4000-Year-Old Secret: Are Iranians Actually Lost Indian Kshatriyas?

 

4000 ఏళ్ళ నాటి రహస్యం... ఇరాన్ వాళ్ళు మన క్షత్రియులేనా? పురాణాలు చెప్పిన షాకింగ్ నిజాలు!
4000-Year-Old Secret: Are Iranians Actually Lost Indian Kshatriyas?

భారతదేశానికి పశ్చిమాన ఉన్నది 'ఇరాన్' (Iran)... ఈ రోజది ఒక ఇస్లామిక్ దేశంగా మనకు తెలుసు. కానీ, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆ భూమిని పాలించిన రాజుల పేర్లు, వారు పూజించిన దేవుళ్ళు, వారు మాట్లాడిన భాష... అన్నీ మన సనాతన ధర్మానికి అద్దం పట్టినట్టే ఉంటాయని మీకు తెలుసా?

ఒకప్పుడు ఇరాన్ ని 'ఆర్యానాం వైజ' (Airyanem Vaejah) అని పిలిచేవారు. అంటే 'ఆర్యుల భూమి' అని అర్థం. ఋగ్వేదం లోని మంత్రాలూ, ఇరాన్ వారి పవిత్ర గ్రంథం 'అవెస్తా' (Avesta) లోని శ్లోకాలూ దాదాపుగా ఒకటేనని చరిత్రకారులు ఎందుకు అంటున్నారు?

శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడికి, ఇరాన్ నుండి వచ్చిన పూజారులకు (Maga Brahmins) ఉన్న లింక్ ఏంటి? అసలు దేవాసుర సంగ్రామం అంటే కేవలం ఆకాశంలో జరిగిన యుద్ధమా... లేక భారత్ మరియు ఇరాన్ మధ్య జరిగిన ఒక సిద్ధాంతపరమైన విభజనా? (Ideological Split)?

ఈ రోజు చరిత్ర పుటల్లో కప్పబడిపోయిన ఆ చేదు నిజాన్నీ, మన పూర్వీకుల అడుగుజాడల్ని వెతుకుతూ... 'ప్రాచీన ఇరాన్ మరియు సనాతన ధర్మం' మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన బంధాన్ని వెలికి తీద్దాము.

వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/xIPUCAQCUQU ]


ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు, ఇది మన కథ!

మనం ఏదైనా విషయాన్ని నిరూపించాలంటే ముందు భాషను చూడాలి. సంస్కృతం మరియు ప్రాచీన పర్షియన్ భాష అవెస్తా (Avestan), కేవలం దగ్గరి పోలికలు కలిగిన భాషలు కాదు... అవి కవల పిల్లల వంటివి.

దీనిని 'స' మరియు 'హ' మార్పు (S to H shift) అంటారు. సింధు నదికి ఆవల ఉన్న వారిని, పర్షియన్ల భాషలో 'స' అనే అక్షరం 'హ' గా మారుతుంది కాబట్టి, 'హిందూ' అని పిలిచారు.

కొన్ని ఉదాహరణలు చూద్దాము:
1. సంస్కృతంలో 'సోమ' (Soma) యజ్ఞం ఉంటే... అవెస్తాలో అది 'హోమ' (Haoma).
2. ఏడు నదుల దేశం మనకు 'సప్త సింధు' అయితే... వారి గ్రంథాల్లో అది 'హప్త హిందు' (Hapta Hendu) గా పేర్కొనబడింది.
3. మనం 'సేన' అంటే... వారు 'హేన' అంటారు.
4. మనకు 'అసుర' (Asura) అంటే రాక్షసుడు... కానీ వారికి 'అహుర' (Ahura) అంటే దేవుడు!

అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఋగ్వేదానికీ, పర్షియన్ల పవిత్ర గ్రంథమైన 'జెండ్ అవెస్తా' (Zend Avesta) కీ చాలా విచిత్రమైన సంబంధం ఉంది. ఒక గ్రంథంలో దేవతలుగా ఉన్నవారు, మరొక గ్రంథంలో రాక్షసులుగా మారారు. అసలు ఇది ఎలా జరిగింది?

