ఉంటే, సీతమ్మ దగ్గరకు వెళ్ళండి.. అని సీతమ్మ జాడ చెప్పాడు సంపాతి. ఈ మాటలను సంపాతి అక్కడి వానరులకు చెప్పగానే, కాలిపోయిన ఆయన రెక్కలు మళ్ళీ పుట్టాయి. అప్పుడాయన తన ఎర్రటి రెక్కలను అటూ ఇటూ ఊపి చూసుకున్నాడు. ఆనందంతో అక్కడున్న వానరులకు నమస్కరించి, సంపాతి ఆకాశంలోకి ఎగిరిపోయాడు.

ధర్మో రక్షతి రక్షితః

Sunday, December 18, 2022

భూత కోలా అంటే ఏమిటి? Bhoota Kola or Buta Kola of Kantara


భూత కోలా అంటే ఏమిటి? అందులో ఎటువంటి శక్తులను పూజిస్తారో తెలుసా?

ఇప్పుడు దేశమంతటా మారుమ్రోగిపోతున్న పేరు 'భూత కోలా'. మొన్నీ మధ్య రిలీజ్ అయిన 'కాంతార' అనే కన్నడ సినిమాలో ఈ భూత కోలా గురించి ఎంతో విశేషంగా చెప్పారు. ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో, ఇప్పుడు దేశమంతా 'భూత కోలా' అంటే ఏమిటి? 'పంజర్లీ' అంటే ఏమిటి? 'గుళిగ' అనే దేవత ఎవరు? భూతం అంటే అదో దుష్ట శక్తి కదా, అటువంటి దుష్ట శక్తిని కొలవడం ఏమిటి? ఈ వింత సంస్కృతి గురించి ఇన్నాళ్ళూ మనకు ఎందుకు తెలియలేదు? ఈ సంస్కృతిని ఎవరు? ఎక్కడ ఎక్కువగా పాటిస్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా ఈ సంస్కృతి మనుగడలో ఉంది? వంటి ప్రశ్నలపై, దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అందువల్ల, ఈ భూత కోలా గురించి వివరంగా తెలుసుకోవాలంటే, ఈ శీర్షికను పూర్తిగా చదవండి.

ఈ ప్రపంచంలో మరెక్కడా చూడని ఎన్నో ఆచార వ్యవహారాలకు ఆలవాలం, మన భారత దేశం. ఎందుకంటే, ఈ భూమిపై మొట్ట మొదటిసారి నాగరికత సాధించిన ఏకైక దేశం మన దేశమే అవ్వడంతో, ఈ అఖండ భారతావనిలో ఎక్కడికి వెళ్ళినా, కొన్ని యుగాల నాటి ఆచార వ్యవహారాలూ, నాటి తాలుకు గుర్తులూ, ఏదో ఒక విధంగా కనిపిస్తూనే ఉంటాయి. అటువంటి వాటిలో ఒకటే, ఈ భూత కోలా. సాధారణంగా మనలో చాలా మందికి, 'భూత' మరియూ 'భూతం'కీ మధ్య వ్యత్యాసం ఏంటి? అనే సందేహం ఉంటుంది. సంస్కృతంలోనూ, మన పురాతన భాషలలోనూ, భూత అంటే కాలం అనీ, ప్రకృతి శక్తులనీ అర్ధాలు వస్తాయి. ముఖ్యంగా మనుషులతో పాటు, సకల జీవరశూలనూ రక్షించే ప్రకృతి శక్తులను, భూత గణాలని అంటూ ఉంటారు. దాని వల్ల, భూత ప్రకృతి అయితే, భూతం దాని వికృతి పదం అని, భాషా వేత్తలు చెబుతున్నారు. ఆ పరంగా, భూత గణాలు జీవరాశిని రక్షించే శక్తులైతే, భూతం అనేది, దుష్ట శక్తికి ఉండే పేరుగా మారినట్లు, నిపుణులు చెబుతున్నమాట.

ఇప్పుడు కన్నడ సినిమా 'కాంతారా'లో చూపించిన భూత కోలా, ప్రకృతి శక్తుల ఆరాధనగా పెద్దలు చెబుతున్నారు. భూత అంటే ప్రకృతి శక్తి.. కోలా అంటే తుళు భాషలో, నృత్యం అనే అర్ధం వస్తుంది. ఈ భూత కోలా అనే నృత్యాన్ని, నేటికీ దక్షిణ కన్నడ కోస్తా ప్రాంతాలలో ఎక్కువగా చూడవచ్చు. మరీ ముఖ్యంగా, తుళు ప్రజలు ఎక్కువగా ఉండే మంగుళూరు, ఉడిపి, కుందాపుర వంటి కన్నడ కోస్తా ప్రాంతాలూ, కేరళలోని మలబార్ ప్రాంతంలో, భూత కోలా నృత్యాలను ప్రతి సంవత్సరం, వివిధ సందర్భాలలో అక్కడి ప్రజలు ఎంతో నిష్ఠగా ఆడటం, వారు ప్రకృతి దేవతలకు వివిధ పూజలు చేయడం వంటి ఆచారాలను పాటిస్తూ ఉంటారు.

ఈ ఆచారం మొదలై ఎన్ని సంవత్సరాలయ్యిందో తెలియదు కానీ, చాలా మంది చరిత్రకారులు చెబుతున్నదాని ప్రకారం, సామాన్య శకానికి 3000 సంవత్సరాల పూర్వం నుంచీ ఉందనీ, మరికొంత మంది చరిత్రకారుల ప్రకారం, కొన్ని యుగాల క్రితం, అంటే వేద కాలం కంటే ముందే, తుళు ప్రజలు ఆదిమ జాతులుగా ఉన్న సమయంలో, తొలిసారి వ్యవసాయం మొదలు పెట్టిన సమయంలోనే, ఈ ఆచారానికి నాంది పలికారనీ తెలుస్తోంది. నాడు తాము పండించే పంటలనూ, తమ జీవనానికి ఆధార భూతమైన ఆడవులనూ, దొంగల నుంచీ, దుష్ట శక్తుల నుంచీ కాపాడమని భూత గణాలను పూజించడం మొదలు పెట్టి, ఆ సందర్భంలో భూత కోలా ఆడటం మొదలు పెట్టారని, తుళునాడులో వినపడుతున్న స్థానిక కథలూ, అక్కడ దొరికిన కొన్ని ఆధారాలను బట్టి తెలుస్తున్నట్లు, చరిత్ర కారులు చెబుతున్నారు.

ఈ భూత కోలాలో, తుళు ప్రజలు వివిధ రకాల ప్రకృతి శక్తులను కొలుస్తారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవలసిన పేర్లూ, నేడు దేశం మొత్తం మారు మ్రోగుతున్న పేర్లూ రెండు. అవే పంజర్లీ, గుళిగ అనే రెండు శక్తులు. ముందుగా పంజర్లీ అనే ప్రకృతి దేవుడి విషయంలో, ఎన్నో కథలు అక్కడ ప్రాచుర్యంలో ఉన్నా, అక్కడి ప్రజలు ఎక్కువగా నమ్మే గాధ, పార్వతీ దేవీకి నచ్చిన, శివుడు శపించిన ఒక మగ అడవి పంది గాధ. పూర్వం కన్నడ కోస్తా అటవీ ప్రాంతంలో, సుబ్రహ్మణ్యస్వామిని కొలిచే ఒక ఆడ, ఒక మగ పందులు ఉండేవి. వాటికి కొన్నాళ్ళకు పిల్లలు పుట్టగా, వాటిలో ఒక పంది చాలా ముద్దుగా అనిపించి, పార్వతీ దేవి కైలాసానికి తీసుకెళ్ళి పెంచుకునేది. ఆ పందికి యుక్త వయస్సు వచ్చేసరికి, కోర దంతాలు బాగా పెరగటం, అందువల్ల దాని దంతాల దగ్గర ఎక్కువ దురద పెట్టడంతో, ఆ దురదను తీర్చుకోడానికి మట్టిని బాగా పెకలించేది.

ఈ క్రమంలో, శివయ్యకు ఎంతో ఇష్టమైన ఉద్యాన వనంలో ఉన్న మొక్కలను కూడా నాశనం చేయడంతో, స్వామికి కోపం వచ్చి, ఆ అడవి పందిని వధించాడు. తాను ఎంతో ప్రేమగా పెంచుకున్న వరాహం చనిపోవడంతో, పార్వతీ దేవి చింతించి, ఆ వరాహాన్ని తిరిగి బ్రతికించమని, శివుడిని కోరింది. సతి కోరికను మన్నించిన శివుడు, ఆ అడవి పందికి తిరిగి ప్రాణం పోసి, దానికి కొన్ని దైవిక శక్తులు ఇచ్చి, భూమిపై ఉండే ప్రజలను రక్షించమని, కన్నడ కోస్తా ప్రాంతానికి పంపించాడు. అప్పటి నుంచీ తుళు ప్రజలు, ఆ అడవి పందిని పంజర్లీ అనే పేరుతో కొలుస్తూ, భక్తి శ్రద్ధలతో, భూతకోలా ద్వారా పూజించడం జరుగుతోంది.

ఇక గుళిగ అనే మరో ఉగ్ర దేవతను కూడా తుళు ప్రజలు కొలుస్తూ ఉంటారు. ఈ గుళిగ దేవత ఆవిర్భావం కూడా ఎంతో వింతగానే ఉంటుంది. స్థానికంగా వినిపిస్తున్న గాధల ప్రకారం, ఒకనాడు పార్వతీ దేవికి, విశ్వాంతరాళాలలో ఒక వింత రాయి దొరికింది. ముచ్చటపడి ఆ రాయిని కైలాసానికి తీసుకువెళ్ళగా, శివయ్య అది కైలాసంలో ఉండదగ్గ రాయి కాదని, భూమిపైకి విసిరివేశాడు. అలా శివుడు విసిరేసిన రాయి ఒక పాము కడుపులో ప్రవేశించి, ఒక రూపం సంతరించుకుని, నెలలు నిండిన తర్వాత తన తల్లితో, 'నేను ఎలా బయటకి రావాలి?' అని అడిగాడు. దానికి ఆ తల్లి పాము, అందరూ ఎలా పుడతారో నువ్వు కూడా అలాగే బయటకి వస్తావు, అని చెప్పింది.

కానీ, ఆవేశం ఆగని గుళిగ దేవుడు, పొట్టను చీల్చుకుని బయటకు వచ్చేశాడు. రావడం రావడం, తనకు విపరీతమైన ఆకలి వేయడంతో, తనకు కనపడిన ప్రతి వస్తువునూ తినడం ఆరంభించాడు. అంతేకాదు, ఆ ప్రాంతంలో విష్ణు మూర్తికి ఎంతో ప్రీతికరమైన ఒక చేరువులోని నీటిని మొత్తం త్రాగేసి, అందులో ఉన్న మొత్తం చేపలను తినేసినా అతని ఆకలి తీరలేదు. దాంతో విష్ణు మూర్తి ప్రత్యక్షమయ్యి, ఆ గుళిగ దేవుడి ఆకలి బాధను మటుమాయం చేసి, తనతో పాటు వైకుంఠానికి తీసుకువెళ్లాడు. అక్కడ విష్ణు మూర్తి దగ్గర ధర్మ రక్షణకు సంభందించిన సూత్రాలనూ, కొన్ని శక్తులనూ అవపోశన పట్టగా, భూమిని రక్షించమని విష్ణు మూర్తి తిరిగి గుళిగ దేవుడిని భూమిపైకి పంపివేశాడు. అలా వచ్చిన గుళిగ దేవుడు, క్షేత్రపాలకుడిగా ఆలయాలను రక్షిస్తూ, ప్రజల కష్టాలను తిరుస్తూ ఉన్నాడని, తుళు ప్రజలు బలంగా నమ్ముతారు.

అంతేకాదు, ఈ గుళిగ దేవుడికి కోపం ఎక్కువనీ, అతనికి మొక్కులు చెల్లించకపోయినా, అతన్ని అవమానించినా, అతని విషయంలో ఏ చిన్న తప్పు జరిగినా, అలా చేసిన వారు ఎన్నో కష్ట నష్టాలు పడటంతో పాటు, వారు చేసిన పాపం ఘోరమైనదైతే, వెంటనే వారు రక్తం కక్కుకుని చనిపోతారని, తుళు ప్రజల నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ, అక్కడ ఎన్నో సంఘటనలు కూడా జరిగినట్లు, తుళు ప్రజలు చెబుతారు. అందువల్ల, నేటికీ దక్షిణ కన్నడ కోస్తా, మరియూ కేరళ మలబార్ ప్రాంతాలలో భూత కోలా నిర్వహించినప్పుడు, పంజర్లీ దేవుడినీ, గుళిగ దేవుడినీ ఎంతో శ్రద్దగా, ఒకేసారి పూజించడం చూస్తూ ఉంటాము.

