Akbar Exposed: Facts You Didn’t Know vs Myths Busted | అక్బర్ ది గ్రేట్?
అక్బర్ ది గ్రేట్? ఆడవారి మానప్రాణాలు తీయడంలోనా?
Akbar Exposed: Facts You Didn’t Know vs Myths You Still Believe Busted
ఆరడుగుల ఆజానుబాహుడు, ఆ కాలంలోని రాజులందరిలోకీ అందగాడు, గొప్ప పాలకుడు, హిందూ ముస్లింల మధ్య సఖ్యతను పెంపొందించిన ఉదాత్త చక్రవర్తి.. తనకంటే ముందు పాలించిన ముస్లిం రాజులు హిందువులను హింసించడానికి వేసిన జిజియా పన్నును తొలగించి, భారత దేశ చరిత్రలో మొట్ట మొదటి సెక్యులర్ నేతగా గుర్తింపు పొందిన మహా రాజు.. అసలు సెక్యులరిజం అనే పదం పుట్టిందే ఆయన దగ్గర నుంచి.. హిందూ రాజకుమార్తెలను పెళ్లి చేసుకుని, వారి మత నమ్మకాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన సున్నిత మనస్కుడు.. ఇక ఆడవారిపై ఆయన చూపించే గౌరవం మాటల్లో చెప్పలేము.. ఇంతగా కీర్తింపబడుతున్న ఆ మహా రాజు ఎవరో కాదు.. చరిత్రకారులు ఎంతో గొప్పగా చెప్పుకునే Akbar The Great.. నిజంగా.. Akbar అంతటి వాడా? చరిత్ర వక్రీకరణ అనే పదం చాలా సార్లు వినే ఉంటాము. కానీ అసలు అక్బర్ కు సంబంధించి ఆ పదం వాడుక వెనుక ఉన్న వాస్తవాలను ఈ రోజు తెలుసుకుందాము. ఏ పాఠ్యపుస్తకంలో వర్ణించనిది, కావాలని ఇన్నేళ్ళుగా దాచిపెట్టబడింది, హిందువుల నాశనం కోసం ఆయుధంగా వాడబడిన అటువంటి కఠోర సత్యాన్ని గురించి తెలుసుకోవాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/QiTACW3K2Ng ]
దాదాపు వెయ్యేళ్ల క్రితం Umayyad వంశ ఆధ్వర్యంలో ఏర్పాటైన 2వ Caliphate సమయం అది. సరిగ్గా ఆ సమయంలోనే Umayyad Caliphate లోని అత్యంత కౄరుడిగా పేరుతెచ్చుకున్న Muhammad bin Qasim అనే సైన్యాధిపతి, అఖండ భారతావనిపై చేసిన దాడితో ముస్లింల దండయాత్రలూ, వారి ఆక్రమణా మెల్ల మెల్లగా మన దేశంలో మొదలైంది. అలా Mamluk లు, Khilji లు, Tughlaq లు, Sayyid లు, Lodi లు, Bahmani లు, Ghoriలు, Qutb Shahi లు, మొఘలుల వంటి ముస్లింలు మన భారత దేశాన్ని ఆక్రమించి, ఈ భూవిపై ఉన్న ప్రత్యక్ష నరకంలా మార్చేశారు.
వారిలో అత్యంత పెద్ద రాజ్యాన్ని స్థాపించి, ఎక్కువ కాలం పాటు పాలించిన ముస్లింలలో మొఘలులు ప్రధమం. ఆ వంశంలో పుట్టిన ఆణిముత్యమే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న Akbar. మన దేశాన్ని ఆక్రమించిన ముస్లింలందరిలో, అక్బర్ భిన్నమైనవాడని చరిత్ర నిరూపిస్తోంది. అతను కదనరంగంలో నేరుగా ఒక్కసారి కూడా కత్తి దూసింది లేదు. మన కుహనా చరిత్రకారులు మాత్రం, అతడిని ఏనుగులతో పోరాడే యోధుడిగా చిత్రీకరించారు. చారిత్రక వాస్తవాలను దాచేసి మనపై ఇంతకాలం రుద్దిన చరిత్రను పక్కనపెట్టి, అత్యంత ఘోరమైన, అసలైన అక్బర్ చరిత్ర గురించి ఈ రోజు తెలుసుకుందాము.