కేవలం భాష మాత్రమే కాదు... అసలు 'పర్షియా' (Persia) అనే పేరు వెనుక ఉన్న చరిత్ర తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు.
చాలా మంది 'పర్షియా' అనేది ఒక విదేశీ పదం అనుకుంటారు. కానీ అది మన సంస్కృత పదం నుండి పుట్టిందే! మన ఋగ్వేదం (Rigveda) లో 'పర్శవ' (Parśva) అనే ఒక తెగ ప్రస్తావన ఉంది. వీరు ఆ కాలంలో ఒక బలమైన యుద్ధ నిపుణులైన వంశం (Warrior Clan).

చరిత్రకారుల విశ్లేషణ ప్రకారం, ఈ 'పర్శవ' వంశమే ఏదో ఒక కారణం చేత భారతదేశం నుండి పశ్చిమ దిశగా (Westward Migration) వలస వెళ్ళింది. వారు వెళ్ళి స్థిరపడిన ప్రాంతమే నేటి ఇరాన్.

దీనికి భాషా శాస్త్రం (Linguistics) కూడా తిరుగులేని సాక్ష్యం చెబుతోంది. పదాల మార్పును గమనిస్తే, మన ఋగ్వేదంలోని 'పర్శవ' (Parśva), ప్రాచీన పర్షియన్ భాషలో 'పార్స' (Pārsa) గా మారింది. అదే గ్రీకు వాళ్ళ నోట 'పర్సిస్' (Persis) గా మారి... నేటి 'పర్షియా' (Persia) అయ్యింది.

అంటే, నేటి ఇరానీయులు ఎవరో కాదు... వేల ఏళ్ళ క్రితం ఇక్కడి నుండి వలస వెళ్ళిన మన 'పర్శవ' వంశపు వారసులే. మనం వేరు కాదు. మన రక్తమే అక్కడ ప్రవహిస్తోంది!

వేద కాలంలో, ఆర్యులు రెండు వర్గాలుగా విడిపోయారని చరిత్రకారులు మరియు పాశ్చాత్య పరిశోధకులు (Western Scholars) సైతం భావిస్తారు. ఒక వర్గం 'దేవ' ఆరాధకులు అంటే, మన పూర్వీకులు సనాతన ధర్మాన్ని పాటించేవారు. మరొక వర్గం 'అసుర' ఆరాధకులు అంటే, పర్షియన్లు లేదా ఇరానీయులు.

దీనికి బలమైన సాక్ష్యం ఇంద్రుడు. మన వేదాలలో ఇంద్రుడు (Indra) దేవతలకు రాజు, వర్షాన్ని కురిపించేవాడు, వీరుడు. కానీ ప్రాచీన ఇరాన్ గ్రంథమైన 'అవెస్తా'లో, ఇంద్రుడిని ఒక 'దెయ్యం' (Demon) లేదా దుష్ట శక్తిగా చిత్రించారు.

అలాగే, మన పురాణాలలో 'అసురులు' అంటే రాక్షసులు. కానీ ఇరాన్ వారికి ప్రధాన దైవం 'అహుర మజ్దా' (Ahura Mazda). ఇక్కడ 'అహుర' అంటే మన 'అసుర'. 'మజ్దా' అంటే 'మేధా' (జ్ఞానం) అని సంస్కృత అర్థం. అంటే వారికి దేవుడు, 'జ్ఞాన స్వరూపుడైన అసురుడు'.

దీనిని బట్టి ఏం అర్థమవుతోంది? ఒకప్పుడు ఒకే జాతిగా ఉన్న వారు, ఏదో ఒక సిద్ధాంతపరమైన లేదా రాజకీయపరమైన గొడవ వల్ల విడిపోయి ఉంటారు. అందుకే మన దేవుళ్ళు వారికి రాక్షసులయ్యారు, వారి దేవుళ్ళు మనకు రాక్షసులయ్యారు. ఇదే పురాణాల్లో 'దేవాసుర సంగ్రామం'గా వర్ణించబడిందా? అనిపిస్తోంది కదూ!

ఇవన్నీ కేవలం కథలేనా? దీనికి సాక్ష్యాలు ఉన్నాయా? అని మీరు అడగవచ్చు. సాక్ష్యం ఉంది! అది కూడా మన భారతదేశంలో కాదు... వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న టర్కీ మరియు సిరియా (Turkey & Syria) సరిహద్దుల్లో.