భూత కోలా జాతర, పూజలలో, ప్రజలంతా పాల్గొన్నా, ఆ భూత కోలా ఆడేవారు మాత్రం ప్రత్యేకంగా ఉంటారు. కేవలం తరతరాలుగా కొన్ని కుటుంబాల వారు మాత్రమే ఈ భూతకోలా ఆడతారనీ, నేటికీ ఆయా కుంటుంబాలు మాత్రమే, భూత కోలా నాట్యం చేస్తున్నారనీ, స్థానికులు చెబుతారు. ఇలా నాట్యం చేసేవారు, ఎంతో భక్తి శ్రద్దలూ, మడి ఆచారాలు పాటిస్తూ, వారి మేకప్ వారే వేసుకుని, ఆయా దేవుళ్ళ ముందుకు వచ్చి నాట్యం చేస్తారు. ఈ క్రమంలో, వారిపైకి ఆయా దేవుళ్ళు ఆవహించి, ప్రజలకు ఉండే వివిధ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం, ఎన్నో కుటుంబ, రాజకీయ తగాదాలను తీర్చడం వంటివి కూడా చేస్తారు. ఇప్పటికీ తుళు నాడు లోని ప్రజలు ఎక్కువగా, భూత కోలా నాట్యం చేసే వారి దగ్గరే తమ సమస్యలను పరిష్కరించుకుంటారని, నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే, తుళు ప్రజలు కేవలం పంజర్లీ, గుళిగ దేవతలనే కాకుండా, ఇంకా ఎంతో మంది ప్రకృతి దేవీ దేవతలను 'భూత కోలా'లో కొలుస్తారు. తుళు ప్రజల నమ్మకం ప్రకారం, ఆయా దేవుళ్ళలో కొన్ని ప్రకృతి శక్తులు ఉంటే, మరికొన్ని, శివయ్యను జీవితాంతం పూజించిన సాధువులూ, ఋషులూ చనిపోయిన తర్వాత శక్తులుగా మారిన వారు కూడా ఉన్నట్లు, నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ శక్తులన్నీ, పరమేశ్వరుడి దగ్గర ఉన్న ప్రమధ గణాలలోని వారని తుళు ప్రజలు ఎంతో బలంగా నమ్ముతారు. అందుకే తరాలు మారినా, యుగాలు గడచినా, అక్కడి ప్రజలు నేటికీ, ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రకృతి శక్తులను ఆరాధిస్తూ, భూత కోలా ఆడుతున్నారు.

సర్వేజనాః సుఖినోభవంతు!

What is Bhoota Kola? All about the controversy over the ritual depicted in the Kannada movie 'Kantara' in Telugu..

Saturday, December 17, 2022

దృష్టికి పెట్టుకునే రాగి యంత్రాలు Drishti Yantras


దృష్టికి పెట్టుకునే రాగి యంత్రాలు పూజ గదిలో పెట్టుకోవచ్చా?
అసలు రాగి యంత్రాల వల్ల ప్రయోజనం ఉందా? ఇది చదివితే మీకే అర్ధం అవుతుంది..

మనిషి ఉదయం లేచినప్పటి నుంచి, రాత్రి పడుకునేంత వరకు, ఎన్నో పనులు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో, ఇతరులు మనల్ని చూసో, మన ఇంటిని చూసో, ఈర్ష్య చెందుతుంటారు. దాని వల్ల, మనకు తెలియకుండానే దృష్టి ప్రభావం ఇంటిపై పడటం వల్ల, ఆ ఇంట్లోని వారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందువల్ల, ఆ దృష్టి ప్రభావం నుంచి తప్పించుకోవడానికి, ఇంటికి బూడిద గుమ్మడికాయను కట్టడం, ఇంటికి దృష్టి తీయయడం వంటి కొన్ని పరిహారాల గురించి, ధర్మ సందేహాలలో స్పష్టంగా చెప్పబడింది. అయితే, మనలో చాలా మంది, దృష్టి పోడానికి కొన్ని రాగి రేకు యంత్రాలను సైతం తెచ్చుకుని, ఇంటి ముందు కట్టుకుంటారు. కానీ మరికొంతమంది, వాటిని దేవుడి గదిలో కూడా పెట్టుకోవడం చూస్తుంటాము. ఆ రాగి రేకులను పూజ గదిలో పెట్టుకోవచ్చా, లేదా? రాగి రేకుల వల్ల దృష్టి నిజంగా పోతుందా? దృష్టిని తొలగించే యంత్రాలను, దేవుడి గదిలో ఎందుకు పెట్టమని చెబుతున్నారు? వంటి సందేహాలు ఎన్నో, మనలో చాలా మందికి కలగకమానవు. అటువంటి సందేహాలకు సమాధానాలు తెలియయాలంటే, ఈ శీర్షికను పూర్తిగా చదవండి..

ఇంటికి పట్టిన దృష్టి పోవాలంటే, బూడిద గుమ్మడి కాయ, నిమ్మకాయలు, పచ్చిమిర్చి వంటివి గుమ్మలకు కడుతూ ఉంటాము. కొంతమంది, ఎర్ర గుడ్డలో స్పటికా, నవ ధాన్యాలు, పసుపు, కుంకుమ వంటివి కలిపి ముడివేసి, గుమ్మానికి కట్టడం కూడా చూస్తుంటాము. కానీ, వాటితో పాటు చాలా సందర్భాలలో, రాగి యంత్రాలను కూడా ఇంటికి దృష్టి తగలకుండా ఉండటానికి కట్టడం జరుగుతుంటుంది. అయితే, ఇవి సాధారణ రాగి రేకులు మాత్రం కావనీ, వాటిపై కొన్ని మంత్ర బీజాక్షరాలను ఓ క్రమ పద్దతిలో రాస్తారనీ, వాటిలో ఎన్నో రకాలు ఉంటాయనీ, కొన్ని ఇంటికి పట్టిన దృష్టికి సంబంధించినవి ఉంటే, మరికొన్ని శ్రీ చక్రం వంటి శక్తి యంత్రాలు ఉంటాయనీ, పండితులు చెబుతున్నారు.

అంతేకాదు, సాధారణంగా రాగికి negative ఎనర్జీని లాక్కునే గుణం ఉంటుంది. దానికి తోడు, ఈ మంత్రాలు కూడా జత కలిస్తే, అది శక్తి యంత్రంగా పని చేసి, ఆ ఇంటిపై కేవలం దృష్టి దోషాలే కాకుండా, గాలీ, ధూళి వంటి వాటిని కూడా వాలకుండా చూసుకుంటుందని, పండితులు చెబుతున్నారు.

అయితే, మనకి ఎవరైనా పండితులు రాగి యంత్రాలను ఇచ్చి, ఒకటి గుమ్మం దగ్గర, ఇంకొకటి దేవుడి గదిలో పెట్టుకుని పూజించమని చెప్పారంటే, వారు చెప్పిన విధంగా చేయాలని పెద్దల మాట. ఎందుకంటే, గుమ్మంపై కట్టుకునే రాగి యంత్రం, దృష్టి దోషాలు తగలకుండా చేస్తే, పూజ గదిలో పెట్టుకునే యంత్రం, ఇంట్లో దైవ బలం పెంచి, positive energy ని పెంచే విధంగా ఉంటుంది. అంతే కాదు, ఆ యంత్రాలలో గుమ్మంపై కట్టిన దానికి, రోజూ సాంబ్రాణి పొగ కానీ, ఆగరు వత్తుల పొగ కానీ ఖచ్చితంగా వేయాలి. అలాగే, దేవుడి గదిలో పెట్టిన యంత్రానికి, ప్రతి రోజూ నిత్య పూజ చేసుకునే సమయంలో, కాస్త కుంకుమను, ‘శ్రీ మాత్రే నమః’ అనే మంత్రం చదువుకుంటూ వేయాలని, శాస్త్ర వచనం. ఇలా చేయడం వల్ల, అవి శక్తి వంతంగా పని చేస్తాయనీ, ఆ విధంగా చేయకపోతే, కొన్ని రోజులకు వాటిలో ఉండే తేజస్సు తగ్గి, ఫలితాలు ఇవ్వడం మానేస్తాయనీ పండితుల మాట.

సర్వేజనాః సుఖినోభవంతు!

Thursday, December 15, 2022

లక్ష్మీ కటాక్షం - Avoid doing these things on bed..

 

మంచంపై ఈ పనులు చేయకపోతే లక్ష్మీదేవి మీ ఇంటే స్థిరంగా ఉంటుందని మీకు తెలుసా?

గత కొన్నేళ్లుగా జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఆధునీకరణ నేపద్యంలో, నగరాలలో నివసించే ప్రజల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దాంతో, ఒకప్పుడు విశాలంగా ఉండే ఇళ్ళు కాస్తా, ఇరుకు గదులుగా తయారవుతున్నాయి. అందువల్ల, నేడు చాలా మంది నేర్చుకుంటున్న కొత్త అలవాటు, మంచాలను ఎక్కవగా వాడటం. అవసరం ఉన్నా లేకపోయినా, మనలో చాలా మంది, మాట్లాడితే మంచంపైనే ఎన్నో పనులు చేస్తున్నారు. అయితే, కొన్ని పనులు మాత్రం, మంచంపైన అస్సలు చేయకూడదనీ, అలా చేస్తే, అష్ట కష్టాలనూ కోరి తెచ్చుకున్నట్లవుతుందనీ, పండితులు చెబుతున్నారు. అసలు మంచంపైన ఏ పనులు చేయవచ్చు? ఏ పనులు చేయకూడదనే విషయంపై, మనలో చాలా మందికి అవగాహన ఉండదు. అందువల్ల, శాస్త్రానుసారం, మంచం పై చేయాల్సిన, చేయకూడని పనుల గురించి, తెలుసుకుందాము.

ఈ మధ్య కాలంలో గదులు చిన్నగా ఉండటం వల్లనో, బెడ్ రూమ్ లోనే టీవీ ఉందనో, మంచం మీద బాగా కంఫర్ట్ గా ఉందనో, చాలా మంది, ఉదయం టిఫిన్ నుంచి, రాత్రి భోజనం వరకు, మంచాలపైనే కుర్చుని తింటున్నారు. ఆ విధంగా అస్సలు చేయకూడదని, పండితులు చెబుతున్నారు. మంచంపై కుర్చుని తినడం వల్ల, రోగాల భారిన పడే అవకాశం ఎక్కువని, ఆధునిక విజ్ఞానం కూడా చెబుతోంది.

కొంతమంది పిల్లలు మంచాలపై కుర్చుని చదువుకోవడం, మంచాలపైనే హోం వర్క్ రాసుకోవడం వంటివి చేస్తుంటారు. ఆ విధంగా చేయడం వల్ల, సర్వస్వతీ మాతను అవమానించినట్లేననీ, దాంతో పిల్లల విద్య దెబ్బతిని, భవిష్యత్తులో ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుందని శాస్త్ర వచనం.

ఇక కొంతమంది ఆడవాళ్ళయితే, మంచాలపైనే కుర్చుని, వంటకు సంబంధించిన కూరగాయలు తరుక్కోవడం, ఇతర ఇంటి పనులు చేసుకోవడం వంటివి చేస్తుంటారు. ఇదిలా ఉంటే, కొంతమంది ఇళ్లలోని వారు, బయటి నుంచి వచ్చి, కాళ్ళు కూడా కడుక్కోకండా, నేరుగా మంచంపై పడిపోతారు. ఇలా చేయడం వల్ల, లక్ష్మీమాత ఆ ఇంటిని వెంటనే వదిలి వెళ్ళిపోతుందనీ, దాంతో వారు అటు ఆరోగ్యపరంగానూ, ఇటు ఆర్ధికంగానూ ఇన్నో ఇబ్బందులకు గురవుతారని, పండితులు చెబుతున్నారు.

అసలు మన శాస్త్రాలు చెప్పిన దాని ప్రకారం, మంచంపై, రాత్రి వేళలో పడుకోవడం తప్ప, మరో పని చేయకూడదనీ, మంచంపై వేసిన పక్కను కూడా, ప్రతి రెండు రోజులకోసారి తీసి, శుభ్రం చేసుకోవాలనీ, ఉదయం లేచిన వెంటనే మంచంపై ఉన్న పక్కను సక్రమంగా వేసుకోవాలనీ నిపుణులూ, పండితులు చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల, ఆ ఇంట లక్ష్మి దేవి తిష్ట వేసుకుని కుర్చుంటుందని, శాస్త్ర వచనం.

సర్వేజనాః సుఖినోభవంతు!

Wednesday, December 14, 2022

సవ్యసాచి - భగవద్గీత | Savyasachi - Bhagavadgita


'సవ్యసాచి'!
రెండు చేతులతోనూ సమాన వేగము, ప్రతిభతో బాణములను సంధించగలవాడు!