అక్బర్ జీవితం, హేమచంద్ర విక్రమాదిత్యుడి హత్యతోనే మొదలైందని చెప్పవచ్చు. భారత దేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించిన బాబర్ అతికొద్ది కాలంలోనే మరణించడంతో, ఆ పదవి అతని కొడుకైన హుమాయూన్ చేతికి వెళ్ళింది. అయితే రాజ్య విస్తరణలో భాగంగా, మన దేశంలోని వివిధ రాజ్యాలపై దండెత్తిన సమయంలో, Sher Shah Suri అనే మరో రాజు చేతిలో హుమాయూన్ ఘోరంగా ఓడిపోయి, ఢిల్లీ పీఠాన్ని వదులుకుని పారిపోయాడు. ఆ తర్వాతే అక్బర్ పుట్టడం, దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్ళీ ఢిల్లీపై పట్టు సాధించడం, అలా ఢిల్లీ గద్దెనెక్కిన హుమాయూన్ కొద్ది నెలలకే చనిపోవడం జరిగింది. ఆ సమయంలో ఢిల్లీ పీఠాన్ని లాగేసుకున్న వీరుడు, హేమచంద్ర విక్రమాదిత్యుడు. ఆయనను హేము అని కూడా పిలుస్తారు. నాటి పంజాబ్ రాజైన Muhammad Adil Shah Suri దగ్గర హేము సామంత రాజుగా, ముఖ్యమైన రాజకీయ సలహాదారుడిగా, సైన్యాధిపతిగా, అనేక బాధ్యతలు నిర్వహించేవాడు. Hemu నాయకత్వంలోనే Muhammad Adil Shah Suri సేనలు, దాదాపు 22 యుద్ధాలు గెలిచాయి.
హుమాయూన్ మరణం తర్వాత Muhammad Adil Shah Suri ని ఢిల్లీ సింహాసనం బాగా ఊరిచింది. అనుకున్నదే తడవుగా Hemu ని అడగగా, తన మిత్రుడి కోసం ఢిల్లీని బహుమతిగా ఇచ్చాడు. దాంతో అక్బర్ అతని పరివారంతో సహా హస్తినాపురిని వదిలి పారిపోవాల్సి వచ్చింది. అయితే కొద్ది నెలలలోనే అక్బర్ తన సైన్యాన్ని కూడగట్టుకుని, Hemu పై దండయాత్ర చేశాడు. ఆ సమయంలో అక్బర్ వయసు కేవలం 14ఏళ్ళు మాత్రమే. అక్బర్ కి మామ, సర్వసైన్యాధికారీ అయిన బైరం ఖాన్ ఆ యుద్ధాన్ని పర్యవేక్షించాడు. ఆ దండయాత్రలో విజయం చాలా సేపు Hemu వర్గం వైపే ఉందని అనిపించింది. అయితే, అనుకోకుండా ఓ బాణం హేము తలకి తగలగా, ఆ దెబ్బకి అతను మూర్ఛపోయి పడిపోయాడు. అది చుసిన అతని సేనలు, తమ రాజు చనిపోవడంతో చెల్లాచెదురయిపోయారు. దాంతో విజయం అక్బర్ ని వరించింది. అయితే కొంతసేపటికి Hemu కు మెలకువ రాగా, అది చుసిన అక్బర్ సేనలు అతన్ని బంధించి, తమ రాజు ముందు ప్రవేశ పెట్టారు. సంకెళ్లతో కట్టబడి, కంట్లో బాణం దిగబడి తీవ్రమైన గాయంతో ఉన్న Hemu దగ్గరకు మేక పోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వెళ్లిన అక్బర్, ఎంతో వీరోచితంగా, బందీగా ఉన్న హేము తల నరికి చంపాడు. అతనేదో యుద్ధంలో ఎదురెదురుగా కత్తి యుద్ధం చేసి hemu ను చంపినట్లు బిల్డప్ ఇస్తూ, హేము తలను కాబూల్ కి పంపించాడు. మొండాన్ని ఢిల్లీ కోట గుమ్మానికి వేలాడదీయించాడు. hemu సేనలను వెంటాడి వేటాడి చంపించి, వారి తలలతో ఒక మినార్ లా కట్టించాడు. అలా అక్బర్ ఢిల్లీ గద్దెనెక్కాడు.