సామాన్యశక పూర్వం 1380 (1380 BCE) నాటి 'బోగాజ్‌కోయ్' (Boghazkoy) అనే ప్రదేశంలో ఒక మట్టి పలక (Clay Tablet) దొరికింది. ఇది 'మిటాని' (Mitanni) మరియు 'హిట్టైట్' (Hittite) అనే రెండు రాజ్యాల మధ్య జరిగిన ఒప్పంద పత్రం. ఈ ఒప్పందానికి సాక్షులుగా వారు రాసిన పేర్లు, 'ఇంద్ర', 'మిత్ర', 'వరుణ', 'నాసత్య' అనబడే 'అశ్విని దేవతలు'.

బాగా ఆలోచించండి! క్రీస్తు పుట్టకముందే, ఇస్లాం మరియు క్రైస్తవం రాకముందే... నేటి సిరియా, ఇరాక్, ఇరాన్ ప్రాంతాల్లో మన వేద దేవుళ్ళను పూజించేవారు. 'మిటాని' రాజుల పేర్లు కూడా సంస్కృతంలోనే ఉండేవి. ఉదాహరణకు 'దశరథ' (Tushratta), 'ఆర్తతమ' (Artatama). ఇది మన సనాతన ధర్మం యొక్క విశ్వవ్యాప్తతకు (Global footprint) నిలువెత్తు నిదర్శనం.

ఇప్పుడు మన పురాణాల్లోకి వెళ్దాం. మన 'భవిష్య పురాణం' (Bhavishya Purana) లో ఒక ఆశ్చర్యకరమైన కథ ఉంది. ఇది ఇరాన్ కి, భారత్ కి ఉన్న లింక్ ని తేటతెల్లం చేస్తుంది.

శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు (Samba), ఒక శాపం వల్ల కుష్టు వ్యాధి (Leprosy) బారిన పడ్డాడు. నారద మహర్షి సలహా మేరకు, సూర్య భగవానుడిని ఆరాధించడానికి ఒక ఆలయాన్ని నిర్మించాడు. ద్వాపర యుగంలో నిర్మించబడిన ఆ ఆలయమే, ఈనాటి కోణార్క్ లేదా ముల్తాన్ సూర్య దేవాలయం. కానీ, ఆ ఆలయంలో పూజలు చేయడానికి స్థానిక బ్రాహ్మణులు అంగీకరించలేదు. అప్పుడు సాంబుడు సూర్యుడి ఆజ్ఞ మేరకు 'శాకద్వీపం' (Sakadvipa) నుండి ప్రత్యేక పూజారులను ఆహ్వానించాడు.

వారే 'మగ బ్రాహ్మణులు' (Maga Brahmins). చరిత్రకారులు ఈ 'శాకద్వీపం' అంటే 'సిథియా' (Scythia) లేదా పర్షియా (Iran) అనీ, 'మగ' బ్రాహ్మణులు అంటే ఇరాన్ కి చెందిన పూజారులు 'మజాయ్' (Magi/Magians) అనీ నిర్ధారించారు. ఇరాన్ పూజారులు కూడా సూర్యుడిని, అగ్నిని (Fire Worship) ఆరాధించేవారు. వారు నడుముకు 'అవ్వ్యంగ' (Avyanga) అనే పవిత్ర దారాన్ని కట్టుకునేవారు. ఇది మన ఉపనయనం లో జంధ్యం లాగా!

భవిష్య పురాణం ప్రకారం, వారు వచ్చాకే భారతదేశంలో విగ్రహ రూపంలో సూర్యారాధన (Idol worship of Sun) ప్రాచుర్యంలోకి వచ్చిందని తెలుస్తోంది. ఈనాటికీ ఉత్తర భారతదేశంలో ఉండే 'శాకద్వీపీయ బ్రాహ్మణులు' ఆ ఇరాన్ పూజారుల వారసులే అని చెబుతారు.

కేవలం భవిష్య పురాణమే కాదు, మన ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాల్లో కూడా ఇరాన్ ప్రస్తావన బలంగా ఉంది.

మహాభారత యుద్ధ (Kurukshetra War) సమయంలో, కౌరవుల తరపున పోరాడిన సైన్యంలో, 'పహ్లవులు' (Pahlavas) మరియు 'కాంభోజులు' (Kambojas) ఉన్నారు. చరిత్రకారులు ఈ 'పహ్లవులు' అనేవారే ప్రాచీన పర్షియన్లు (Ancient Persians) అనీ, వారి భాష నుండే 'పహ్లవి' (Pahlavi) అనే పదం వచ్చిందనీ చెబుతారు.

