The Lost Hindu Empire in China: The Untold Story of Khotan ఖోటాన్ సామ్రాజ్యం!

 

The Lost Hindu Empire in China: The Untold Story of Khotan

ఖోటాన్ సామ్రాజ్యం!
చైనాలో బయటపడిన అతిపెద్ద హైందవ సామ్రాజ్యం! నాటి అఖండ భారతావనిలో చైనా కూడా భాగమా?


తాము ఎదగడానికి పక్క వాడిని తొక్కేయడం, వాడిపై దౌర్జన్యం చేసి వాడికి సంబంధించినవన్నీ బలవంతంగా లాక్కుని తాము గొప్పవారిగా చలామణీ అవ్వాలనేది యురోపియన్ దేశాలు పాటించే ప్రధమ సూత్రం. ఈ సూత్రాన్ని అందిపుచ్చుకునే అమెరికా ప్రపంచ పెద్దన్నగా నిలిచింది. చాలాకాలంగా అదే సూత్రాన్ని పాటిస్తూ చైనా ఆ స్థానంలో కూర్చోవాలని చూస్తోంది. ఈ నేపధ్యంలో చైనా ప్రయత్నాలకు అడ్డుగా నిలుస్తోందని భావించి మన భారత దేశాన్ని దెబ్బ కొట్టడానికి వేసిన ఓ ఎత్తుగడ, మన దేశ భూభాగంలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ని తమకు చెందినదిగా చైనా ప్రచారం చేయడం. అంతటితో ఆగకుండా కొద్ది రోజుల క్రితం ఏకంగా అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు చైనాకు సంబంధించిన పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఈ క్రమంలో మన దేశ చరిత్రకారులతో పాటు, అంతర్జాతీయ చరిత్రకారులూ చైనా అసలు చరిత్రను గురించి కూపీ లాగడం మొదలు పెట్టారు. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకూ ఎవరూ బయటపెట్టని చరిత్ర, చైనా వెన్నులో వణుకు పుట్టించే చరిత్ర, అలనాటి మన అఖండ భారతావని వాస్తవ చరిత్ర, చైనాకు సంస్కృతి అంటే ఏమిటో తెలియజేసిన ఓ మహా సామ్రాజ్య చరిత్ర బయటపడింది. ఈ మాటలు వినగానే, చైనాకి మనం సాంస్కృతిక పాఠాలు నేర్పడం ఏమిటి? అఖండ భారతావనిలో చైనా కుడా భాగంగా ఉండేదా? చైనాను కూడా మన వారు పాలించారా? చైనాలో హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఆ రాజులు ఎవరు? ఏ కాలంలో వారు చైనాను పాలించారు - వంటి ఎన్నో సందేహాలు కలగడం సహజం. మరి ఆ సందేహాలకు కొంతవరకైనా సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ALbUJMkMkWo ]



ఒక దేశాన్ని సొంతం చేసుకోవాలన్నా, ఆ దేశంలో ఉన్న వనరులు దోచుకుపోవలన్నా, ఆ దేశంలో దారుణం ఎదో జరుగుతోందని కానీ, చరిత్రాత్మకంగా ఆ ప్రాంతంతో సంబంధాలున్నాయని కానీ, ప్రపంచ దేశాలను ముందుగా నమ్మించాలి. గత కొన్ని దశాబ్దాలుగా చైనా కుడా ఈ సూత్రాన్ని పాటిస్తోందని నిపుణులు చెబుతున్నారు. అలా ఆ దేశం ముందుగా టిబెట్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నది. అక్కడితో ఆగని చైనా మన అరుణాచల్ ప్రదేశ్ కూడా తమ టిబెట్ లోని భాగమే అనీ, అది దక్షిణ టిబెట్ అనీ పేర్కొంటూ, అదనుదోరికినప్పుడల్లా మన దేశంలోని భూభాగాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు ఏకంగా తమ పేర్లను పెట్టేసింది చైనా.

అయితే చాలా ఏళ్లుగా చైనా చేస్తోన్న ఈ ఆరోపణల కారణంగా అసలు చైనా చరిత్ర ఏమిటి అని ఆరా తీయడం ప్రారంభమయ్యింది.. నిజంగానే టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ లు చైనాలో భాగమా - అనే చర్చ ప్రపంచ వ్యాప్తంగా మొదలయింది. ఈ కోణంలో అనేక పరిశోధనలు జరగగా, చాలా ఏళ్ల క్రితమే ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది. విదేశీ శక్తుల కుట్ర వల్ల బయటి ప్రపంచానికి అంతగా తెలియకుండా పోయిన ఓ మహా హైందవ సామ్రాజ్య చరిత్ర వెలుగులోకి వచ్చింది. అలా వెలుగులోకి వచ్చిన ఓ గొప్ప హిందూ సామ్రాజ్యం పేరే ‘ఖోటాన్ సామ్రాజ్యం’.

