The Real Tipu Sultan | Debunking Myths & Revealing Hidden History | టిప్పు సుల్తాన్!


టిప్పు సుల్తాన్!
ఈ మైసూర్ మహారాజు మహానియుడా, లేక నీచుడా?

ఏ దేశచరిత్ర చూచినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం.. ఒకొక్కడు మహాహంతకుడు.. అని మహాప్రస్థానంలో మహాకవి శ్రీశ్రీ అన్న మాటలు గుర్తు చేసుకోక తప్పదు.. అయినా, హిందూ ఆలయాల పునరుద్ధరణ చేసిన మహామనీషి, శృంగేరీ పీఠానికి ఆర్ధిక తోడ్పాటు అందించిన సహృదయుడు, హిందువులను తన కొలువులో పోషించిన గొప్ప లౌకికవాది, బ్రిటిషర్లతో వీరోచితంగా పోరాడిన భారతీయ యోధుడు, మైసూర్ మహా రాజు టిప్పు సుల్తాన్ అని వామపక్ష చరిత్రకారులూ, సెక్యులర్ నేతలూ ముక్త కంఠంతో అబద్ధాలను చాటుతుంటారు. కొందరు వాస్తవ చరిత్రకారులు మాత్రం, దాదాపు ఎనిమిది వేల ఆలయాలను కూల్చివేసి, లక్షలాది హిందువులను బలవంతంగా ఇస్లాంలోకి మార్చి, శాస్త్రం తెలిసిన వేలాది మంది పండితుల ప్రాణాలను దుర్మార్గంగా హరించిన కర్కోటకుడు టిప్పు సుల్తాన్ అని చెబుతారు. మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్ వర్ధంతీ, జయంతి రోజులను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా జరిగే చర్చ ఇది. ఇవన్నీ వింటూ ఉంటే మనలో చాలా మందికి అతను అసలు నిఖార్సైన నాయకుడేనా? లేక కరుడుగట్టిన రాక్షసుడా? అసలైన టిప్పు సుల్తాన్ వాస్తవ చరిత్ర ఏమిటి? అతనిపై నేటికీ మన దేశంలో పెద్ద ఎత్తున రాజకీయం ఎందుకు జరుగుతోంది - వంటి సందేహలెన్నో కలుగుతాయి. మరి అటువంటి సందేహాలన్నిటికీ సమాధానాలు తెలియాలంటే, ఈ రోజుటి మన వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/zKCQ9dh7LLI ]


బ్రిటిష్ వాడి దాస్య శృంఖలాలనుండి బయటపడి ఏడు పదుల వత్సరాలు దాటినా, మన భారత దేశంలో నేటికీ మనకు తెలియకుండా మనపై చేస్తున్న అతి పెద్ద కుట్ర, చరిత్ర వక్రీకరణ. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లుగా సర్దుకుపోయే మీమాంసలో మనం ఉన్నంత కాలం, తమ పెత్తనానికి ఎటువంటి లోటూ ఉండదనేది, మన దేశ రాజకీయ నాయకుల అభిప్రాయం. అందుకే స్వాతంత్ర్యం వచ్చిననాటి నుంచీ వారి మోచేతి నీళ్ళ రుచి మరిగిన కుహనా మేధావులూ, సెక్యులర్ ముసుగు ధరించిన రాజకీయ తోడేళ్ళూ కలిసి ఆడుతున్న నాటకం, మన దేశ అసలు చరిత్రను వక్రీకరించడం. అందుకోసం తాము చెప్పాలకున్న విషయాన్ని నయానో భయానో మన మెదళ్ళలోకి ఎక్కించే ప్రయత్నం చేయడం, అది కుదరని పక్షంలో మనను తికమక పెట్టడం అనే సూత్రాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నారు. అందువల్లనే టిప్పు సుల్తాన్ వాస్తవ చరిత్ర మరుగున పడిందని చెప్పవచ్చు.

మరి ఆ మైసోర్ ముస్లిం రాజు నిజ స్వరూపం ఏమిటో తెలియాలంటే అతని అసలు చరిత్రను లోతుగా పరిశీలించాలని అంటున్నారు చరిత్రకారులు. వాస్తవ చరిత్ర ప్రకారం టిప్పు సుల్తాన్ గా పిలువబడే Fateh Ali పూర్వులు మన దేశానికి చెందిన వారు కాదు. కనీసం ఇతర ఇస్లాం రాజుల లాగా ఇక్కడి రాజులపై దండయాత్ర చేసి మన దేశంలో తమ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న చరిత్రా లేదు. టిప్పు పూర్వికులు ఈ దేశానికి పొట్టకూటి కోసం వలస వచ్చిన సామాన్య ఇస్లాం వలసదారులలో ఒకరు.