'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (31 – 35 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 31 నుండి 35 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

శ్రీ కృష్ణుడి విశ్వరూప దర్శనాన్ని చూసి, అర్జునుడు ఈ విధంగా ప్రణమిల్లుతున్నాడు..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/6LckBaTv098 ]



00:47 - ఆఖ్యాహి మే కో భవానుగ్రరూపో
నమోఽస్తు తే దేవవర ప్రసీద ।
విజ్ఞాతుమిచ్ఛామి భవంతమాద్యం
న హి ప్రజానామి తవ ప్రవృత్తిమ్ ।। 31 ।।

ఓ భయంకర రూపము కలవాడా, నీవెవరో తెలియచేయుము. ఓ దేవదేవా, నీ ముందు ప్రణమిల్లుతున్నాను; దయచేసి నాపై కృప చూపుము. సమస్త సృష్టికన్నా ముందే ఉన్న నీ గురించీ, నీవెవరో తెలుసుకోగోరుతున్నాను. ఎందుకంటే, నీ స్వభావము, మరియు వ్యవహారమును నేను అర్థం చేసుకోలేకున్నాను.

ఇంతకు క్రితం అర్జునుడు, విశ్వ రూపమును చూడాలని ప్రార్ధించాడు. తదుపరి, శ్రీ కృష్ణుడు దానిని చూపించినప్పుడు, అర్జునుడు భీతిల్లిపోయి, అయోమయానికి గురి అయ్యాడు. నమ్మశక్యం కాని మహాద్భుతమును చూసిన పిదప అతను భగవంతుని యొక్క యదార్ధ స్వభావమును, మరియు సంకల్పమును తెలుసుకోదలిచాడు. అందుకే ఇలా అడుగుతున్నాడు, "నీవెవరు, నీవు ఎందుకున్నావు?" అని.

01:50 - శ్రీ భగవానువాచ ।
కాలోఽస్మి లోకక్ష్యయకృత్ ప్రవృద్ధో
లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ।
ఋతేఽపి త్వాం న భవిష్యంతి సర్వే
యేఽవస్థితాః ప్రత్యనీకేషు యోధాః ।। 32 ।।

శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు: నేనే మహాకాలమును. సమస్త లోకములను సర్వనాశనము చేసే మూలకారణమును. నీ యొక్క ప్రమేయం లేకున్ననూ, ప్రతిపక్షమున నిలిచి ఉన్న యోధులు ఎవ్వరూ మిగలరు.

అర్జునుడి ప్రశ్నకు సమాధానముగా, శ్రీ కృష్ణుడు తన ప్రవృత్తిని, సర్వ శక్తివంతమైన కాల స్వరూపముగా, విశ్వ వినాశకారిగా తెలియచేస్తున్నాడు. సమస్త ప్రకృతి ఘటనలన్నీ కాలంలో కలిసిపోతాయి. కాలమనేది, ప్రతి ఒక్క జీవ ప్రాణి యొక్క జీవితకాలాన్ని లెక్కిస్తుంది, మరియు నియంత్రిస్తుంది. భీష్ముడు, ద్రోణాచార్యుడు మరియు కర్ణుడి వంటి గొప్ప వారు సైతం, ఎప్పుడు అంతమై పోవాలో అదే నిర్ణయిస్తుంది. అర్జునుడు ఆ యుద్ధంలో పాలుపంచుకోకపోయినా సరే, కాలమనేది, శత్రు పక్షంలో బారులు తీరి ఉన్న వారందరినీ నశింపచేస్తుంది. ఎందుకంటే, భగవంతుడు ప్రపంచం పట్ల తన బృహత్ ప్రణాళికలో భాగంగా, అది అలాగే అవ్వాలని సంకల్పించాడు.

03:09 - తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ
జిత్వా శత్రూన్ భుంక్ష్వ రాజ్యం సమృద్ధమ్
మయైవైతే నిహతాః పూర్వమేవ
నిమిత్తమాత్రం భవ సవ్యసాచిన్ ।। 33 ।।

కాబట్టి ఓ సవ్యసాచీ, లెమ్ము, కీర్తిని పొందుము! శత్రువులను జయించుము, మరియు సర్వసంపదలతో ఉన్న సామ్రాజ్యమును అనుభవించుము. ఈ యోధులు ఇంతకు పూర్వమే నా చే సంహరింపబడి ఉన్నారు. నీవు కేవలం నా పనిలో ఒక పనిముట్టుగా ఉండగలవు.

కౌరవులు నశించిపోవాలి, మరియు హస్తినాపుర సామ్రాజ్యము పాండవులచే ధర్మ బద్ధంగా పాలింపబడాలి.. అన్న సంకల్పాన్ని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి తెలియచేశాడు. శ్రీ కృష్ణ పరమాత్మ, ఇంతకు మునుపే అధర్మపరుల వినాశనాన్నీ, మరియు ధర్మాత్ముల విజయాన్నీ, యుద్ధము యొక్క పరిణామముగా నిశ్చయించాడు. లోక సంక్షేమం కోసం ఆయన వేసిన పధకాన్ని, ఏ శక్తి కూడా మార్చలేదు. ఇప్పుడు అర్జునుడు నిమిత్త మాత్రునిగా ఉండడమే తను కోరుకుంటున్నానని, శ్రీ కృష్ణుడు అతనికి చెప్తున్నాడు. భగవంతునికి తన పని యందు ఒక మానవుని సహాయం ఏమీ అవసరం లేదు. కానీ, మనుష్యులు ఆయన సంకల్పాన్ని నేరవేర్చటానికి పని చేస్తే, అది వారికి నిత్య శాశ్వత సంక్షేమం కలిగిస్తుంది. భగవంతుని ప్రీతి కొరకు పని చేసే అవకాశాలనేవి, చాలా అరుదుగా మనకు తారసపడే అనుగ్రహాలు. ఈ అవకాశాలను సద్వినియోగము చేసుకోవటం ద్వారానే, భగవంతుని విశేష కృపకు మనము పాత్రులమవ్వగలుగుతాము, మరియు, మనము  భగవత్ సేవకులుగా, మన యొక్క నిత్య శాశ్వత స్థాయిని సాధించగలుగుతాము.

తన కృపచే, విలుకాడిగా సాటిలేని ప్రతిభను పొందిన విషయాన్నిఅర్జునుడికి గుర్తు చేస్తూ, తన చేతిలో పనిముట్టుగా ఉండమని అర్జునుడిని ప్రోత్సహిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. అందుకే ఆర్జునుడిని, 'సవ్య సాచి' అని సంబోధిస్తున్నాడు.. అంటే, నిష్ణాతుడైన విలుకాడు అని. అది ఎలా అంటే, అర్జునుడు రెండు చేతులతో కూడా సమాన వేగము, ప్రతిభతో బాణములను సంధించగలడు.

05:18 - ద్రోణం చ భీష్మం చ జయద్రథం చ
కర్ణం తథాన్యానపి యోధవీరాన్ ।
మయా హతాంస్త్వం జహి మా వ్యథిష్ఠా
యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్ ।। 34 ।।

ద్రోణాచార్యుడూ, భీష్ముడూ, జయద్రథుడూ, కర్ణుడూ, ఇంకా ఇతర వీర యోధులు అందరూ, నాచే ఇప్పటికే సంహరింపబడ్డారు. కాబట్టి, వ్యాకుల పడకుండా వారిని అంతము చేయుము. కేవలం పోరాడుము. నీవు ఈ యుద్ధములో శత్రువులపై విజయం సాధిస్తావు.

కౌరవుల పక్షమున ఉన్న చాలా మంది యోధులు, ఇప్పటివరకూ యుద్ధములో అజేయులే. జయద్రథుడికి ఒక వరము ఉంది. ఎవరైనా ఆయన తల భూమిపై పడేటట్టు చేస్తే , తక్షణం అలా చేసిన వారి తలకూడా ముక్కచెక్కలై పోతుందని.. కర్ణుడికి ఇంద్రునిచే ఇవ్వబడిన "శక్తి" అనే అస్త్రము ఉంది. దానిని ఎటువంటి వారిపై ఉపయోగించినా, అది వారిని సంహరిస్తుంది. కానీ, ఒక్కసారి మాత్రమే దానిని ఉపయోగించాలి. కాబట్టి, కర్ణుడు దానిని అర్జునుడిపై పగ తీర్చుకోవటానికి దాచుకున్నాడు. ద్రోణాచార్యుడు సమస్త అస్త్ర శస్త్రముల జ్ఞానాన్నీ, మరియు వాటిని నిర్వీర్యం చేసే ఉపాయాలనూ, భగవత్ అవతారమైన పరుశారాముని నుండి నేర్చుకున్నాడు. భీష్ముడికి తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మరణం వచ్చేటట్టు, ఒక వరం ఉంది. అయినా సరే, భగవంతుడు వారందరూ చనిపోవాలి అని సంకల్పిస్తే, వారిని మరేదీ కాపాడలేదు.

06:48 - సంజయ ఉవాచ।
ఏతచ్చ్రుత్వా వచనం కేశవస్య
కృతాంజలిర్వేపమానః కిరీటీ ।
నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం
సగద్గదం భీతభీతః ప్రణమ్య ।। 35 ।।

సంజయుడు ఇలా చెబుతున్నాడు: కేశవుడు పలికిన మాటలు విన్న తరువాత, అర్జునుడు భీతితో వణికిపోయాడు. చేతులు జోడించి, శ్రీ కృష్ణుడి ఎదుట వంగి నమస్కరిస్తూ, భయము ఆవరించి, గద్గద స్వరముతో ఇలా పలుకుతున్నాడు.

ఇక్కడ అర్జునుడిని, "కిరీటి" అని సంబోధించాడు, సంజయుడు. ఒకానొక సమయంలో, అతను ఇద్దరు రాక్షసులను సంహరించటంలో, ఇంద్రుడికి సహాయం చేశాడు. దానితో ప్రీతి చెందిన ఇంద్రుడు, ఒక అద్భుతమైన కిరీటమును ఆయన శిరస్సుపై ఉంచాడు. ఈ శ్లోకంలో, సంజయుడు అర్జునుడి శిరస్సున ఉన్న కిరీటమును సూచిస్తున్నాడు. అదే సమయంలో, కిరీటమనేది, రాజ్యాధికారమునకు కూడా గుర్తు. అందుకే సంజయుడు, వృద్ధుడైన ధృతరాష్ట్రునికి, జరగబోయే యుద్ధంలో ఆయన పుత్రులైన కౌరవులు, సింహాసనాన్ని కోల్పోతారని సూచిస్తూ, ఇలా అన్నాడు.

07:56 - ఇక మన తదుపరి వీడియోలో, అర్జునుడు శ్రీ కృష్ణుడి దివ్య రూపాన్ని చూసి, ఏ విధంగా స్తుతిస్తున్నాడో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Tuesday, December 13, 2022

దీపారాధన ఇలా చేయకపోతే ఇంట్లో దరిద్రం తాండవించడం ఖాయం! Deeparadhana Process


దీపారాధన ఎలా చేయాలి? Deeparadhana or Lighting Lamps or Diyas Importance in Telugu

మన సనాతన హైందవ ధర్మంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉన్న విషయం మనకు తెలుసు. అయితే, మనలో చాలా మందికి దీపారాధన ఎలా చేయాలి? ఏ ఏ సమయాల్లో ఇవ్వాలి? దీపపు కుందిలో ఎన్ని ఒత్తులు వేయాలి? దీపాన్ని ఏ దిక్కున వెలిగించాలి? ఎటువంటి కుందులలో దీపారాధన చేయాలి? దీపారాధనకు ఏ నూనెను వాడాలి? దీపం వెలిగించినప్పుడు ఏ మంత్రం చదవాలి - అని ఎన్నో సందేహాలు ఉంటాయి. మరి ఆ సందేహాలన్నింటికీ సమాధానం తెలియాలంటే, ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి.

దీపారాధన చేసే ముందు, దేవుడి దగ్గర ఉంచిన దీపారాధన కుందులనూ, ఇతర పాత్రలను కూడా శుభ్రం చేసుకోవాలి. ముందు రోజు దేవుడి దగ్గర పెట్టిన మలినాలన్నీ తీసేయాలి. దేవుడి దగ్గర ఉంచే దీపపు కుందులు, ఇత్తడి తో కానీ, పంచ లోహాలతో కానీ, వెండితో కానీ చేసినవే వాడాలి తప్ప, స్టీలు వంటి మరే ఇతర లోహాలూ వాడకూడదు. ఇవి కొనే స్థోమత లేని వారు, మట్టితో చేసిన దీపపు కుందులను వాడవచ్చు.