ఈ సామ్రాజ్యం ఒకప్పుడు యురోపియన్ దేశాలకూ, చైనాకూ ఎంతో ముఖ్యమైన వాణిజ్య మార్గంగా ఉన్న సిల్క్ రోడ్ ప్రాంతం. ఇది Taklamakan ఎడారి ప్రాంతం చుట్టూ ఉండేదని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. అంటే ఈ నాడు Xinjiang గా పేర్కొంటున్న ప్రాంతంలో ఒకప్పుడు ఖోటాన్ సామ్రాజ్యం ఉండేదని, చరిత్రకారులు చెబుతున్నారు. ఎంతో ముఖ్యమైన సిల్క్ రోడ్ ఈ సామ్రాజ్యంగుండా వెళుతుండడంతో, ఒకప్పుడు ఆ రాజ్యం చైనాలోనే అతి పెద్ద రాజ్యంగా, సంపన్న ప్రాంతంగా, బలమైన రాజ్యంగా ఉండేదని తెలుస్తోంది. అయితే ఒకప్పుడు చైనాలో ఉన్న అంతగొప్ప రాజ్యన్ని స్థాపించింది మాత్రం, మన భారతియులేనని చరిత్ర స్పష్టంగా చెబుతోంది.

చైనా, టిబెట్ ప్రాంతాలతో పాటు కొన్ని పశ్చిమ దేశాలలో దొరికిన చారిత్రక ఆధారాలూ, శిలాశాసనాలలో కూడా, ఖోటాన్ సామ్రాజ్యం భారత దేశం నుంచి వచ్చిన హిందువుల చేత స్థాపింప బడిందని తెలుస్తోంది. అసలు భారత దేశానికి చెందిన హైందవులు హిమాలయాలకు అవతల ఉన్న చైనా వరకూ ఎందుకు వెళ్లారు? అక్కడ ఒక మహా సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారనే చరిత్ర తెలియాలంటే, అశోకుడి కాలంలో జరిగిన ఓ సంఘటన గురించి ముందుగా తెలుసు కోవాలని, చరిత్ర కారులంటున్నారు.

దాదాపుగా 2500 సంవత్సరాల ముందు అంటే, మన దేశాన్ని మౌర్య వంశానికి చెందిన అశోక చక్రవర్తి పాలిస్తున్న కాలంలో జరిగిన ఓ ఘటనతో ఖోటాన్ సామ్రాజ్యం స్థాపించబడింది. మన దేశాన్నేలిన గొప్ప చక్రవర్తులలో అశోకుడు ఒకరు. అశోకుని ధమ్మం కేవలం ఒక నైతిక నియమావళి మాత్రమే కాదనీ, అదొక సామ్రాజ్యవాద సాధనం అనీ ప్రముఖ చరిత్రకారులు రోమిల్లా థాపర్ అభిప్రాయం. అశోకుని సామ్రాజ్యం ఎంతో విస్తృతమైంది. సామాజికంగా, సాంస్కృతికంగా ఎంతో వైవిధ్యంతో కూడుకున్న సామ్రాజ్యమిది. నాడు దక్షిణ భారతంలో అతిపెద్ద సామ్రాజ్యమైన కళింగ దేశాన్ని ఓడించి, దక్షిణ భారతాన్ని కూడా ఆక్రమించి అఖండ భారతావనిని స్థాపించాడు. అస్సాం, తమిళ ప్రాంతాలు మినహాయించి మిగతా భారతదేశమంతా ఆయన సామ్రాజ్యంలో భాగమైంది. ఆ తర్వాత అశోక చక్రవర్తి బౌద్ధ ధర్మాన్ని స్వికరించాడనే విషయం మనలో చాలా మందికి తెలిసిందే. నేటికీ అశోకుడు స్థాపించిన సాంచి స్థూపం మన భారతీయుల నిత్య జీవితాలతో ముడిపడి ఉంది. మన భారత జాతీయ జెండా మధ్యలో ఉన్న అశోక చక్రాన్ని సారనాథ్ స్థూపం నుండి తీసుకున్నారు. అశోకుడు స్థాపించిన సారనాథ్ స్తంభం మీద ఉన్న నాలుగు సింహాల విగ్రహం భారత జాతీయ చిహ్నం. ఇది భారతీయ కరెన్సీ, అధికారిక పత్రాలు, మరియు ప్రభుత్వ భవనాలపై ఉపయోగించబడుతుంది. ఈ సింహాలు శక్తి, ధైర్యం మరియు విశ్వాసానికి ప్రతీకలుగా నిలుస్తాయి. అంతటి అశోక చక్రవర్తికి కూడా నాడు తక్కిన రాజులలాగానే బహు భార్యలు కలిగి ఉండటంతో, ఆయనకు పుత్ర సంతానం కూడా ఎక్కువే అని చరిత్రకారులు చెబుతారు. వారిలో కొంతమంది బౌద్ధ ధర్మ వ్యాప్తికి పాటు పడగా, కొందరు మాత్రం రాజ్య పాలన, విస్తరణలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

