Garuda Puranam: Terrifying Signs Before Death! గరుడ పురాణం ప్రకారం ప్రాణం పోయే ముందు కనిపించే సంకేతాలు!
గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు మనకు అందే సంకేతాలు! మరణానికి ముందు మనకు భగవంతుడు ఏర్పాటు చేసిన ఆ సంకేతాలు ఏమిటి? Garuda Puranam: Terrifying Signs Before Death! మరణం... ఈ సృష్టిలో పుట్టిన ప్రతి జీవికీ ఖచ్చితంగా ఎదురయ్యే ఒకే ఒక్క సత్యం. "నేను ఎప్పటికీ బ్రతికే ఉంటాను" అని విర్రవీగే చక్రవర్తుల నుంచి, పూరి గుడిసెలో బ్రతికే సామాన్యుడి దాకా... ఎవరైనా కాలం తీరాక, ఆ మృత్యుదేవత ఒడిలోకి చేరాల్సిందే. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు, "జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ".. అంటే, పుట్టిన వాడికి మరణం తథ్యం, మరణించిన వాడు మళ్ళీ జన్మించకా తప్పదు. ఇదే సృష్టి ధర్మం. మానవ కల్పిత మతాలవారు ఏం చెప్పుకున్నా, ఇది మాత్రమే సత్యం.. కానీ... మరణం ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? ఆఖరి శ్వాస విడిచే ముందు మనిషికి ఏమవుతుంది - వంటి ప్రశ్నలు, మానవాళిని వేలాది సంవత్సరాలుగా వెంటాడుతూనే ఉన్నాయి. మోడరన్ సైన్స్ నేటికీ మరణం తర్వాత ఏమవుతుందనే దానికి కచ్చితమైన సమాధానం చెప్పలేకపోతోంది. కానీ, మన సనాతన ధర్మంలో... సాక్షాత్తూ ఆ శ్రీ మహా విష్ణువు, తన వాహనమైన గరుత్మంతుడికి, ఈ మృత్యు రహస్యాలను పూ...