టిప్పు ముత్తాత అయిన Muhammad Ali, పర్షియా నుంచి భారత్ కు తన కుటుంబంతో వలస వచ్చాడని చరిత్రకారుల ద్వారా తెలుస్తోంది. ఇంకొందరు అతడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చాడని అంటారు. కొందరు చరిత్రకారులు మాత్రం టిప్పు సుల్తాన్ తండ్రి హైదర్ అలీ, తాము స్వయంగా ముహమ్మద్ ప్రవక్త తెగ అయిన అరబ్ ఖురేషికి చెందినవారుగా ప్రచారం చేసుకుంటుండే వాడని అంటారు. అయితే ఆ మాటలు కేవలం తాము ఉన్నత ముస్లిం వర్గానికి చెందిన వారని నిరూపించు కోవడానికి హైదర్ అలీ ఆడిన అబద్ధమని చాలామంది చరిత్రకారుల వాదన. ఏది ఏమైనా టిప్పు సుల్తాన్ వంశం ఎక్కడి నుంచి వచ్చింది? ముస్లిం సామజిక వర్గంలో వారి స్థాయి ఏమిటి? వంటి విషయాలు మాత్రం గోప్యంగానే ఉండి పోయాయి. దీనిని బట్టి టిప్పు మూలాలు మన దేశానికి చెందినవి కావని మాత్రం తేటతెల్లమవుతోంది.

ఆ విధంగా టిప్పు ముత్తాత Muhammad Ali మన దేశానికి వచ్చి స్థిరపడి, కాలగమనంలో నాటి మైసూర్ వడయార్ రాజుల దగ్గర పనికి చేరాడు. ఆ తర్వాత టిప్పు తాత అయిన Fateh Muhammad, వడయార్ రాజుల సైన్యంలో చేరి, అనతి కాలంలోనే ఉన్నత పదవులు అందుకున్నాడు. దాంతో వడయార్ రాజులు Fateh Muhammad చేసిన సేవలకు గాను, అతనికి కోలార్ జిల్లాలోని బుధికోట ను జాగీరు గా ఇచ్చారు. అప్పటి నుంచి మెల్ల మెల్లగా వడయార్ రాజుల దగ్గర Fateh Muhammad తన ప్రాభవాన్ని పెంచుకుంటూ, తన కొడుకైన హైదర్ అలీని కూడా వడియార్ సైన్యంలో చేర్చాడు. అయితే, ఒక యుద్ధంలో ఆకస్మికంగా Fateh Muhammad చనిపోవడంతో, హైదర్ అలీ తన తమ్ముడు షాబాజ్ తో కలిసి వడయార్ రాజుల సైన్యంలో మరింత చురుకుగా పనిచేయడం మొదలు పెట్టాడు. నాడు వడయార్ రాజులకు ఇటు హైదరాబాద్ నవాబులతోనూ, అటు మరాఠాలతోనూ, మరోపక్క మలయాళ దేశ నాయకర్ రాజులతోనూ, కర్ణాటకలోని కొంతమంది సామంత రాజులతోనూ తగాదాలు ఉండేవి. అందులోనూ హైదరాబాద్ నవాబులకు నాటి బ్రిటిష్ పాలకుల అండదండలు కూడా ఉండటంతో, వడయార్ రాజులు ఆధునిక ఆయుధ సంపత్తి కోసం ఫ్రెంచ్ సేనలకు దగ్గరవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ క్రమంలో హైదర్ అలీ పలువురు ఫ్రెంచ్ అధికారులతో కలిసి పోరాటాలలో పాల్గొనడం, అక్కడ అతడు చాలా చురుకుగా పనిచేయడంతో, మెల్ల మెల్లగా వడయార్ రాజుల సైన్యంలో పెద్ద హోదాలకు చేరుకున్నాడు. ఒకానొక సందర్భంలో వడయార్ రాజు అజ్ఞాతంలోకి వెళ్ళవలసి రాగా, అదే అదనుగా తీసుకున్న హైదర్ అలీ కుట్ర పన్ని మైసూర్ పై పట్టుసాధించి, తనకు తానుగా సుల్తాన్ నని ప్రకటించుకున్నాడు.

అలా మోసపూరితంగా మైసూర్ మహారాజుగా మారిన హైదర్ అలీ, తనకు అడ్డు వస్తారని భావించిన వడయార్ రాజులకు నమ్మకస్తులనందరినీ అత్యంత కిరాతకంగా మట్టుబెట్టాడు. ఆ తర్వాత కొన్నేళకు మరాఠాలతో జరిగిన యుద్ధంలో తన కొడుకైన టిప్పును కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు. టిప్పుకు అదే మొదటి యుద్ధం అనీ, అందులో వారు విజయం సాధించారనీ చరిత్రకారులంటున్నారు. ఇదిలా ఉండగా, కొన్నేళ్ళకు హైదర్ అలీ వీపుపై ఏర్పడిన క్యాన్సర్ కణితి కారణంగా మరణించిన వెంటనే, అతని రెండవ భార్యకు పుట్టిన టిప్పు సుల్తాన్ మైసూర్ మహారాజుగా గద్దెనెక్కాడు.