ఆ విధంగా నాడు అశోకుడి కొడుకులలో మహీంద్రుడు, సంఘమిత్రుడు అని పేర్కొనబడిన ఇద్దరు కొడుకులు శ్రీలంకకు ప్రయాణమైనట్లూ, వారు ఆ ద్వీప దేశంతో పాటు, ఇటు దక్షిణ భారత భూభాగంలోనూ బౌద్ధ ధర్మ వ్యాప్తికి కృషి చేసినట్లూ, చరిత్రకారులంటున్నారు. ఇదిలా ఉండగా, రాచరిక కట్టుబాట్ల ప్రకారం రాజుకు కలిగిన మొదటి సంతానం, ఆయన తదనంతరం రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాల్సి వుంటుంది. ఆ విధంగా చూసుకుంటే, అశోకుడికి కలిగిన పుత్ర సంతానంలో, మహీంద్ర మొదటి వాడు. కానీ ఆయన బౌద్ధ భిక్షువుగా మారి సర్వంసంగ పరిత్యాగి కావడంతో, ఆయన తరువాతి స్థానంలో ఉన్న కునాలుడిని రాజును చేయాలని సిద్ధపడ్డాడు అశోకుడు.

అధికార దాహంతో అశోకుడి నీడలోనే ఓ క్రూరమైన కుట్రకు అంకురార్పణ జరిగింది. తన కొడుకు మహీంద్రుడు రాజు కాకపోవడంతో అతని తల్లి ఓ పథకం ప్రకారం, కునాలుడి కళ్ళు పోయేలా చేసిందని కొంతమంది చరిత్రకారులంటారు. అశోకుడి భార్యలలో చివరిదైన తిష్య రక్షిత అనే మహిళ కుతంత్రంతో కునాలుడి కళ్ళు పోయేటట్లు చేసి, తన కొడుకును రాజును చేయాలని భావించినట్లు మరి కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. కునాలుడు తక్ష శిలలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో, అశోకుడు అక్కడి గురువులకు "ప్రాకృత" భాషలో ఒక లేఖ వ్రాశాడు. ఆ లేఖలో "అధీతం కరో" అనగా - కునాలుని విద్యావంతుడిని చేయమనే మాటను వ్రాశాడు. తిష్య రక్షిత ఆ లేఖను చేజిక్కుంచుకుని, "అధీతం కరో" అన్న మాటలో చిన్న మార్పు చేసి, "అంధీతం కరో" అనగా, కునాలుని అంధుడిని చేయండనే అర్ధం వచ్చేటట్లు మార్చింది. అది తన తండ్రి ఆజ్ఞగా భావించి కునాలుడు తనను తాను ఇనుప సూదులతో కళ్ళలో గుచ్చు కున్నాడు.