ఇక దీపారాధనకు వాడే తైలాలలో ముఖ్యంగా, మంచి మేలు రకమైన నువ్వుల నూనెను కానీ, ఆవు నెయ్యినీ, లేదా కల్తీ లేని కొబ్బరి నూనెనూ ఉపయోగించాలి. నేడు మార్కెట్ లో దీపరాధన తైలం అని అమ్మే నూనెలు అస్సలు వాడకూడదని, నిపుణులు చెబుతున్నారు.
ఇక దీపారాధన చేసేటప్పుడు, కుందిలో ఎప్పుడూ రెండు వొత్తులను కలిపి ఒక వొత్తిగా చేసుకుని, దీపం వెలిగించాలి. చాలా మంది తెలియక, ఒక ఒత్తిని మాత్రమే వేయడమో, లేక రెండు వేరు వేరు ఒత్తులు వెలిగించడమో చేస్తుంటారు. ఆ విధంగా అస్సలు చేయకూడదు.

ఇక దీపం వెలిగించినప్పుడు, ఆ దీపం దేవుడి వైపు మాత్రమే ఉండాలి. దీపం క్రింద ఎప్పుడూ ఒక చిన్న పళ్ళెం, లేదా కనీసం ఒక తమలపాకునైనా పెట్టాలి. దీపం నేరుగా ఎట్టి పరిస్థితులలోనూ, నేలపై పెట్టకూడదు. ఇక దీపారాధనను ప్రతి రోజూ రెండు సార్లు చేస్తే చాలా మంచిది. ఉదయం వీలైనంత త్వరగా దీపం వెలిగించాలనీ, కనీసం 9 గంటల లోపు వెలిగించాలని, పెద్దలు చెబుతున్నారు. ఇక సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కూడా దీపరాధన చేస్తే, చాలా మంచిది. అయితే, సాయంత్రం దీపరాధన చేయడం కుదరని వారు, కనీసం ఉదయం అయినా ఖచ్చితంగా చేసుకోవాలి.

ఇక ఉదయం దీపారాధన చేసే సమయంలో.. 

దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వ తమోపహం ।
దీపేన సాధ్యతే సర్వం దీప లక్ష్మీ ర్నమోస్తుతే ।।

ఈ మంత్రం జపిస్తే, దీపం పెట్టిన పూర్తి ఫలితం లభిస్తుందని, శాస్త్రం చెబుతోంది.
అలాగే, సాయంత్రం వేళ దీపరాధన చేసే వారు..

దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వ తమోపహం ।
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే ।।

అనే మంత్రాన్ని జపించాలి.

సర్వేజనాః సుఖినోభవంతు!

Wednesday, December 7, 2022

భూత-భవిష్యత్-వర్తమానాలు! Bhagavadgita భగవద్గీత

 

భూత-భవిష్యత్-వర్తమానాలు! భగవానుడి విశ్వరూపంలో అర్జునుడు ఏం చూశాడు?

'భగవద్గీత' ఏకాదశోధ్యాయం – విశ్వరూప దర్శన యోగం (26 – 30 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో పదకొండవ అధ్యాయం, విశ్వరూప దర్శన యోగము. ఈ రోజుటి మన వీడియోలో, విశ్వరూప దర్శన యోగములోని 26 నుండి 30 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/JQCy-zl-l0M ]


00:41 - అమీ చ త్వాం ధృతరాష్ట్రస్య పుత్రాః
సర్వే సహైవావనిపాలసంఘైః।
భీష్మో ద్రోణః సూతపుత్రస్తథాసౌ
సహాస్మదీయైరపి యోధముఖ్యైః ।। 26 ।।

00:54 - వక్త్రాణి తే త్వరమాణా విశంతి
దంష్ట్రాకరాళాని భయానకాని ।
కేచిద్విలగ్నా దశనాంతరేషు
సందృశ్యంతే చూర్ణితైరుత్తమాంగైః ।। 27 ।।

ధృతరాష్ట్రుడి కుమారులందరూ, వారి సహచర రాజులతో సహా, భీష్ముడూ, ద్రోణాచార్యుడూ, కర్ణుడూ, ఇంకా మన పక్షమున ఉన్న యోధులు కూడా తలక్రిందులుగా, నీ భయంకరమైన నోళ్లలోనికి త్వరితగతిన ప్రవేశిస్తున్నారు. కొందరి తలలు నీ భీకరమైన పళ్ళ మధ్యలో చితికిపోయినట్టు, నేను చూస్తున్నాను.

గొప్ప గొప్ప కౌరవ యోధులు - భీష్ముడూ, ద్రోణాచార్యుడు, మరియు కర్ణుడు, వీరితో పాటు మరెందరో పాండవ పక్ష యోధులు కూడా, భగవంతుని నోటిలోనికి తలక్రింద్రులుగా, త్వరగా, వేగగతిన పోయి, ఆయన పళ్ళ మధ్య నలిగి పోవటం, అర్జునుడు గమనిస్తాడు. అతి త్వరలో జరగబోయే పరిణామాలను, ఆ భగవంతుని యొక్క విశ్వ రూపములో దర్శిస్తున్నాడు. భగవంతుడు కాల పరిమితికి అతీతుడు కాబట్టి, భూత-వర్తమాన-భవిష్యత్తులన్నీ, ఆయన యందు ఇప్పుడే కనిపిస్తున్నాయి.

01:59 - యథా నదీనాం బహవోఽమ్బువేగాః
సముద్రమేవాభిముఖా ద్రవంతి ।
తథా తవామీ నరలోకవీరా
విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి ।। 28 ।।

02:11 - యథా ప్రదీప్తం జ్వలనం పతంగా
విశంతి నాశాయ సమృద్ధవేగాః।
తథైవ నాశాయ విశంతి లోకాః
తవాపి వక్త్రాణి సమృద్ధవేగాః ।। 29 ।।

ఎన్నో నదుల నీటి తరంగాలు సముద్రములోనికి పారుతూ వచ్చి కలిసి పోయినట్లు, ఈ గొప్ప గొప్ప యోధులు అందరూ, నీ ప్రజ్వలించే ముఖములలోనికి ప్రవేశిస్తున్నారు. అగ్గిపురుగులు ఎలాగైతే అత్యంత వేగముతో వచ్చి, మంటలో పడి నాశనం అయిపొతాయో, ఈ యొక్క సైన్యములు కూడా, నీ నోర్లలోనికి ప్రవేశిస్తున్నారు.

యుద్ధ రంగంలో ఏంతో మంది ఉత్తమ రాజులూ, మరియు యోధులూ ఉన్నారు. వారందరూ అది తమ కర్తవ్యముగా పరిగణించి, యుద్ధంలో పోరాడారు, మరియు యుద్ధరంగంలో తమ ప్రాణములను విడిచి పెట్టారు. అర్జునుడు వారిని, నదులు తమకు తామే వచ్చి సముద్రములో కలిసిపోవటంతో పోల్చుతున్నాడు. ఇంకా చాలామంది ఇతరులు, స్వార్ధం కోసం, మరియు దురాశతో యుద్ధ రంగానికి వచ్చారు. అర్జునుడు వారిని, అమాయకత్వంతో ఎర చూపబడి, అగ్నిలో పడి కాలిపోయే పురుగులతో పోల్చుతున్నాడు. ఈ రెంటిలో కూడా, ఆసన్నమైన మృత్యువు వైపు, వారు వడివడిగా పరుగులు పెడుతున్నారు.

03:24 - లేలిహ్యసే గ్రసమానః సమంతాత్
లోకాన్ సమగ్రాన్ వదనైర్జ్వలద్భిః ।
తేజోభిరాపూర్య జగత్సమగ్రం
భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో ।। 30 ।।

నీ యొక్క భయంకరమైన నాలుకలతో, ఎన్నెన్నో ప్రాణులను అన్ని దిక్కులా చప్పరించిపారేస్తూ, నీ యొక్క ప్రజ్వలిత నోళ్ళతో, వారిని గ్రహించి వేయుచున్నావు. హే విష్ణో! నీవు సమస్త జగత్తునూ, నీ యొక్క భయంకరమైన, సర్వ వ్యాప్తమైన తేజో కిరణాలతో తపింపచేయుచున్నావు.

భగవంతుడు సమస్త జగత్తునూ, మహా శక్తులైన సృష్టి, స్థితి, మరియు లయములచే నియంత్రిస్తూ ఉంటాడు. అన్ని దిక్కులా తన మిత్రులూ, శ్రేయోభిలాషులందరినీ గ్రహిస్తూ ఉన్న సర్వ భక్షక శక్తిగా, ఇప్పుడు అర్జునుడికి అగుపిస్తున్నాడు. ఆ యొక్క విశ్వ రూపములో, భవిష్యత్తులో జరిగే సంఘటనల దివ్య దర్శనంలో, ప్రారంభం కానున్న యుద్ధములో, తన శత్రువులు నిర్మూలించబడటం, అర్జునుడు చూస్తున్నాడు. ఏంతో మంది తమ పక్షం వారు కూడా, మృతువు పట్టులో ఉండటం గమనించాడు. తను చూసే అద్భుతమైన స్వరూపం వల్ల, భయంతో బిగిసిపోయాడు అర్జునుడు.

04:35 - ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడి విశ్వరూప దర్శనాన్ని చూసి, అర్జునుడు ఏ విధంగా ప్రణమిల్లుతున్నాడో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Monday, December 5, 2022

‘పిచ్చుకలు’ జాబాలి మహర్షికి చెప్పిన గుణపాఠం! Jaabaali Maharshi


‘పిచ్చుకలు’ జాబాలి మహర్షికి చెప్పిన గుణపాఠం!
పిచ్చుకల రూపంలో ధర్మదేవతలు జాబాలికి నేర్పిన గుణపాఠం ఏమిటి?

మన పురాణ ఇతిహాసాలలో ఎంతో మంది మునులూ, రుషులూ ఉన్నా, వారిలో జాబాలి మహర్షి ఎంతో ప్రాముఖ్యతను సంపాదించుకున్నారు. ప్రకృతి ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జించి, గొప్ప వ్యక్తిగా కీర్తిని గడించిన జాబాలికి, ఒక వ్యాపారస్థుడు తెలియజేసిన ధర్మ సూక్ష్మం ఏంటి? జాబాలి గోత్రానికే మూలమైన ఆయనకు, ధర్మదేవతలు ఎందుకు గుణపాఠం నేర్పారు - వంటి ఆసక్తికర విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/L4UeG2rUorU ]


ఒకానొకప్పడు జాబాలి అనే కుర్రవాడు ఉండేవాడు. తన తోటివారంతా వేదవిద్యను అభ్యసిస్తుంటే, జాబాలికి కూడా జ్ఞానాన్ని ఆర్జించాలన్న కోరిక కలిగింది. తనను శిష్యునిగా చేర్చుకోమని, గౌతమ మహర్షి దగ్గరకు వెళ్లి అర్థించాడు జాబాలి. అప్పుడు గౌతముడు, అతడి తల్లిదండ్రులూ, గోత్ర నామాదుల వివరాలు అడిగాడు. ఆ ప్రశ్నకు జాబాలి దగ్గర జవాబు లేకపోయింది. ఎందుకంటే, చిన్ననాటి నుంచి, అతను తన తండ్రిని ఎరుగడు. ఇక తన గోత్రమూ, తనకు తెలియదు. అందుకని, దాసిగా పనిచేసే తన తల్లి దగ్గరకు వెళ్లి, గౌతముని ప్రశ్నలకు జవాబును కోరాడు. ‘నాయనా! నీకు తండ్రి లేడు. నా పేరు జాబాల కాబట్టి, నా కుమారుడవైన నిన్ను జాబాలి అని పిలుచుకుంటున్నాను. ఈ నిజాన్ని నిర్భయంగా చెప్పగల ధైర్యం నీకు ఉన్నదని నమ్ముతున్నాను. అంతేకాదు! ఇకమీదట ఎప్పుడూ, సత్యాన్నే వాంఛించు. దానికి గుర్తుగా, నీకు ‘సత్యకాముడు’ అన్న పేరును జోడిస్తున్నాను’ అని చెప్పి పంపింది జాబాలి తల్లి. ఆ మాటలను యథాతథంగా సత్యకామ జాబాలి, గౌతమునితో చెప్పాడు.