Hemu తో చేసిన యుద్ధమే అక్బర్ చేసిన ఆఖరి యుద్ధం అని చరిత్రకారులు చెబుతారు. అంటే, ఆ తర్వాత ఎప్పుడూ అక్బర్ నేరుగా కదన రంగానికి రాలేదు. ఢిల్లీ కోటలో కూర్చుని తన బలగాలను పంపించడం మాత్రమే చేశాడు. ఒకటి రెండు సార్లు వెళ్లినా, యుద్ధం చివరలో వెళ్లి, కదనరంగానికి దూరంగా విలాసవంతమైన గుడారాలను వేసుకుని పర్వవేక్షించడం లాంటివి చేసినట్లు, చరిత్రకారులు చెబుతున్నారు. ఇలాంటి అక్బర్ ని శూరుడు, ధీరుడు అని బీరాలు పలికారు, మన కుహనా చరిత్రకారులూ, మేధావులూ.
అక్బర్ యుద్ధ రంగానికి ఎప్పుడూ రాకపోయినా, సమస్త భారత దేశాన్ని తన వశం చేసుకోడానికి వేసిన ఎత్తులు మాత్రం గొప్పవని చెప్పుకోవచ్చు. అటువంటి వాటిలో ఒకటి Mewar రాజ్యాన్ని హస్తగతం చేసుకోవడం. కానీ, అక్కడ ఉన్నది సామాన్యమైన వ్యక్తి కాదు. అతని పేరు చెబితేనే అక్బర్ వెన్నులో వణుకు పుట్టేది. ఆయనే మహారాణా ప్రతాప్. ఆయన రాజ్ పుత్ లలో పుట్టిన వెలకట్టలేని మాణిక్యం. ఆయన కేవలం ఒక రాజు కాదు. ఏడున్నర అడుగుల సజీవ యుద్ధం. ఆయన వీరత్వం, యుద్ధ కౌశలం, రాజ నీతి, పరమత సహనం, దేశంపై ప్రేమ వంటి విషయాలు వింటున్నప్పుడు, రోమాలు నిక్కపొడుచుకోక మానవు. అసలు ప్రపంచానికి గెరిల్లా యుద్ధ తంత్రాన్ని నేర్పిన మొట్ట మొదటి రాజు, మహారాణా ప్రతాప్. ఆయనను స్ఫూర్తిగా తీసుకునే, ఛత్రపతి శివాజీ మహారాజ్, భారీగా ఉండే మొఘలులపై గెరిల్లా యుద్ధాలను చేసి, మహా మరాఠా సామ్రాజ్యాన్ని నిలబెట్టాడు. ప్రతాపుడి యుద్ధ తంత్రమే, ఆధునిక కాలంలో అమెరికా దురాక్రమణను ఎదిరించి, అగ్రరాజ్యాన్ని తరిమికొట్టిన వియత్నాం సైన్యం పాటించింది. ఆ విషయాన్ని స్వయంగా నాటి వియత్నాం సైన్యాధికారి, యుద్ధం గెలిచిన తర్వాత ప్రెస్ తో చెప్పారు. కానీ మన కుహనా చరిత్రకారులు మాత్రం, అసలు వాస్తవాలను దాచిపెట్టి, మహారాణా ప్రతాప్ ని ఓ బందిపోటు గా, అక్బర్ ని ఉదార చక్రవర్తిగా చిత్రీకరించడమే పనిగా పెట్టుకున్నారు.
ఆ కాలంలో Mewar రాజ్యం, ముఖ్యమైన ట్రేడ్ రూట్ గా ఉండేది. ఉత్తర భారతం నుంచి మధ్య ఆసియాకూ, బయట నుంచి భారత దేశంలోకి వర్తకులు వాడే మార్గాలలో, Mewar రాజ్యం ముఖ్యమైనది. అందువల్ల అక్బర్, Mewar ని చాలా ముఖ్యంగా భావించాడు. దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని తహతహలాడాడు. అందుకు ముందుగా సంధికోసం ప్రయత్నించినా, స్వతహాగా స్వాభిమాని అయిన మాహారాణా ప్రతాప్, అక్బర్ చెప్పు కింద కుక్కలా పడిఉండటం తనకు ఇష్టం లేదని తెగేసి చెప్పేశాడు. దాంతో అక్బర్ Mewar పై యుద్ధం ప్రకటించాడు. ఎన్నో ప్రయత్నాల తర్వాత, ఆ రాజ్యంలో ముఖ్యపట్టణమైన Chittorgarh పై దాడి చేసి, 4 నెలలపాటు నిర్విరామంగా యుద్ధం చేసి, చివరకు ఆ కోటను సొంతం చేసుకున్నాడు.