అలా నాడు అశోకుడి మహా సామ్రాజ్యానికి రాజు కావలసిన కునాలుడు అంధుడైపోవడంతో అశోక చక్రవర్తి కునాలుడి కొడుకు, తన మనుమడు అయిన ‘సంప్రతి’ని చక్రవర్తిగా ప్రకటించాడు. అంతేకాకుండా, కునాలుడి కళ్ళు పోవడానికి కారకురాలయిన తిష్య రక్షితనూ, ఆమెకు సహకరించిన వారందరినీ శిక్షించదలిచాడు. ఈ క్రమంలో వారందరి కళ్ళూ పెకలింపజేయాలని నిర్ణయించుకున్న అశోకుడిని కునాలుడు వారించాడు. అదంతా తన పూర్వజన్మల కర్మ ఫలమేననీ, అందులో ఇంకోకరిని నిందించడం తగదనీ అన్నాడు. తన పినతల్లి చేసిన తప్పే తిరిగి తానూ చేయవద్దని అశోకుడికి హితవు చెప్పాడు కునాలుడు. తాను అమితంగా ప్రేమించే కొడుకు మాట కాదనలేక, వారందరికీ రాజ్య బహిష్కరణ శిక్ష విధించి, హిమాలయాలకు ఆవల ఉన్న ప్రాంతానికి వెళ్ళిపొమ్మని అశోకుడు ఆజ్ఞాపించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

అలా నాడు అశోకుడి చేత రాజ్య బహిష్కరణకు గురికాబడిన వ్యక్తులే చైనా వైపు వెళ్ళి, అక్కడ అతి ముఖ్యమైన సిల్క్ రోడ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఖోటాన్ సామ్రాజ్యాన్ని స్థాపించినట్లు కొందరు చరిత్రకారులు చెబుతారు. ఇంకొందరు మాత్రం, సిల్క్ రోడ్ ప్రాంతంలో జరిగే వ్యాపారానికి ఆకర్షితులైన కొంతమంది ఉత్తర భారత వ్యాపారాలు అక్కడికి చేరి, మెల్ల మెల్లగా తమ సామ్రాజ్యాన్ని స్థాపించి విస్తరించారనీ, అదే ఖోటాన్ సామ్రాజ్యంగా ఏర్పడిందనీ చెబుతున్నారు. ఏది ఏమైనా నేటి చైనా ప్రాంతంలో వెలసిన అతిపురాతన సామ్రాజ్యం మన హైందవ సామ్రాజ్యమేనని ఒప్పుకోక తప్పదు.

అంతేకాదు, అలా అక్కడికి వెళ్ళిన ఖోటాన్ వంశస్తులూ, వారితో పాటు వెళ్ళిన పండితులూ, చైనా సాంస్కృతిక, ఆర్ధిక ఎదుగుదలకు ఎంతగానో కృషి చేసినట్లు చరిత్ర విదితం. వారి వల్లనే అక్కడి స్థానికులు ఆయుర్వేదం, వ్యాపారం, వివిధ కళలు, విద్యల వంటివి నేర్చుకున్నారని చరిత్ర కారులు చెబుతారు. మన దక్షిణ భారతదేశ అగ్నికులక్షత్రియ పల్లవ రాజవంశానికి చెందిన రాజు యొక్క మూడవ కుమారుడు పహ్లవ యువరాజు తన కుండలినిని మేల్కొలిపి, సన్యాసిగా మారడానికి రాచరిక జీవితాన్ని త్యజించాడు. బౌద్ధ సన్యాసిగా మారి, బౌద్ధమతాన్ని వ్యాప్తి చేయడానికి చైనాకు ప్రయాణించాడు. షావోలిన్ కుంగ్ ఫూ యొక్క సంప్రదాయానికి మార్గదర్శకుడిగా, కుంగ్ ఫు ను అక్కడి వారికి నేర్పించాడని అంటారు. అతనినే అక్కడివారు బోధి ధర్ముడని పిలుస్తారని చరిత్ర కారులంటారు. అలా ఆనాటి చైనా పాలకులుగా, చైనా సాంస్కృతిక ఎదుగుదలలో మనవారి హస్తమే ప్రధానమని చరిత్ర చెబుతోంది. అటువంటిది నేడు చైనా తన స్వలాభం కోసం చరిత్రలో లేని విషయాలను పుట్టించి, మన దేశాన్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలోని ఏ దేశ మూలాలను కదిలించినా, అవి ఖచ్చితంగా మన దేశానికో, మన సనాతన ధర్మానికో ముడిపడి ఉండడం గమనార్హం.

🚩 ధర్మో రక్షతి రక్షితః 🙏

Channel Post Link: See post on YouTube Channel Community




























Comments

Related articles

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి? Garuda Puranam

37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? Siva Ratri Puja

అష్టదిగ్బంధనం! Ashta Digbandhanam - Arunachaleswara, Tiruvannamalai

గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!

11 భయంకరమైన అస్త్రాలు! మహాభారతం Mahabharatam