జాబాలి సత్యవాక్కుకు సంతోషించిన గౌతముడు, అతణ్ని తన శిష్యగణంలో చేర్చుకున్నాడు.  జ్ఞానానికే అంతిమం అనదగ్గ బ్రహ్మజ్ఞానాన్ని, గౌతముని వద్ద పొందాలన్నది జాబాలి కోరిక. కానీ, జ్ఞానం పట్ల జాబాలికి ఉన్న తపనను పరీక్షించి కానీ, అతనికి విద్యను అందించేందుకు సిద్ధపడ లేక పోయాడు, గౌతముడు. అందుకోసం జాబాలికి ఆవులూ, ఆంబోతులూ ఉన్న పశుమందను అప్పగించి, ‘వీటి సంఖ్య వేయిగా మారేంతవరకూ, నువ్వు వాటిని అడవులలో సంరక్షిస్తూ ఉండు’ అని ఆదేశించాడు. అలా గురువుగారి ఆదేశం మేరకు, సత్యకామ జాబాలి, పశువుల మందను మేపుతూ, అడవులలో తిరగసాగాడు. కానీ, అతని మేధోశక్తికి, ప్రకృతిలోని ప్రతి అణువూ, ఏదో ఒక రహస్యాన్ని చెబుతున్నట్లే తోచేది. లేత చిగుళ్లు జీవనంలోని సౌకుమార్యాన్ని సూచిస్తే, ఎండిన ఆకులు, లయతత్వాన్ని బోధించాయి. కొండలు స్థిరత్వం గురించి చెబితే, సెలయేళ్లు సంతోషానికి శబ్దాన్నిచ్చాయి. అలా అడవిలో తిరుగుతూ కాలం గడుపుతూ, తనకు తెలియకుండానే ఈ ప్రకృతిలోని పరమజ్ఞానాన్ని పొందసాగాడు, సత్యకామ జాబాలి.

ఇలా ఉండగా ఒకరోజు, అతని మందలోని ఒక ఆంబోతు అతని దగ్గరకు వచ్చి, ‘సత్యకామా! మా సంఖ్య వేయిని చేరుకుంది. ఇక నువ్వు నీ గురువుగారి దగ్గరకు బయల్దేరవచ్చు. అయితే, అందుకు ముందుగా నీకు బ్రహ్మజ్ఞానంలోని తొలి పాదాన్ని వివరిస్తాను విను. ఈ విశ్వంలోని నాలుగు దిక్కులూ, ఆ బ్రహ్మతత్వంలోని భాగమే..!’ అని చెప్పింది. ఆ సాయంత్రం వెలిగించిన అగ్ని నుంచి వెలువడిన అగ్నిదేవుడు, ‘ఈ జగత్తులో భాగమైన భూమి, ఆకాశం, సముద్రాలు, అన్నీ కూడా బ్రహ్మంలోని భాగమే. ఇదే బ్రహ్మజ్ఞానంలోని రెండవ పాదం’ అని విశదీకరించాడు. ఇక మర్నాడు ఒక హంస అతని చెంతకు చేరి, వెలుతురును ప్రసాదించే రూపాలైన అగ్నీ, సూర్యుడూ, చంద్రుడూ, విద్యుల్లతలు కూడా, బ్రహ్మకు ప్రతిరూపాలే అని చెప్పి, ఎగిరిపోయింది. ఇక బ్రహ్మజ్ఞానంలోని చివరి పాదాన్ని, ఒక నీటి పక్షి అతనికి అందించింది. ‘మనిషి ఉనికికి ఆధారభూతమైన ప్రాణం, దృష్టి, వినికిడి, మనస్సు కూడా, బ్రహ్మలోని అంతర్భాగాలే’ అని ఆ నీటి పక్షి అతనికి చెప్పింది. అలా సత్యకామజాబాలి బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడై, సంతృప్తిగా తన గురువుగారి ఆశ్రమానికి చేరుకున్నాడు.

సత్యకామునిలో వెలుగొందుతున్న బ్రహ్మవర్చస్సును, అల్లంత దూరంనుండే చూసిన గురువుగారు, జరిగినది గ్రహించారు. ‘సత్యకామా! నీకు ఇక నా అవసరం లేదు. నీ అంతట నువ్వే, కావల్సిన జ్ఞానాన్ని సాధించగలిగావు’ అని అన్నారు. కానీ, సత్యకామునిలో తాను జ్ఞానాన్ని పొందానన్న గర్వం, ఇసుమంతైనా లేకపోయింది. ‘గురువుగారూ! జ్ఞానానికి అంతు ఎక్కడ? నాకు ఆ ఆంబోతు, అగ్ని, హంస, నీటిపక్షి, బ్రహ్మజ్ఞానాన్ని నేర్పిన మాట నిజమే. కానీ, మీ నుంచి కూడా ఎంతో కొంత విద్యను ఆర్జించాలనుకుంటున్నాను. దయచేసి ఈ దీనుడి కోరికను మన్నించండి’ అని వినమ్రతతో వేడుకున్నాడు. సత్యకాముని వినమ్రతకు ముగ్థుడైన గౌతముడు, తనలో ఉన్న జ్ఞానసారాన్ని కూడా, సత్యకామ జాబాలికి అందించాడు. దివ్యజ్ఞానాన్ని పొందిన జాబాలి, తపస్సులో నిమగ్నమయ్యాడు. అలా ఉండగా, అతడి తల మీద ఒక పిచ్చుక గూడు కట్టింది. అక్కడ గుడ్లుపెట్టి పొదిగి, వాటిని పిల్లలను చేసింది. ఆ పిచ్చుక, పిల్లలతో కలిసి అక్కడ నివసించ సాగింది. ఆ విషయం తెలిసిన జాబాలి, వాటిని తరిమి వేయకుండా భరిస్తూ, "ఆహా! నా వంటి ధర్మనిష్టాగరిష్టుడు ఎవరైనా ఉంటారా!" అని తనను తాను మెచ్చుకోసాగాడు.

అప్పుడు ఆకాశవాణి, "మహాత్మా! తనను తాను మెచ్చుకునే ధర్మనిష్ట ఎక్కడైనా ఉంటుందా? నీ కంటే ధర్మనిష్టా పరుడైన తులాధరుడు కూడా, ఇలా ఎప్పుడూ మాట్లాడ లేదు. ఇక నీ వెంత?" అని ఎగతాళి చేసింది. ఆ మాటలకు ఆశ్చర్యపడిన జాబాలి, "ఆ తులాధరుడు ఎక్కడ ఉంటాడు. నేను అతడిని కలవాలి" అని అడిగాడు. అతడు వారణాశి పురంలో నివసిస్తున్నాడని, ఆకాశవాణి పలికింది. జాబాలికి తులాధరుడి మీద కలిగిన మత్సరంతో, వారణాశికి వెళ్ళాడు. అక్కడ వ్యాపారం చేస్తున్న తులాధరుడిని చూశాడు. జనులంతా అతడిని ధర్మాత్ముడని పొగడుతున్నారు. జాబాలిని చూసిన తులాధరుడు అతడికి అతిథి సత్కారాలు చేసి, "మహానుభావా! మీ తల మీద పిచ్చుకలు తిరుగుతున్నా చలించక, హాయిగా తిరుగుతున్న మీరు, జితేంద్రియులు. గౌరవించదగిన వారు" అని అన్నాడు. అది విన్న జాబాలి, "అది సరే, నీవు చేసేది వ్యాపారం.. అందులో ధర్మము తప్పక చేయడం ఎలా సాధ్యము?" అని అడిగాడు.

అందుకు తులాధరుడు, "అయ్యా! నేను వస్తువులు కొనడంలో, అమ్మడంలో ఎలాంటి మోసములకూ పాల్పడను. కొంత లాభంతో తృప్తి పడతాను. లాభం వచ్చినప్పుడు పొంగిపోక, నష్టాలకు క్రుంగిపోక, సమ స్థితిలో ఉంటాను. నేను మట్టిబెడ్డనూ, బంగారపు ముద్దనూ, సమ దృష్టితో చూస్తాను. నేను ఎవరినీ పొగడను, తిట్టను. నన్ను నేను పొగడుకోను. ఇతరులను హింసించను. సాటి జీవులయందు, దయ కలిగి ఉంటాను. ఎల్లప్పుడూ సత్యమునే పలుకుతుంటాను. నేను భోగభాగ్యములను కానీ, కీర్తిప్రతిష్టలనుగానీ కోరను. ఎవరికైనా ఉపకారము చేసి, నేను ఇంత ఉపకారము చేశానని చెప్పుకోను. నాకు దేని మీదా మమకారముగానీ, ద్వేషముగానీ లేవు. ఈ లోకమును ఆటవస్తువులాగా చూస్తూ, బయటి ప్రపంచానికి, తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటాను" అని అన్నాడు. అందుకు జాబాలి, "తులాధరా! నీవు యజ్ఞములు, యాగములు, తపస్సు మొదలగు ధర్మముల గురించి మాట్లాడలేదు. వేదవిధులు, వీటిని సత్కర్మలంటారు కదా! మరి ఇది ఆచరించదగిన ధర్మము కాదా?" అని అడిగాడు.

"మహానుభావా! ఈ యజ్ఞములు, యాగములు, తపస్సులు, ఏవేవో కోరికలు తీరడానికి చేస్తారు. కనుక వాటి అవసరం లేదని నా అభిప్రాయం. ఈ యజ్ఞ యాగాలు, జననమరణ చక్రం నుండి మానవులను విముక్తి చేయలేవు. ఎవరైతే సత్యమునే ఒక యజ్ఞముగా పాటిస్తూ, నిత్య తృప్తుడై ఉంటాడో, అతడికి శాశ్వత ఆనందము కలుగుతుందని నా నమ్మకము" అని అన్నాడు తులాధరుడు. అందుకు జాబాలి, "తులాధరా! నీవు కర్మలు వదల కుండా చేస్తున్నావు కదా! దానికి కారణమేమిటి?" అని అడిగాడు. అందుకు తులాధరుడు ఇలా చెప్పాడు. "ఎవరు సతతమూ ధర్మమునే ఆచరిస్తారో, ఎవరు ధర్మముతో చెలిమి చేస్తారో, ఎవరు నిష్కల్మష హృదయంతో కర్మలు చేస్తుంటారో, అతడికి కర్మలు ఆచరించక పోతే కలిగే ఆనందము కలుగుతుంది. అన్ని నగరాలూ పుణ్య క్షేత్రములే.. అన్ని నదులూ పుణ్య నదులే.. నిష్కల్మష హృదయంతో ఉన్న వాడికి, అన్నీ పవిత్ర నదులే.. వృత్తిధర్మంగా పనిచేస్తున్నాను, ఫలితం భగవంతుడికి అప్పగిస్తాను, అనుకుని కర్మలు చేసే వాడికి, ఏ దోషమూ అంటదు. ఫలితం ఆశించి చేసే కర్మలకు, దోషం అంటకుండా ఎలా ఉంటుంది? నాకు తెలిసిన ధర్మము ఇది. ఇది సరైన ధర్మం ఔనోకాదో, సజ్జనులను అడిగి తెలుసుకుంటాము. నీవు ఇన్ని రోజులూ తండ్రిలా పోషిస్తున్న ఆ పిచ్చికలు, హాయిగా ఎగురుతున్నాయి. వాటిని పిలిచి, లాలించు" అని అన్నాడు.

అప్పుడు జాబాలి పిచ్చుకలను దగ్గరకు పిలిచాడు. అవి అతడి దగ్గరకు రాకుండా, అలా ఆకాశంలో ఎగురుతూ, "ఓ మునీంద్రా! మేము ధర్మదేవత దూతలము. ధర్మదేవత పంపగా, నిన్ను పరీక్షించడానికి వచ్చాము. మేము మీకు కలిగిన సందేహమును తీరుస్తాము. ఎవరి మనస్సులో ఇతరుల ఎడల ద్వేషము, మాత్సర్యము ఉంటుందో, అతడికి ఇతరులతో తగవులాడాలని కోరిక కలుగుతుంది. అందువలన, హింస చెలరేగుతుంది. కనుక మునీశ్వరులకు, తమలో తాము ద్వేషించడం, మాత్సర్యము వహించడము, కూడనివి. ‘స్పర్ధ’ ధర్మాన్ని నాశనం చేస్తుంది. ధర్మం నశిస్తే, మనిషి నాశనం ఔతాడు. కనుక మానవుడు స్పర్ధను వదలాలి. సత్వగుణము వలన శ్రద్ధ పుడుతుంది. శ్రద్ధ ఉన్నవాడు, తాను తెలుసుకో తగిన దానిని తెలుసుకుంటాడు. ప్రతి మనిషికీ, శ్రద్ధ ముఖ్యము. శ్రద్ధలేని తపస్సూ, యజ్ఞ యాగములూ నిష్ఫలములు. కనుక శ్రద్ధే, అన్నిటి కంటే ముఖ్యము. శ్రద్ధ ధనమువంటిది. అది మనసును చెడు దారిలో పోకుండా కాపాడుతుంది. శ్రద్ధ జీవాత్మ యొక్క ప్రసన్నత్వము. యాగము చేయుటకు శ్రద్ధ, శుచిత్వము, ముఖ్యము. శ్రద్ధలేని శుచిత్వము, శుచిత్వములేని శ్రద్ధ, నిష్ఫలమే. ఇదే విషయాన్ని బ్రహ్మ, దేవతలతో ఇలా చెప్పాడు. శ్రద్ధ కలిగిన వాడు ఉత్తముడు. అతడి చేతి భోజనము, అత్యంత శ్రేష్టము.