ఈ దాడి చరిత్రలో నిలిచిపోయిన అతి హేయమైన దాడులలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఆ రోజు Chittorgarh చూసింది కేవలం ఓటమిని మాత్రమే కాదు. ప్రత్యక్ష నరమేధాన్ని చూసింది. ఆ సమయంలో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 30 వేల మంది ఆ కోటలో తలదాచుకున్నారు. వారంతా స్థానికంగా నివసించే సామాన్య ప్రజలు.. రైతులుగా, కూలీలుగా, చేతి కళాకారులుగా బ్రతికే వారు. అటువంటి అమాయకులను అత్యంత కిరాతకంగా చంపించాడు. Chittorgarh లోని మహిళలు యుద్ధం ఓడిపోయామని తెలియగానే, అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నారు. మిగిలి ఉన్న మగవారినీ, చిన్నపిల్లలనూ తలలు నరికి, మర్మాంగాలు కోసి, అత్యంత పైశాచికంగా చంపించాడు అక్బర్. మిగిలిన కొద్దిమందినీ బందీలుగా తీసుకెళ్లి, మధ్య ఆసియా దేశాలకు బానిసలుగా అమ్మాడు. ఇక మిగిలిన ఒకరిద్దరు ఆడవారిని హరంకు తరలించాడు. Chittorgarh పై తాను సాధించిన విజయాన్ని తన సామంత రాజులకూ, శత్రు రాజులకూ తెలిసే విధంగా Fatehnama e Chittor జారీ చేశాడు. ఇందులో తన విజయాన్ని, కాఫిర్ హిందువులపై నెగ్గిన ఇస్లాం గా చెప్పుకున్నాడు. ముస్లింలు ఆఖరి శ్వాస ఉన్నంత వరకూ, ఇస్లాం పద్ధతులకు వ్యతిరేకంగా ఉండే హిందువులను చంపాలని కూడా ఆదేశించాడు. ఆ రోజు Chittorgarh లో ఉన్న మందిరాలన్నింటినీ నేలమట్టం చేశాడు. హిందూ దేవుళ్ళ మూర్తులను మాటల్లో చెప్పలేనంత జుగుప్సాకరంగా అవమానించి, నాశనం చేయించాడు. అలా Chittorgarh లో అక్బర్ చేసిన దారుణాలు చెప్పడానికి ఒక పుస్తకం సరిపోదు. ఇవేమీ మన చరిత్ర పుస్తకాలలో రాయబడలేదు. పైగా అక్బర్ అన్ని మతాలనూ గౌరవించేవాడని చాలా గొప్పగా రాసుకొచ్చారు.
ఇక ఆడవాళ్లను హరంకు తరలించాడన్న మాట విన్నారుకదా.. అసలు ఈ హరం గురించి తెలుసుకుంటే చాలు, అక్బర్ ఎంత నీచుడో అర్ధం అవుతుంది. ఆ రోజు Chittorgarh లోని స్త్రీలంతా ఆత్మాహుతి చేసుకోవడానికి కారణం, ఈ హరం గురించి తెలుసుకునే అని చెప్పవచ్చు. అక్బర్ చేసిన ఎన్నో దారుణాలకు సాక్ష్యంగా నిలుస్తుంది, హరం. స్త్రీలను తన భోగ సుఖాల కోసం బంధించి ఉంచే ఓ ప్రదేశమే ఈ హరం. అక్కడ ఏకంగా 5 వేల మంది ఆడవారిని బంధించి ఉంచాడు. ఈ హరంనే నాడు అక్బర్ మోచేతి నీళ్లు తాగి బ్రతికిన Abu'l-Fazl లాంటి వాళ్ళు Janana అని పిలిచేవారు. అక్బర్ ను పొగుడుతూ Abu'l-Fazl రాసిన Akbarnama లో ఈ విషయాలను ప్రస్తావించాడు. Janana అంటే Pashto భాషలో my love, i am your devotee అనే అర్ధాలున్నాయి. అక్కడున్న 5 వేల మంది స్త్రీలూ, కేవలం అక్బర్ కామ దాహాన్ని తీర్చే బానిసలు. వారిలో ప్రతి ఒక్కరికీ ఒక ఇల్లు ఏర్పాటుచేసి, కాపలాగా నపుంసకులను పెట్టాడు. వారిలో కొంతమంది పుట్టుకతో నపుంసకులు కాగా, యుద్ధ ఖైదీలుగా దొరికిన కొంతమందికి శిక్షగా వారి అంగాన్ని కత్తిరించి నపుంసకుడిగా మార్చి, ఆ Janana లో కాపలాగా పెట్టేవాడు. ఇక అదే Akbarnama ప్రకారం, Janana పక్కన ఒక భారీ మద్యశాల ఉండేది. అక్కడ ఎన్ని వేలమంది వేశ్యలుండేవారో లెక్కేలేదని Abu'l-Fazl స్వయంగా రాశాడు. janana లోని మహిళలను తన రాజకీయ అవసరాల కోసం ఇతర దేశాల ముస్లిం రాజులకు తార్చే వాడు. ఆయా దేశాలలో ఎవరైనా అందమైన స్త్రీలుంటే వాళ్ళను కొనుక్కు తెచ్చుకుని, తన janana లో ఉంచుకుని భోగించేవాడు. అలా స్త్రీలను తన వాంఛ తీర్చే ఉంపుడు గత్తెలుగా, తన రాజకీయ అవసరాలు తీర్చే భోగ వస్తువులుగా చూసేవాడు.