అయితే వీరు ఎవరు? అస్మదీయులా లేక తస్మదీయులా? దీనికి సమాధానం 'మనుస్మృతి' (Manu Smriti) లోని 10వ అధ్యాయం, 43-44 శ్లోకాల్లో ఉంది.

శనకైస్తు క్రియాలోపాదిమాః క్షత్రియజాతయః |
వృషలత్వం గతా లోకే బ్రాహ్మణాత్యదర్శనేన చ ||

దీని అర్థం ఏంటంటే... పౌండ్రకులు, కాంభోజులు, యవనులు, శకులు మరియు పహ్లవులు (Persians)... వీరంతా ఒకప్పుడు గొప్ప క్షత్రియులే (Kshatriyas). కానీ, సరైన వైదిక కర్మలను పాటించకపోవడం వల్లా, బ్రాహ్మణులతో సంబంధాలు తెగిపోవడం వల్లా, వారు క్రమంగా 'మ్లేచ్ఛులు'గా (Foreigners) మారిపోయారని మనువు స్పష్టంగా రాశారు.

అంటే, మన ధర్మశాస్త్రాల ప్రకారం ఇరాన్ ప్రజలు (Persians) మననుండి విడిపోయిన మన సోదర క్షత్రియులే!

ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? మీరు ఎప్పుడైనా గమనించారా... మన హిందూ దేవాలయాల్లో ఏ దేవుడి విగ్రహానికీ కాళ్ళకు చెప్పులు లేదా బూట్లు కనిపించవు. ఒక్క సూర్య భగవానుడి విగ్రహానికి (Sun God) తప్ప!

ప్రాచీన సూర్య విగ్రహాలను నిశితంగా గమనిస్తే, ఆయన మోకాళ్ళ వరకు బూట్లు (Boots) వేసుకుని ఉంటాడు. భారతీయ సంప్రదాయంలో గుడిలో బూట్లు వేసుకోవడం నిషిద్ధం కదా? మరి సూర్యుడికి ఎందుకు పాదరక్షలు ఉంటాయి?

దీనికి సమాధానం వరాహమిహిరుడు రాసిన 'బృహత్సంహిత' (Brihat Samhita) లో దొరుకుతుంది (అధ్యాయం 57). విగ్రహాలను ఎలా చెక్కాలో చెబుతూ, వరాహమిహిరుడు ఇలా పేర్కొన్నాడు: 'సూర్యుడి విగ్రహాన్ని ఉదీచ్య వేషం (Northerner’s Dress) లో చెక్కాలి, ఆయన శరీరం కవర్ చేయబడి ఉండాలి, కాళ్ళకు పాదరక్షలు ఉండాలి.'

ఈ 'ఉదీచ్య వేషం' అంటే ఉత్తర దేశాల వారి దుస్తులు. ఆ కాలంలో ఇరాన్ మరియు మధ్య ఆసియా (Central Asia) లో చలి ఎక్కువగా ఉండేది కాబట్టి, అక్కడి రాజులు కోట్లు (Coats) మరియు బూట్లు ధరించేవారు. సూర్యారాధన అక్కడి (Maga Brahmins) నుండి మనకు తిరిగి వచ్చింది కాబట్టి, ఆ విగ్రహాలకు కూడా అదే పర్షియన్ ఆహార్యాన్ని మన శిల్పులు అప్పట్లో పాటించారు.

ఇది మన సనాతన ధర్మం ఎంత విశాలమైనదో, ఇతర సంస్కృతులతో మన బంధం ఎంత లోతైనదో చెప్పే ఒక అద్భుతమైన సాక్ష్యం.

విష్ణు పురాణం (Vishnu Purana) లోని రెండవ అంశంలో భూమి యొక్క వర్ణన ఉంటుంది. అందులో 'జంబూద్వీపం' (India) పక్కనే 'శాఖద్వీపం' (Shakadvipa) ఉందని చెబుతారు. అక్కడి ప్రజలు నాలుగు వర్ణాలుగా ఉంటారని విష్ణు పురాణం చెబుతుంది:

1. మృగ (Mriga) - అంటే బ్రాహ్మణులు (Maga/Magi).
2. మాగధ (Magadha) - అంటే క్షత్రియులు.
3. మానస (Manasa) - అంటే వైశ్యులు.
4. మందగ (Mandaga) - అంటే శూద్రులు.