ధనము వడ్డీకి ఇచ్చి, ఆ వడ్డీతో దానధర్మలు చేసేవాడూ, వేదవేదాంగములు చదివిన లోభి అయిన వాడూ సమానమే. అందులో యాగములో దానము చేసిన వాడు, శ్రేష్టుడు. శ్రద్ధలేని వాడికి, దానము చెయ్యడానికి మనస్కరించదు. శద్ధ కలిగిన వాడి మనసులో, మత్సరం ఉండదు. అందుకని, శ్రద్ధ కలిగిన వాడు శ్రేష్టుడు" అని పిచ్చుకలు జాబాలికి చెప్పాయి. ఆ మాటలు విన్న జాబాలి తులాధరుడిని చూసి, "మహాత్మా! నాకు ఆన్నీ తెలుసనుకున్నాను. నాకు ఏమీ తెలియదని ఇప్పుడు తెలుసుకున్నాను. నేను మునుల మాటలను వినలేదు కనుక, నన్ను నేను పొగడుకోవడమనే దోషం నాకు పట్టుకుంది. నీ మాటలతో నాకు దోషము పోయింది. ఇక నేను ప్రశాంత చిత్తంతో జీవిస్తాను" అని పలికాడు జాబాలి. ఆ మాటలతో సంతోషించిన తులాధరుడు, "ఓ మహాత్మా! ఎవరికైనా స్వధర్మం కంటే మించిన ధర్మము మరొకటి లేదు" అని పలికాడు. తరువాత జాబాలి, తులాధరుడి వద్ద శెలవు తీసుకుని వెళ్ళి పోయాడు. ఆనాటి నుండి, జాబాలి ధర్మాన్ని నిష్ఠతో పాటించాడు.

ఈ సత్యకామ జాబాలి కథ, కేవలం ఛాందోగ్య ఉపనిషత్తుతోనే ముగిసిపోలేదు. సత్యాకముడు, పిప్పలాదుడనే ఋషికి చెప్పిన, మంత్రాలతో కూడిన ‘జాబాలి ఉపనిషత్తు’ కూడా, మన గ్రంథాలలో ప్రముఖమైన స్థానాన్ని దక్కించుకుంది. ఇక రామాయణంలోనూ, జాబాలి ప్రస్తావన వస్తుంది. అయితే, జాబాలిని ఒక నాస్తికునిగా, రామాయణం ఎంచుతుంది. తనలో ఉన్న బ్రహ్మమే ఈ సృష్టి అంతా వ్యాపించి ఉందన్న జాబాలి భావన వల్ల, అతడిని నాస్తికునిగా ఎంచి ఉండవచ్చు. అతనికి ఆంబోతు, అగ్ని, హంస, నీటిపక్షి అందించిన బ్రహ్మజ్ఞానంలోని సారం ఇదే కదా! నర్మదా నదీతీరాన జాబాలి తపస్సు చేసుకున్న ప్రాంతమే, నేడు జబల్పూరుగా మారిందని చెబుతారు. తిరుమలలోని జాబాలి తీర్థం వద్ద కూడా, ఆయన కొన్నాళ్లు తపస్సు చేసుకున్నాడని ప్రతీతి. జాబాలిని పురాణాలు ఒక ఋషిగా ఎంచి, ఆయన పేర ఒక గోత్రాన్ని నెలకొల్పాయి. మొత్తానికి తన సత్యనిష్ఠతో, జ్ఞానతృష్ణతో, గోత్రమంటూ లేని జాబాలి, తనే ఒక గోత్రానికి స్థాపకుడయ్యేంతటి ఋషిగా మారాడు.

ధర్మో రక్షతి రక్షితః

Monday, November 28, 2022

యువక్రీతుడి కథ! Sustainable Attainment 'Story of Yuvakrita'


రోమశ మహర్షి చెప్పిన యువక్రీతుడి కథ!
గురుముఖతః నేర్చుకోని విద్య ఎందుకు పనికిరాదు?

గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురు స్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/P1cMnPseiNU ]


మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా, ప్రతి అడుగులోనూ, ప్రతిక్షణంలోనూ, ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాడు. అతడు నేర్చుకునే ప్రతి అంశం వెనుకా గురువు వుంటాడు. గురువు యొక్క విశిష్ఠత మన పురాణ గ్రంథాలలో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎంత కఠోర దీక్ష చేసినా, ఎన్ని వరాలను పొందినా, గురుముఖతా నేర్చుకున్న విద్యకు సమానం కాదు. అందుకు ఉపమానంగా, పాండవులు అరణ్యవాసానికి బయలుదేరినప్పుడు, వారి వెంట ఉన్న రోమశ మహర్షి, సంగమ నదీ తీరం వద్ద, యువక్రీతుని గురించి వివరించాడు. యువక్రీతుడు ఎందుకు ఘోర తపస్సుకు పూనుకున్నాడు? ఇంద్రుడిని అడిగిన వరం ఏంటి? ఒక మహర్షి చేతిలో అతని మరణం ఎందుకు సంభవించింది? అనేటటువంటి ఉత్సుకతను రేకేత్తించే అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసకుందాము..

రైభ్యుడూ, భరద్వాజుడూ అనే మహా ఋషులిరువురూ మిత్రులు. వారిద్దరూ అడవిలో తపస్సులో నిమగ్నమయ్యారు. రైభ్యునికి అర్ధావసుడు, పరావసుడనే కుమారులున్నారు. వారిద్దరూ మంచి విద్యావంతులే అయినా, అర్ధావసుడు సంస్కారవంతుడు కూడా. భరద్వాజుని కుమారుడి పేరు యువక్రీతుడు. అతనికి అర్ధావసుడూ, పరావసుడంటే అసూయ. అందుకని, కష్టపడకుండా సకల విద్యలూ సంప్రాప్తించాలనే కోరికతో, ఇంద్రుని గురించి తపస్సు చేశాడు. చివరకు ఇంద్రుడు ప్రత్యక్షమై, అంత ఘోరతపస్సుకు కారణం అడిగాడు. అందుకు యువక్రీతుడు, తనకు చదవకుండానే సకల శాస్త్రాలూ, వేదాలూ అవగతం కావాలని కోరాడు. ఆ మాటలు విన్న ఇంద్రుడు, అది అనుచితమని చెప్పి, అలా వచ్చే విద్య మత్సరాన్ని కలిగిస్తుంది. అది మంచిది కాదు. విద్య గురు ముఖతః నేర్చుకుంటేనే శాశ్వతమని హితవు పలికి, మరే ఇతర వరాన్నైనా కోరుకొమన్నాడు. అందుకు యువక్రీతుడు సమ్మతించలేదు. దాంతో ఇంద్రుడు తిరిగి వెళ్ళి పోయాడు.

మరింత పట్టుదలతో యువక్రీతుడు తపస్సును కొనసాగించాడు. మరల ఇంద్రుడు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి, అక్కడ ప్రవహిస్తున్న గంగా నదికి అడ్డుగా, చేతులతో ఇసుక పోస్తూ సేతుబంధనం నిర్మించే ప్రయత్నం చేయసాగాడు. అది చూసి యువక్రీతుడు నవ్వి, అలా ఎన్ని రోజులు చేస్తే, ఆ సేతువు పూర్తవుతుందని అడిగాడు. దానికి ఆ వృద్ధుడు, అతనిలాగానే అసాధ్యమైన దాని కోసం ప్రయత్నిస్తున్నానని సత్యాన్ని పలికాడు. ఇంద్రుడు తన నిజరూపం చూపి, తను చేసిన పని ఎంత నిరర్ధకమో, సంస్కార రహితమైన విద్యలూ అంతే నిరర్ధకమని చెప్పి, అతని ప్రయత్నం విరమించుకోమని చెప్పజూశాడు. అందుకు యువక్రీతుడు అంగీకరించక, తనకు సకల విద్యలూ కావలసిందేనని పట్టు పట్టాడు. ఇక ఇంద్రుడు చేసేది లేక, అతనికి సకల విద్యలనూ ప్రసాదించాడు.

తన కోరిక తీరిందన్న గర్వంతో, తన తండ్రి వద్దకు వెళ్ళాడు యువక్రీతుడు. తన పాండిత్యంతో ఎంతో మందిని ఓడించాడు. ఒకరోజు యువక్రీతుడు, తన తండ్రి మిత్రుడైన రైభ్యుని చూడటానికి వెళ్ళాడు. అక్కడ రైభ్యుని రెండవ కుమారుడు పరావసుడి భార్య అయిన కృష్ణ అనే సుందరిని చూశాడు. ఆమెను మోహించి, తన కోరిక తీర్చమని అడిగాడు. అందుకామె, అతనిని తిరస్కరిస్తే శపిస్తాడేమోనని భయపడి, సాకు చెప్పి తప్పించుకుని పోయింది. తరువాత ఆ విషయాన్ని తన మామగారికి చెప్పి, కన్నీరు పెట్టుకుంది. దాంతో రైభ్యుడు ఆగ్రహించి, తన జటాజూటం తీసి అగ్నిలో వేసి, ఒక రాక్షసుడిని సృష్టించాడు. మరొక జటను లాగి అగ్నిలో వేసి, కృష్ణ లాంటి మరొక కన్యను సృష్టించాడు. వారిరువురినీ చూసి, యువక్రీతుని నశింపజేయమని చెప్పి పంపాడు. ముందు ఆ యువతి తన అందంతో యువక్రీతుని మైమరపించి, అతని కమండలాన్ని సంగ్రహించింది. కమండలం పోగానే యువక్రీతుడు అశక్తుడయ్యాడు. వెంటనే రాక్షసుడు యువక్రీతుని వధించాడు. ఆ తరువాత రైభ్యుడు, ఆ యువతిని రాక్షసునికి ఇచ్చి వివాహం చేశాడు. ఆశ్రమానికి వచ్చిన భరద్వాజుడు, కుమారుని మరణ వార్త విని, పుత్ర శోకం భరించలేక, అగ్ని ప్రవేశం చేసి మరణించాడు.

తరువాత కొన్నాళ్ళకు, బృహద్యుమ్నుడనే రాజు సత్రయాగం చేయడానికి పూనుకున్నాడు. ఆ యాగానికి పరావసుడూ, అర్ధావసులను ఋత్విక్కులుగా నియమించాడు. యజ్ఞం జరుగుతుండగా ఆ రాత్రి, పరావసుడు ఆశ్రమానికి బయలుదేరిన సమయంలో, అరణ్యమార్గంలో ఏదో అలికిడి వినిపించింది. ఎదో క్రూరమృగమనుకుని, ఆత్మరక్షణార్ధం పొరపాటున ఎదురుగా వస్తున్న తండ్రి రైభ్యుని చంపాడు. తండ్రిని గుర్తించి, కుమిలి పోయాడు. అతనికి దహన సంస్కారాలు ముగించి అన్న వద్దకు పోయి, జరిగినది చెప్పాడు. పరావసుడు తన అన్న అర్ధావసుడితో, "అన్నయ్యా! నీవు ఒక్కడివే, యాగాన్ని నిర్వహించ లేవు. అది నేను చేయగలనుగనుక, నేను యాగాన్ని కొనసాగిస్తాను. నీవు పోయి నాకు కలిగిన బ్రహ్మహత్యా పాతకానికి పరిహారం చెయ్యి" అని అన్నాడు. సంస్కారవంతుడైన అర్ధావసుడు, తమ్ముని బదులు అన్ని ప్రాయశ్చిత్తములూ పూర్తి చేసి, యాగశాలకు తిరిగి వచ్చాడు. అన్నయ్యను చూసిన పరావసుడు, ఎక్కడ తనవలన జరిగిన తప్పును బయటపెడతాడోనన్న భయంతో, బృహద్యుమ్నునితో, "మహారాజా! ఇతడు యాగశాలలో ప్రవేశించడానికి అర్హుడు కాదు. పవిత్రమైన యాగక్రతువును విడిచి, బ్రహ్మహత్యా ప్రాయశ్చిత కార్యం నిర్వహించి వస్తున్నాడు" అని అన్నాడు. ఆ మాటతో రాజు అనుచరులు, అర్ధావసుణ్ణి యాగశాలలోనికి రాకుండా అడ్డుకున్నారు.