ఇక్కడ గుండెల్ని కలచివేసే మరో విషయం ఏమిటంటే, ఈ ఆడవారంతా హిందువులే. నాడు అక్బర్ ఏ రాజ్యంపై దాడి చేసినా, అక్కడి హిందూవుల భార్యలనూ, తోబుట్టువులనూ సజీవంగా బంధించి తెచ్చి, వారిలో అందమైన వారిని తన Janana లో ఉంచి, మిగిలిన వారిని వేశ్యలుగా మార్చి తన కోటలోని ముఖ్యమైన వారి కామవాంఛలు తీర్చడానికి ఏర్పాటు చేసేవాడు. వీరే కాకుండా అక్బర్ కి 32 మంది భార్యలు ఉన్నారు. వారిలో చాలా మంది హిందూ రాజకుమార్తలే. నాటి రాజ్ పుత్ రాజులను సంధి పేరుతో మభ్యపెట్టి, వారి కుమార్తెలలో అందమైన వారిని పెళ్లి చేసుకునేవాడు.
అక్బర్ చేసిన మరో పరమ నీచకృత్యం ఏమిటంటే, తనను చిన్ననాటినుంచీ పెంచి పెద్ద చేసి, చక్రవర్తిని చేయాలని అహర్నిశలూ పాటు పడిన తండ్రి సమానుడైన Bairam Khan భార్య Salima Sultan Begum ని కూడా వదలలేదు ఆ ప్రబుద్ధుడు. ఆమె Bairam Khan కంటే వయసులో చాలా చిన్నదే అయినా, ఆమె అందానికి ముగ్ధుడైన Bairam Khan ఆమెను రెండవ వివాహం చేసుకున్నాడు. అంతటి అందగత్తె Bairam Khan దగ్గర ఉండటాన్ని చూసి ఓర్వలేకపోయిన అక్బర్, అతడిని చంపించి, తల్లితో సమానమైన Salima ను వశపరుచుకున్నాడు.
ఇప్పటికీ రాజస్థాన్ లో స్థానికంగా వినిపించే ఓ గాధ, అక్బర్ లోని కామ దాహానికి పరాకాష్టగా నిలుస్తుంది. అందమైన స్త్రీలు ఎక్కడున్నా, వారిని నయానో భయానో సొంతం చేసుకోవాలనుకునే అక్బర్ కన్ను, Mewar మహారాజైన రాణాప్రతాప్ చెల్లెలిపై పడింది. రాణాప్రతాప్ చెల్లెళ్ళలో ఒకరైన Maan Kanwar కి గొప్ప అందగత్తెగా పేరుంది. Mewar తో సంధి చేసుకుని, ఆమెను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాడు అక్బర్. అయితే సంధి ప్రయత్నాలను రాణాప్రతాప్ తిరస్కరించడంతో, Maan Kanwar ని ఎలాగైనా దక్కించుకోవాలని అక్బర్ చాలా ప్రయత్నాలు చేశాడు. అందులో భాగంగా ఒకనాడు ఆమె చేతిలో తన్నులు కూడా తిన్నాడు. అప్పట్లో కేవలం స్త్రీలకు మాత్రమే ప్రత్యేకమైన బజార్లు ఏర్పాటు చేసేవారు. ఆ బజార్లలో అమ్మేవారూ, కొనేవారూ, ఆఖరికి కాపలా కాసే వ్యక్తులు కూడా స్త్రీలే ఉండేవారు. అటువంటి బజారుకు Maan Kanwar తరచూ వస్తుందని తెలుసుకున్న అక్బర్, స్త్రీ వేషంలో వెళ్ళి ఆమెను అక్కడి నుంచి ఎత్తుకెళ్లాలని ప్రయత్నించాడు. అయితే రాజ్ పుత్ మహిళలు సామాన్యమైన వారు కాదనే విషయం నాడు అక్బర్ కి తెలియదు. Maan Kanwar నడి బజారులో అక్బర్ ని కుక్కను కొట్టినట్లు కొట్టింది. భటుల రాకతో బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడినుంచి తప్పించుకు పారిపోయాడు అక్బర్. వీరుడు, శూరుడని చరిత్ర పుస్తకాలలో రాయించుకునే అక్బర్, నాడు ఒక మహిళ చేతిలో తన్నులు తిన్నాడనే విషయానికి ప్రచారం జరిగితే పరువు గంగలో కలిసిపోతుందని తెలిసి, ఆ ఘట్టం ఎక్కడా కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. కానీ ఆ విషయం ఇప్పటికీ రాజస్థాన్ జనబాహుళ్యంలో బుర్ర కథగా ప్రాచుర్యంలోనే ఉంది.