ఆశ్చర్యం ఏంటంటే... ఈ పేర్లు ప్రాచీన ఇరాన్ సామాజిక వర్గాలకు (Social Classes of Ancient Iran) అచ్చంగా సరిపోతాయి. మనం ఎవరినైతే 'శకులు' (Sakas/Scythians) అని పిలిచామో, వారిదే ఈ శాఖద్వీపం. అంటే, మన పురాణాలకు భారతదేశం సరిహద్దుల ఆవల ఉన్న ప్రపంచం గురించి, ముఖ్యంగా ఇరాన్ గురించి క్షుణ్ణంగా తెలుసు అనడానికి ఇంతకంటే ఏం ఋజువు కావాలి?

ఆచారాల విషయానికి వస్తే, పోలికలు చూసి మీరు షాక్ అవుతారు. పార్సీలు అంటే Zoroastrians. ఇరాన్ నుండి వచ్చిన శరణార్థులు మరియు హిందువులు... ఇద్దరికీ 'అగ్ని' (Fire) అత్యంత పవిత్రం. మనం హోమం చేస్తాం, వారు 'యస్న' (Yasna) అంటే యజ్ఞం చేస్తారు. మనం ఉపనయనం చేసి పిల్లవాడికి జంధ్యం వేస్తాం. వారు కూడా 'నవజోత్' (Navjote) అనే వేడుక చేసి 'కుస్తీ' (Kusti) అనే పవిత్ర దారాన్ని కడతారు.

వేదాలలో 'రత' (Rita) అంటే సత్యం లేదా విశ్వ ధర్మం. అవెస్తాలో అది 'అషా' (Asha). మనం చనిపోయిన వారిని దహనం చేస్తాము. కానీ పర్షియన్లు పవిత్రమైన అగ్ని మరియు భూమి మైల పడకూడదని 'టవర్ ఆఫ్ సైలెన్స్' (Tower of Silence) పద్ధతిని వాడతారు. కానీ మూల సిద్ధాంతం ఒక్కటే. అదే, ప్రకృతిని పూజించడం.

కాలగమనంలో రాజ్యాలు మారాయి, మతాలు మారాయి. 'ఆర్యానాం వైజ' నేడు ఇరాన్ గా మారింది. ఒకప్పుడు 'అహుర మజ్దా'ను, మిత్రుడిని, వరుణుడిని కొలిచిన ఆ గడ్డపై, నేడు వేరే ప్రార్థనలు వినిపిస్తున్నాయి. కానీ, చరిత్ర ఎప్పుడూ చెరిగిపోదు.

భారత్ మరియు ఇరాన్... ఒకే వేద వృక్షానికి పుట్టిన రెండు కొమ్మలు. ఒకటి తూర్పుకు విస్తరించి 'సనాతన ధర్మం'గా విరాజిల్లితే, మరొకటి పడమర వైపు విస్తరించి కాలక్రమంలో రూపాంతరం చెందింది.

మన పురాణాలు, వారి శాసనాలు, మన ఆచారాలు, వారి సంప్రదాయాలు... ఇవన్నీ మన గత బంధానికి మూగ సాక్ష్యాలు. 'వసుధైక కుటుంబకం' అని మనం ఎందుకు అంటామో ఇలాంటి చరిత్రలే నిరూపిస్తాయి. ప్రపంచం మొత్తం ఒకప్పుడు ఒకే ధారలో ప్రవహించిందని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మన చరిత్రను అందరికీ తెలియజేయడానికి షేర్ చేయండి. 'వాయిస్ ఆఫ్ మహీధర్' ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన చరిత్రతో మళ్ళీ కలుద్దాం.

జై హింద్! జై శ్రీరామ!

Comments

Related articles

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas

శిఖండి జన్మ రహస్యం Shikhandi - The Warrior Princess

గరుడ పురాణం ప్రకారం ఎన్ని రకాల నరకాలున్నాయి? Garuda Puranam

అష్టదిగ్బంధనం! Ashta Digbandhanam - Arunachaleswara, Tiruvannamalai

11 భయంకరమైన అస్త్రాలు! మహాభారతం Mahabharatam

I am Shiva - Aham Shivam Ayam Shivam | శివోహం - నేను శివుడిని!

గోలోకం గురించి చాలామందికి తెలియని వాస్తవాలు! Cows and Goloka

37 ఏళ్ల తరువాత వస్తున్న ఈ శివరాత్రి నాడు ఏం చేయాలి? Siva Ratri Puja