సత్వగుణుడైన అర్ధావసుడు, అప్పుడుకూడా తమ్ముడి మీద ఆపేక్షతో వాస్తవాన్ని బయటపెట్టక, దేవతలను ప్రార్ధించాడు. దానికి దేవతలు సంతోషించి, అతని సత్యనిరతిని మెచ్చుకుని, ఏం వరం కావాలో కోరుకోమన్నారు. అప్పుడు అర్ధావసుడు, "అయ్యా! నా తండ్రినీ, భరద్వాజునీ, యువక్రీతుణ్ణీ బ్రతికించండి. అలాగే, నా తమ్ముని దోషాన్ని కూడా పరిహరించండి" అని కోరుకున్నాడు. ఆ విధంగా దేవతలు, అర్ధావసుడు కోరినట్లు వారిని బ్రతికించారు. తిరిగి బ్రతికిన యువక్రీతుడు దేవతలను చూసి, "దేవతలారా! నేను ఎన్నో విద్యలను పొందాను, వ్రతాలు చేశాను. కానీ, రైభ్యునిచే చంపబడ్డాను. కారణం ఏమిటి?" అని అడిగాడు. దానికి సమాధానంగా దేవతలు "యువక్రీతా! గురు ముఖతః నేర్చుకున్న విద్య, సంస్కారంతో కూడుకున్నది గనుక, ఫలిస్తుంది. తపస్సు వలన పొందినది అహంకారపూరితమైనది గనుక, అక్కరకురాదు. అందుకే నీ కమండలం దూరమైన వెంటనే, నీ విద్యలు నిర్వీర్యమయ్యాయి. రైభ్యుని విద్య గురువు నేర్పినది కనుక, అతడు నీ కంటే శక్తిమంతుడయ్యాడు." అని పలికి, దేవతలు అంతర్ధానమయ్యారు. ఇందుకు మరో ఉదాహరణగా, తననుజూసి అరుస్తున్నదని, అల్ప ప్రాణి అయిన శునకము నోటినిండా బాణాలను సంధించిన ఏకలవ్యుడి కథను కూడా చెప్పుకోవచ్చు.

The story series set up for the Pandavas in the Aranya Parva of the Mahabharata continues to deliver, with sage Romasa narrating tales that convey the significance of each sacred spot that the brothers visit. The next in the sequence is the story of the death and resurrection of sage Yuvakrita. It begins with the friendship of two rishis, Bharadwaja and Raibhya, who make their hermitages in the same forest.

Raibhya has two sons, Ardhavasu and Paravasu, while Bharadwaja has a son by the name of Yuvakrita. Yuvakrita is the troubled one, envious of the adulation that the relatively gregarious Raibhya, and his sons, receive from other brahmans.

In order to acquire the knowledge of the vedas and beyond, Yuvakrita decides not to take the normal, organic route of learning them from his preceptor, but to employ his asceticism and force the gods to grant all the knowledge to him. That said, there is a hint in the text that Yuvakrita’s decision might have been due to his difficulties with learning: he isn’t a particularly intelligent chap. The king of the gods, Indra, is ruffled by the harsh austerities that Yuvakrita performs, and, in the guise of an old brahmin, tries to impart some sense to him. But Yuvakrita is stubborn, and eventually Indra grants him what he desires. When Bharadwaja comes to learn of this, he is agitated.

He considers such a shortcut to knowledge as a betrayal of destiny, and predicts that if Yuvakrita became proud of his achievement, he will be miserably destroyed. One day, Yuvakrita roams into Raibhya’s hermitage and, seeing her alone, rapes Parvasu’s wife. When Raibhya learns of this, he creates two beings: one a woman of beauty, whose task is to lure Yuvakrita; and another a rakshasa, who is tasked with killing him.

Their mission, of course, is successful. Seeing his dead son and knowing his deeds, Bharadwaja’s grief pushes him to take his own life, but that doesn’t happen before he curses Raibhya’s eldest son with killing his own father. One day, after conducting sacrifices for a king, Paravasu returns to the hermitage almost blinded by fatigue and is terrified seeing a black figure in the dense forest: to him its an animal. It is in fact Raibhya, clad in black deerskin, but Paravasu fails to realise that and kills his own father. Thus Bharadwaja’s curse comes to pass.

In order to allow Paravasu to continue the sacrifices, Ardhavasu takes the blame upon him. When the gods are pleased with this act, they allow him to bring back to life his own father, and also Bharadwaja and Yuvakrita. Thus, everything becomes alright again. Only that it doesn’t. The Mahabharata doesn’t offer us any window into the plight of the raped woman, used so blatantly as a narrative device that even her name is not provided. Do the gods un-rape her somehow? Does her trauma also vanish? Or is she banished instead? We don’t know, for our Mahabharata doesn’t care.

ధర్మో రక్షతి రక్షితః

Wednesday, November 23, 2022

మార్గశిర మాసం - Significance of Margasira Masam


రేపటి నుండి మార్గశిర మాసం ప్రారంభం - మార్గశిర మాస విశిష్టత!

ప్రతి సంవత్సరం కార్తీక మాసం తర్వాత మార్గశిర మాసం ప్రారంభమవుతుందని అందరికీ తెలిసిన విషయమే. సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్మే భగవద్గీతలో 'మాసానాం మార్గశీర్షోహం' అని చెప్పారంటే, హిందువులకు ఈ మాసం ఎంత పవిత్రమైనదో తెలుస్తుంది. మోక్ష గ్రంధమైన భగవద్గీత అవతరించినది కూడా, ఈ మాసంలోనే అని చెబుతారు. హిందువులు నెల రోజుల పాటు తిరుప్పావై చదువుతూ, పరమ భక్తితో చేసుకునే ధనుర్మాస వ్రతం కూడా, ఈ మాసంలోనే మొదలవుతుంది. ఈ మాసంలో విష్ణు ప్రీతిగా చేసే ఏ చిన్న పుణ్యకార్యమైనా, మంచి ఫలితాన్ని ఇస్తుంది.

[ శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన మార్గశిరమాస విశిష్టత: https://youtu.be/0IsB-um3hno ]


శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం ఇదని అందరూ చెబుతుంటారు..

పెద్ధలు ఈ మాసాన్ని మోక్ష మాసంగా, లేదా మోక్ష సాధనా మాసంగా కూడా చెబుతారు. భక్తితో ఉపవాసం, జాగరణ ఉండి చేసే మోక్షద ఏకాదశి కూడా, ఈ మాసంలోనే వస్తుంది.

నిజానికి ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అనే విషయం గురించి తెలుసుకుందాం..

మార్గశిరం తరువాత వచ్చే పుష్యమాసం నుండి, ఉత్తరాయణం మొదలవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం.

అలా చూసుకుంటే, దక్షిణాయనం చివరిభాగం, ఉత్తరాయణం ముందు వచ్చే భాగం అయిన మార్గశిరం, పగలుకు ముందు వచ్చే బ్రాహ్మీముహూర్తం లాంటిదని తెలుస్తుంది. రోజులో బ్రాహ్మీ ముహూర్తం ఎంత ప్రాధాన్యత కలిగినదో, సంవత్సరానికి స్వయం విష్ణు స్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది. ఎలాగైతే బ్రాహ్మీ మహూర్తంలో మనం నిత్య పూజ చేసుకుంటామో, అదే విధంగా, దేవతలకు బ్రాహ్మీ ముహూర్తమైన ఈ మాసమంతా, దేవతలూ, ఋషులూ, యోగులూ, శ్రీమహావిష్ణువును భక్తితో పూజిస్తారు. ఈ మాసం లక్ష్మీనారాయణ స్వరూపం. శ్రావణ శుక్రవారం, కార్తీక సోమవారం లాగా, మార్గశిర లక్ష్మివారం (గురువారం), మార్గశిర శనివారం, చాలా ప్రాముఖ్యతగలవి.

Link: https://www.youtube.com/post/Ugkx5CgqUoRUPmDvVi9k7HNxYJyriK7GCvOA

మీకు తెలుసా?

Tuesday, November 22, 2022

షాడో ఇన్ బోర్నియో Shadow in Borneo by Madhubabu


త్వరలో.. 

'షాడో ఇన్ బోర్నియో' Shadow in Bornio - షాడో స్పై అడ్వెంచర్ - మధుబాబు

02nd డిసెంబర్ నుండి ప్రారంభం.. Only on SMBAB

కిల్లర్స్ గ్యాంగ్ వలలో చిక్కుకున్న బోర్నియో చక్రవర్తి, ఆర్ధిక, రాజకీయ, సామాజిక, వ్యక్తిగత ఇబ్బందులలో చిక్కుకుని విలవిలలాడుతూ, ద్వీపాన్ని అశాంతి, అల్ల కల్లోలం నుంచి రక్షించ లేని పరిస్థితులలో ఉన్నప్పుడు, ఇంటర్‌పోల్ అభ్యర్థన పై ఆ ద్వీపంలో అడుగు పెట్టిన షాడో, అనుక్షణం ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కున్నాడు?

అనుకోని అతిథిలా తరచూ షాడోకి తారస పడుతున్న ఆ బోర్నియో విలాస సుందరి ఎవరు?

అన్ని దుర్మార్గాలకు మూలకారణమైన చిన్ లీ చాన్ కథ ఎలా ముగిసింది?

కిల్లర్ గ్యాంగ్ సుప్రీం కమాండ్ ప్రలోభాలనూ, ప్రతిహింసనూ షాడో ఎలా తిప్పి కొట్టాడు?

'షాడో ఇన్ బోర్నియో’ త్వరలో మీ ముందుకు! విని / చూసి ఆనందించండి!!

గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka


గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు!
శివుడి ఆగ్రహానికి గురైన కపిల గోవుకు ఎందుకంత ప్రాశస్త్యం?

ప్రాచీన భారతీయ సంస్కృతీ సంపదలకు ప్రతీక, పవిత్ర గోమాత. భారతీయులకు అనాది నుంచీ ఆరాధ్య దేవత. చతుర్వేదాలలోనే కాక, హిందూ ధర్మశాస్త్ర గ్రంథాలలోనూ, భారత, రామాయణ భాగవతాది పవిత్రగ్రంథాలలోనూ, గోమహిమ అసామాన్యమైనదిగా అభివర్ణించబడింది. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా గోమాతను పూజించి సేవించి, గోపాలుడిగా, వాటి ప్రాముఖ్యతను వివరించాడు. దేవతలతో సరిసమాన కీర్తిని గడించిన గోవు ఎలా ఉద్భవించింది? గోవులలో కపిల గోవుకు ఎందుకంత ప్రాముఖ్యత సంతరించుకుంది? అన్ని లోకాలలో కెల్లా గోలోకానికి అంత ప్రాశస్త్యం రావడానికి కారణమేంటి? అసలు మహాభారతంలో, గోవు విశిష్ఠత గురించి ఏం వివరించబడి ఉంది - వంటి ఆసక్తికర అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/iT2XRwhIgLQ ]


పూర్వము విశ్వకర్మ, గొప్ప తపస్సుకు పూనుకున్నాడు. అమృత రూపిణి, కామరూపి అయిన సురభి అనే కన్యను, మానస పుత్రికగా సృష్టించాడు. ఆమెతో పాటు, మహా తేజోవంతుడైన ఒక పురుషుడిని కూడా సృష్టించాడు. ఆ పురుషుడు, ఆ కన్యను చూసి మోహించి, ఆమె కొరకు పరితపించసాగాడు. అది చూసిన బ్రహ్మ, "మార్తోభవ" అంటే, నీ పరితాపము ఉపశమించుగాక, అని దీవించాడు. అతడికి మార్తాండుడని పేరు పెట్టి, సురభిని ఇచ్చి వివాహము జరిపించి, "మీ ఇరువురికీ పుట్టిన సంతానం, యజ్ఞయాగాదులకు అవసరమైన పాలు, పెరుగు, నెయ్యి సమకూరుస్తాయి" అని చెప్పాడు. అలా వారిరువురికీ, గోవులు సంతానంగా జన్మించాయి. సురభీ మార్తాండులకు, పదకొండు మంది సంతానం ఉద్భవించారు. వారే, బ్రాహ్మణులకు మూల పురుషులు. వారే ఏకాదశ రుద్రులు. వారి పేర్లు, అజపాదుడు, అహిర్బుధ్న్యుడు, త్రయంబకుడు, వృషాకపి, శంభుడు, కాపాలి, రైవతుడు, హరుడు, బహురూపుడు, ఉగ్రుడు, విశ్వరూపుడు. ఈ ఏకాదశరుద్రులను లోకమంతా పూజించారు. ఏకాదశ రుద్రుల తరువాత, గో సమూహం పుట్టింది. ఆ ఆవుల ముఖంలో, కొమ్ములలో, నాలుకలో ఇంద్రుడూ.. మలద్వారము, మూత్రములో వాయుదేవుడూ.. మూపురంలో శివుడూ.. పాదాలలో దేవతలూ.. కడుపులో అగ్నిదేవుడూ.. పాల పొదుగులో సరస్వతీ.. పేడలో లక్ష్మీదేవీ.. పంచితంలో కీర్తీ.. రక్తంలో చంద్రుడూ కొలువై ఉన్నారు. గోవు హృదయంలో భగుడు అనే దేవతా, పాలలో బ్రహ్మదేవుడూ, వెంట్రుకలలో అనుష్ఠానములూ, తోకలో యమధర్మరాజూ, కన్నులలో సూర్యుడూ, చర్మములో తపస్సూ, తేజమూ అధిష్ఠాన దేవతలుగా ఉన్నారు. ఆవు కాళ్ళలో ఉన్న కీళ్ళలో, సిద్ధులు కొలువై ఉన్నారు. సమస్త దేవతలకూ ఆలవాలమైన గోవు మాహాత్మ్యమును, ఎన్ని విధాలుగా వర్ణించినా పరిపూర్ణము కాదు. వాటిలో కపిల గోవు మరింత పూజనీయమైనది.