ఇక చరిత్రకారులు కుతంత్రంతో అల్లిన ఓ కట్టు కథ, జోధా అక్బర్ ప్రేమ కథ. కామం తప్ప మరొకటి ఎరుగని అక్బర్ కి మన కుహనా చరిత్రకారులు ఎంతో చక్కని ప్రేమ కథను పుట్టించారు. దానిని ఆధారం చేసుకుని, పాకిస్థాన్ ISI విసిరే కుక్క బిస్కెట్లకు కక్కుర్తిపడి సినిమాలు తీసే మన బాలివుడ్ బడా నిర్మాతలూ, దర్శకుల నుంచి, సీరియల్ నిర్మాణ సంస్థలు కూడా జోధా అక్బర్ పేరుతో చిత్రాలు తీసి, ఆ అబద్ధపు చరిత్రను బలవంతంగా రుద్దారు. జోధా అక్బర్ కథ వెనుక వున్న అసలు కుట్ర, హిందూ మహిళలను లవ్ జిహాద్ పేరుతో మతం మార్చడం. అందమైన ఈ అబద్ధపు ప్రేమ కథను చూపించి, హిందూ అమ్మాయిలు వారిని ఆ కథలో అక్బర్ లా ఊహించుకుని, ప్రేమించి పెళ్లి చేసుకుని మతం మార్చాలన్నదే వారి అసలు కుట్ర. ఆ కుట్రకి మన బాలీవుడ్ కుక్కల సహకారం తెలిసిందే.
వారి పవిత్ర గ్రంథం ప్రకారం, మహిళలను వేశ్యలుగా చేయడం, వేశ్యలతో సంభోగించడం, మత్తు పానీయాలు సేవించడం, నపుంసకులతో పడుకోవడం వంటివి అన్ని హరామ్ గా పరిగణించబడతాయి. అలాంటి పనులు చేసేవారు వారిలెక్కలో శిక్షార్హులు. కానీ అక్బర్, అతని వంశీయులంతా, వారి పవిత్ర గ్రంథంలో ప్రస్థావించబడిన చేయకూడని పనులన్నీ చేశారు. అయినా అతడిని నాటి వారి మత పెద్దలు ఎదిరించలేకపోయారు. మతాన్ని అక్బర్ అవసరం కోసం వాడుకున్నాడని చరిత్రకారులు గుర్తించారు. పైగా అక్బర్ Din-i Ilahi అనే కొత్త మతాన్ని స్థాపించడానికి ప్రయత్నించాడు. ఆ మతానికి తాను మొదటి ప్రవక్తగా ప్రచారం చేసుకున్నాడు. తననితాను పవిత్రమైన వ్యక్తిగా, దైవ దూతగా కూడా ప్రచారం చేసుకున్నాడు.