ఒకనాడు ఆవులన్నీ హిమాలయాల మీద విహరిస్తున్నాయి. ఆ సమయంలో ఒక లేగదూడ తన తల్లి దగ్గర పాలు తాగుతోంది. ఆ పాల నురగ గాలికి ఎగిరి, అక్కడే తపస్సు చేసుకుంటున్న పరమశివుడి తల మీద పడింది. పరమశివుడికి కోపం వచ్చి మూడవ కన్ను తెరచి, ఆ ఆవులను చూశాడు. ఆ ఆవులన్నీ ఆ కోపాగ్ని వేడికి, ఎర్రగా అయిపోయాయి. ఆవులన్నీ బెదిరి, తలోదిక్కుకు పారి పోయాయి. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వచ్చి, "మహేశా! నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తుంటాడు కదా! లేగ దూడల నోటి నుండి వచ్చే నురగ కూడా, అమృత సమానమే కదా! అది ఎంగిలి ఎలా ఔతుంది! గోవు పాలు అమృతమైతే, వాటి నురగ కూడా అమృతమే కదా! దీనికి ఆగ్రహిస్తే ఎలా! వాటిని కరుణించు" అని వేడుకుని, ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు. పరమశివుడు శాంతించి, ఆ ఎద్దును తన వాహనముగా చేసుకుని, ఆవులను ఆ ప్రాంతంలో తిరగడానికి అనుమతి ఇచ్చాడు. వెంటనే, బెదిరి పోయిన ఆవులు తిరిగి వచ్చాయి. అప్పుడు శివుడు, "బ్రహ్మదేవా! ఈ గోవులన్నీ నా మూడవ కంటిచూపుతో ఎర్రగా అయిపోయాయి. ఇప్పటి నుండి, ఇవి అతి శ్రేష్ఠమైనవిగా భావించబడతాయి" అని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు.

సాధారణంగా కపిల గోవులకు చెవులూ, ముక్కు, కళ్ళు, కొమ్ములూ, కపిల వర్ణంలో ఉంటాయి. అలాకాక, ఏ ఒక్క చోట ఎర్రగా ఉన్నా చాలు. అది కపిల గోవు అని పిలువబడుతుంది. ఇక శరీరం అంతా ఎర్రగా ఉంటే, ఇక దాని మహిమ చెప్పవలసిన అవసరం లేదు. ఆవులు దేవతలతో సమానంగా నేటికీ పూజింపబడుతూ ఉన్నాయి. గోలోకమునకు సంబంధించి, ఒక కథ ఉంది. త్రిశిఖరము, అనే కొండ ప్రాంతంలో, భృగువంశంలో పుట్టిన కొంత మంది మునులు ఆశ్రమాలు నిర్మించుకుని, తపస్సు చేసుకునేవారు. వారిలో సుమిత్రుడు ఒకడు. ఒకరోజు అంగీరసుడనే బ్రాహ్మణుడు, గోశర్కర అనే తీగను, సుమిత్రుడికి ఇచ్చాడు. సుమిత్రుడు దానిని తన గోవులకు ఆహారంగా ఇచ్చాడు. ఆ ఓషధిని తిన్న ఆవులు ఏపుగా పెరిగి, ఆ గోవులకు తామర తంపరగా, సంతానం పెరిగింది. అలా ఆ గోవుల సంతతి పెరిగి, మందగా ఏర్పడ్డాయి. సుమిత్రుడు ఆ ఆవుల మందను చూసి బాగా మురిసిపోయాడు. ఆ ఆవు దూడలు తల్లుల పాలు త్రాగుతుంటే, వాటి నుండి వచ్చే నురగను తాను సేవించసాగాడు. అప్పటి నుండి అతడికి ఫేనుడు అనే పేరు వచ్చింది. ఆ ఆవులకు కామరూప విద్యకూడా ఉంది. ఒక రోజు కొన్ని ఆవులు చక్కటి స్త్రీల రూపము ధరించి, సమీప కొలనులో జలకాలాడుతున్నాయి.

వాటిని చూసి  అక్కడే స్నానం చేస్తున్న కొన్ని గోవులు, "మీరు ఎవరు? మీకు ఈ మనుషుల రూపములు ఎలా వచ్చాయి? అని అడిగాయి. అప్పుడు స్త్రీ రూపంలో ఉన్న గోవులు, "మేము బ్రాహ్మణులకు సేవ చేస్తాము. యజ్ఞములకూ, పితృకార్యములకూ, అతిథి సత్కారములకూ, బ్రాహ్మణులకూ ఆహారంగా ఉపయోగపడే పాలు ఇస్తాము. బ్రాహ్మణుల పొలములో పని చేయడానికి, మా పిల్లలను పంపుతాము. మేము చేసే మంచి పనుల వలన, మాకు గోలోక ప్రాప్తి కలిగింది." అని పలికాయి. మిగిలిన గోవులు తమకు కూడా గోలోక ప్రాప్తి కలిగే తరుణోపాయము చూపమని, కాంతల రూపంలో ఉన్న గోవులను అడిగాయి. అప్పుడు ఆ గోవులు, "రంతిదేవుడు ఒక యజ్ఞము చేస్తున్నాడు. మీరు అక్కడకు వెళ్ళండి. ఆయన మిమ్మల్ని ఆ యజ్ఞములో బలి ఇస్తాడు. మీకు గోలోకప్రాప్తి కలుగుతుంది" అని పలికాయి. వెంటనే ఆ ఆవులన్నీ రంతిదేవుడి వద్దకు వెళ్ళడానికి, సిద్ధం అయ్యాయి. కానీ, అందులో ఒక గోవు సందేహం వెలిబుచ్చింది. "మనం మన యజమాని సుమిత్రుని అడిగి కదా వెళ్ళాలి?" అని అన్నది. వాటిలోని కొన్ని ఆవులు, "సుమిత్రుడు మనము వెళ్ళడానికి అనుమతి ఇవ్వడు. కనుక మనం అతడిని చంపుదాము. అప్పుడు అతడు కూడా గోలోకముకు వస్తాడు" అని అన్నాయి. కానీ, అవి సుమిత్రుడిని చంపలేక పోయాయి. అయితే, కాంతల రూపంలో ఉన్న కపిలగోవులు మాత్రం, "మేము సుమిత్రుడిని చంపుతాము. దానికి బదులుగా మీరు మాకు ఏమి ఇస్తారు?" అని అడిగాయి. అప్పుడు మిగిలిన ఆవులు కపిలగోవులతో, "ఈ రోజు నుండి అన్ని రంగుల ఆవులలో, ఎర్రని గోవులు శ్రేష్టమైనవిగా పరిగణించబడతాయి" అని వరం ఇచ్చాయి.

వెంటనే ఆ ఆవులు మారు రూపంలో సుమిత్రుడి వద్దకు వెళ్ళి "అయ్యా! ఇప్పటి వరకు మీరు గోపూజ చేశారు. మేము ఎంతో సంతోషించాము. మీకు ఏమి వరం కావాలో కోరుకోండి" అని అడిగాయి. అందుకు సుమిత్రుడు, "నాకు ఇప్పటి వలె, ఎప్పటికీ ఆవుల యందు భక్తిశ్రద్ధలుండేలా అనుగ్రహించండి" అని కోరుకున్నాడు. ఆ ఆవులు "అలాగే అనుగ్రహిస్తాము. మేము గోలోకము వెడుతున్నాము. మీరు కూడా మాతో రండి" అని అన్నాయి. సుమిత్రుడు "నేను నా గోవులను విడిచి ఎక్కడకూ రాను" అని అన్నాడు. అప్పుడు మారు వేషములో ఉన్న గోవులు, అతడి శరీరమును తమ కొమ్ములతో ఎత్తి, క్రింద పడవేశాయి. సుమిత్రుడు ప్రాణాలు వదిలాడు. అతడి శరీరం మాత్రం క్రింద పడింది. ఆత్మ మాత్రం, గోలోకం చేరింది. అక్కడ ఉన్న గోమాతలు సుమిత్రుడిని ఆదరించి మర్యాదలు చేసి, అతడికి జరిగినది చెప్పి, నీకు మేలే జరిగింది కానీ, నిన్నిలా దారుణంగా చంపిన ఎర్రని ఆవులకు మాత్రం, ముఖం నల్లగా మాడి పోతుంది" అని శాపం పెట్టాయి.

తరువాత సుమిత్రుడి ఆవులన్నీ రంతిదేవుడి వద్దకు వెళ్ళి, "అయ్యా మీరు మమ్ము యజ్ఞములో బలి ఇచ్చి, మాకు గోలోక ప్రాప్తిని కలుగజేయండి" అని వేడుకున్నాయి. అప్పుడు రంతిదేవుడు, "అది ఎలా చేయగలను.. అది పాపము కదా! ఆ పనిచేసి నేనెలా పాపము మూట కట్టుకుంటాను? నాకు ఉత్తమ గతులు ఎలా ప్రాప్తిస్తాయి?" అని అన్నాడు. "అయ్యా, ఇది మా నిర్ణయం కాదు. దేవతల నిర్ణయం మీరు ఆచరించాలి. మేము పవిత్ర హోమంలో బలిదానం చేసుకోగలిగితేనే, గోలోకానికి వెళ్ళే అవకాశం ఉంటుంది." అని అన్నాయి. అందుకు రంతిదేవుడు, "అయితే, నాది ఒక నిబంధన. మీలో ఏ ఒక్క గోవైనా మోహ పరవశంతో బలికి అంగీకరించకపోయినా, నేను యజ్ఞం ఆపివేస్తాను" అని అన్నాడు. అందుకు గోవులు అంగీకరించాయి. రంతిదేవుడు, "గోవులను వరుసగా బలి ఇచ్చి, హోమం పూర్తిచేశాడు. ఇంతలో ఒక ఆవు తన దూడతో, "అయ్యో, ఈ క్రూరాత్ములు నన్ను చంపడానికి వస్తున్నారు. నేను చచ్చిపోతే, నీ గతి ఏమిటి?" అని ఏడ్చింది. వెంటనే రంతిదేవుడు ఆ మాటలు విని, యజ్ఞమును ఆపివేశాడు.

అప్పటి వరకు బలి ఇచ్చిన గోవులు గోలోకము వెళ్ళాయి. రంతిదేవుడు స్వర్గానికి వెళ్ళాడు. అలా మిగిలిన గోవుల సంతంతి, భూలోకంలోనే ఉండిపోయింది. పవిత్రమైన హోమంలో బలిదానమై, గోలోకం చేరుకున్న గోవులకు, బ్రహ్మ వరాన్ని ప్రసాదించాడు. వాటి లోకమైన గోలోకాన్ని, అన్ని లోకముల కంటే పైన ఉండేలా వరం ఇచ్చాడు, బ్రహ్మ. మొట్ట మొదటి సత్యలోకం కంటే పైన ఉన్న లోకమే, గోలోకం. ఈ చరాచర జగత్తుకు మూలాధారము గోవు. దేవతలకూ, సిద్ధులకూ, సాధువులకూ గోవు తల్లి వంటిది. బ్రహ్మ పదమును కోరుకునేవాడు, గోవును మనసుతో కానీ, కర్మలతో కానీ, వాక్కుతో కానీ బాధించకూడదు. ఇది బ్రహ్మ వాక్కు. వేదము కూడా గోవులకు పవిత్రతను ఆపాదించింది. ఏ గోవును పూజించి, దేవతలు మానవుల కంటే గొప్ప వాళ్ళయ్యారో, అటువంటి గోవుల కంటే పవిత్రమైనది, ఈ లోకములో ఏముంది! యజ్ఞ యాగములలో గోవులకు ఉన్న పవిత్రత, మరి వేటికీ లేదు. ఉపనిషత్తులన్నీ గో స్వరూపాలే అని, బ్రహ్మదేవుడు స్వయంగా తెలియజేశాడు. గోపూజ పవిత్రమైన యజ్ఞము వంటిది. మానవులు ఎక్కువగా, కపిల గోవులను పూజిస్తారు. వాటిని దానంగా ఇస్తారు. అలా చేయడం వలన, వారి పాపాలన్నీ తొలగి పోతాయి".

వీటి యొక్క విశిష్ఠత, మహాభారతంలోని అనుశాసనిక పర్వంలో, సుస్పష్టంగా వివరించాడు, వ్యాస భగవానుడు.

వందే గోమాతరం!

Our Spotify Content

🎧 Latest Audiobooks

Spotify →
Loading latest episodes...