‘ఘాజీ’ అంటే ముస్లిమేతరులను చెంపిన వీరుడని అర్ధం వస్తుంది. Hemu ని చంపినప్పుడు అక్బర్ కి ఆ బిరుదు వచ్చింది. ఇలాంటి బిరుదుగల వ్యక్తులు ఆ కాలంలో చాలా మంది ఉండే వారు. ఘాజీ అనే బిరుదు బాబర్ కాలం నుంచి వస్తున్నట్లు చరిత్రకారులంటున్నారు. ఈ ఘాజీల ప్రధాన లక్ష్యం, హిందువుల నుంచి జిజియా పన్ను వసూలు చేయడం, హిందూ మహిళలను చెరపట్టడం, మగవారిని చంపడం. అయితే వీరు జిజియా పన్ను కట్టేవారిని మాత్రం ఏం చేసేవారు కాదు. జిజియా పన్నును అక్బర్ రద్దు చేశాడని నేటి కుహనా చరిత్రకారులు చెబుతారు కానీ, అసలైన చరిత్ర ప్రకారం, Ranastambhapura రాజ్యంతో జరిగిన చర్చల్లో భాగంగా మాత్రమే, జిజియా పన్ను రద్దు చేస్తానని అక్బర్ చెప్పినట్లు తెలుస్తోంది. అది కూడా రాచరిక స్త్రీలను తన Janana కు బహుమతిగా ఇస్తేనే జిజియా పన్ను రద్దు చేస్తానని చెప్పినట్లు చరిత్ర విదితం. ఇప్పుడు ఆ Ranastambhapura కోటనే, Ranthambore Fort గా పిలుస్తున్నారు. ఆ ప్రాంతాన్ని Ranthambore National Park గా భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అలా జీవితాంతం ఎన్నో దారుణాలు చేసిన అక్బర్ తన చివరి రోజుల్లో కొడుకు సలీమ్ చేతుల్లో కుక్కచావు చచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఆ కథనం ప్రకారం, స్వయంగా సలీమ్, అక్బర్ జబ్బును తగ్గించే మందు పేరుతో విషం ఇచ్చి చంపినట్లు తెలుస్తోంది. సలీమ్ అలా చేయడం వెనుక తన తల్లి Mariam-uz-Zamani పగ కారణమని కొంతమంది చరిత్రకారులు చెబుతున్నారు. అయితే అక్బర్ భార్య Mariam-uz-Zamani అసలు పేరు Harkha Bai. ఆమెను జియా రాణి అనికూడా పిలిచేవారు. ఒకనాడు రాజ్ పుత్ రాజ్యాలలో ఒకటైన Amber రాజ్యాన్ని అక్బర్ సేనలు ఓడించాయి. ఆ క్రమంలో అంబర్ రాజ్యానికి రాజైన Bihari Mal ని సంధి నెపంతో మభ్యపెట్టి, అతని కూతురైన Harkha Bai ని పెళ్లి చేసుకోవాలని చూశాడు అక్బర్. అయితే హైందవ సంప్రదాయాలను ఎంతో నిష్టగా పాటించే Harkha Bai కి అక్బర్ తో వివాహం ఇష్టం లేక, కోటను విడిచి పారిపోయింది. ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్న Bihari Mal కి Harkha Bai పోలికలతో ఉన్న ఒక దాసీ కూతురు కనిపించింది. ఒకప్పుడు Bihari Mal కి ఆ దాసితో ఉన్న సంబంధం కారణంగా జన్మించిన ఆమెనే Harkha Bai గా నమ్మించి అక్బర్ కిచ్చి పెళ్లి చేశాడు.
కొంతకాలం తరువాత ఒకనాడు మద్యం మత్తులో ఉన్న Bihari Mal అసలు నిజాన్ని అక్బర్ సన్నిహితుడి దగ్గర చెప్పడంతో, అక్బర్ అగ్గిమీద గుగ్గిలమై, వెంటనే కడుపుతో ఉన్న దాసీ కూతురిని ఎత్తైన మినార్ పై నుంచి తోయించి చంపించాడు. ఈ పాపపు కర్మ కారణంగానే అక్బర్ కి పుట్టిన పిల్లలలో ఒక్క సలీమ్ తప్ప ఎవరు ఎక్కువ కాలం బ్రతకలేదని చరిత్రకారులంటున్నారు. ఆ తర్వాత Harkha Bai తన మేనమామ దగ్గర తల దాచుకుందని తెలిసి, ఆ రాజ్యంపై దండెత్తాడు. ఆ యుద్ధం జరిగితే తన వల్ల తన మామ రాజ్య ప్రజలు ఇబ్బంది పడతారని తెలిసి, గత్యంతరం లేక అక్బర్ తో వెళ్ళిపోయిందామె. ఆమెకు ఇష్టం లేకపోయినా మతం మార్చి, కడుపుతో ఉన్న దాసీ కూతురిని చంపి, వారి రాజ్యాలను తన గుప్పెట పెట్టుకున్న అక్బర్ పై Harkha Bai కి అంతులేని పగ ఉండేదని చరిత్రకారులు చెబుతారు.
తల్లి చెప్పిన విషయాలతోపాటు తాను ప్రత్యక్షంగా చుసిన అక్బర్ క్రూరత్వం కారణంగా, చిన్నప్పటి నుంచి సలీమ్ తన తండ్రిని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. అయితే చంపే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేయలేదు. కానీ అక్బర్ కి వయసుమళ్ళిన సమయంలో అవకాశం దొరకగానే, అక్బర్ కి సలీమ్ విషం ఇచ్చి చంపాడని చరిత్రకారులు చెబుతున్నారు. అక్బర్ మరణం తర్వాత, ‘సలీమ్’ జహంగీర్ అనే పేరుతో కొనసాగాడు. ఇక అక్బర్ ని ఎంతో పరమత సహనం కలిగిన వ్యక్తిగా, హిందూ మతాన్ని ఎంతో గౌరవించే వ్యక్తిగా, అతనెప్పుడూ హిందూ ఆలయాలను నాశనం చేయలేదని కుహనా చరిత్రకారులు చెప్పుకొస్తారు. అది పచ్చి అబద్ధమని వాస్తవ చరిత్ర చెబుతోంది. ఉదాహరణకు Nagarkot లోని ఒక గుడిలో అతడు చేసిన అకృత్యాల గురించి తెలిస్తే రక్తం మరగిపోతుంది. అక్బర్ తన సేనలను ఆదేశించి, Nagarkot లోని ఓ మందిరంలో పూజలు చేస్తున్న బ్రాహ్మణులను పైశాచికంగా చంపించాడు. అక్కడ ఉన్నవారి పరివారాలను కూడా తెగనరికించాడు. ఎప్పటిలాగానే ఆడవారిని తన janana కి తరలించాడు. ఇవి కాకుండా, అక్బర్ సేనలు ఆ మందిరంలోని 200 ఆవులను నరికి చంపి, ఆ రక్తాన్ని వారి చెప్పులలో పట్టి మందిరం గోడలపై విరజిమ్మించాడు.
హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలా ముఖి అమ్మవారి శక్తిని పరీక్షించ ప్రయత్నించి ఓడిపోయి, తోక ముడిచి ఢిల్లీ పారిపోయాడు. కొన్ని యుగాలుగా జ్వాలాముఖి మందిరంలో వెలుగుతున్న అమ్మవారి శక్తిని ఆర్పడానికి ప్రయత్నించాడు. ఆ తల్లి శక్తి ముంది అలాంటి నీచుల ఆటలు సాగవుకదా! అక్కడ చావుతప్పి కన్ను లొట్టబోయినా కూడా, అక్బర్ ఆగడాలు ఆగలేదు. ప్రయాగ్ రాజ్ వంటి ఎన్నో క్షేత్రాలపై దాడి చేశాడు. అంతేకాదు, ప్రయాగ్ రాజ్ పేరు అలహాబాద్ గా మార్చాడు. ఇలా చెప్పుకుంటూ పొతే అక్బర్ చేసిన అకృత్యాలను రాయడానికి పుస్తకాలు సరిపోవు. అలాంటి నీచ ప్రవృత్తి గలవాడిని మన కుహనా మేధావులు గొప్పవాడిగా కీర్తిస్తూ తప్పుడు చరిత్ర రాయడం బాధాకరం. ఈ దేశం కోసం, ఇక్కడి స్త్రీమూర్తుల మాన ప్రాణాలను రక్షించడం కోసం పాటుబడిన రాజ్ పుత్ ల చరిత్రను మొత్తం కాలగర్భంలో కలిపేశారు. కాలచక్రంలో బయటికి వచ్చే ఇలాంటి వాస్తవాలను ప్రతి ఒక్కరికీ చేర్చడం మనందరి కర్తవ్యం. నా వంతు బాధ్యత నేను నెరవేర్చుకున్నాను. మీరందరూ కొనసాగిస్తారనే ఆశిస్తున్నాను.
ధర్మో రక్షతి రక్షితః
akbar facts, akbar myths, akbar the great history, akbar truth, mughal emperor akbar, akbar vs birbal myths, akbar real story, akbar biography, akbar exposed, indian history facts, akbar documentary, Akbar Exposed, Real Akbar, Untold Facts, Truth vs Myth, Fact or Fiction?, Hidden Truths, Myths Busted, Separating Facts from Myths, Facts & Misconceptions,
Comments
Post a Comment