అప్పటి నుంచి తన తండ్రి మోసంతో ఆక్రమించుకున్న రాజ్యాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా, దక్షిణ భారతం మొత్తాన్నీ తన ఆధినంలోకి తెచ్చుకోవాలని కలలుగన్నాడు. అతనికున్న మరో అతి పెద్ద కల, దక్షిణ భారతావని మొత్తాన్నీ ఇస్లాం రాజ్యంగా మార్చడం. అందుకతను తన రాజ్యంలోని కొన్ని వేల ఆలయాలను ద్వంసం చేయించాడు. ఎంతో మంది హిందువులను చిత్ర హింసలు పెట్టి ఇస్లాంలోకి మార్చాడు, ఎదురు తిరిగిన వారిని అత్యంత కిరాతకంగా చంపించాడని, Lewis Rice అనే చరిత్రకారుడు వ్రాసిన Mysore and Coorg అనే పుస్తకంలో స్పష్టంగా ప్రస్థావించాడు.

టిప్పు సుల్తాన్ పాలనలో అతడు పెట్టిన బాధలను తట్టుకోలేక మతం మారినవారు మారిపోగా, చాలా మంది ఘోరమైన మరణాన్ని పొందగా, ఎంతోమంది హిందువులు దేశంలోని ఇంతర ప్రాంతాలకు వలసలు వెళ్లిపోయారు. ఇక రాజ దర్బార్ లో కీలక పదవులలో నుంచి దాదాపుగా హిందువులందరినీ తొలగించి, వారి స్థానాలలో అర్హత ఉన్నా లేకున్నా ముస్లింలను మాత్రమే చేర్చుకునే వాడు. అయితే ఒక్క దివాన్ పదవిలో మాత్రం పూర్ణయ్య అనే బ్రాహ్మణ పండితుడిని కొనసాగించాడు. దీని వెనుక టిప్పు తండ్రి హైదర్ అలీ నిర్ణయం ఉందని తెలుస్తోంది.

హైదర్ అలీ సైన్యాధికారిగా మారినప్పుడు, అతడు పాల్గొన్న యుద్ధాలలో ఇతర రాజ్యాల నుంచి పెద్ద మొత్తంలో సంపదను దోచుకుని వచ్చేవాడు. అందులో చాలా భాగం వడయార్ రాజులకు ఇవ్వకుండా హైదర్ అలీ రహస్యంగా దాచుకునేవాడు. అలా దాచిన సొత్తు పెద్ద ఎత్తున ఉండటంతో, చదువురాని హైదర్ అలీ ఖండే రావు అనే బ్రాహ్మణుడి సహాయంతో, ఆ సొత్తు వివరాలను గ్రంధస్తం చేయించాడు. ఈ క్రమంలో ఖండే రావు హైదర్ అలీ దోచుకువచ్చిన సంపదను లెక్క కట్టడానికి, ఓ పద్దతిని కనుగొన్నాడు. దాని ద్వారా హైదర్ అలీ కూడా సులువుగా తన సంపదను లేక్కపెట్టగలిగే వాడని చరిత్రకారులు చెబుతారు. హైదర్ అలీ వడియార్ రాజులను మోసం చేసి మైసూర్ ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు, ఈ ఖండే రావ్ హైదర్ అలీ కి ఎదురు తిరిగి వడయార్ రాజులకు మద్దతుగా నిలిచాడు. దాంతో హైదర్ అలీ మైసూర్ ని ఆక్రమించుకున్న తర్వాత, ఖండే రావ్ ను వెతికి పట్టుకుని మరీ అత్యంత కిరాతకంగా చంపేశాడు.

అప్పటి నుంచి అతనికి చాలా రోజులపాటు సరైన దివాన్ లోటు ఉండి పోయింది. ఒకనాడు Krishnacharya Purnaiah అనే బ్రహ్మణుడు కోటలో సరైన దివాన్ లేడని తెలుసుకుని, తనకు తెలిసిన వారి ద్వారా హైదర్ అలీ కొలువులోని ఆర్ధిక శాఖలో చేరాడు. పనిలో బాగా కష్టపడే స్వాభావం, అందమైన చేతి వ్రాత, అద్భుతమైన జ్ఞాపక శక్తి, లెక్కలలో అపారమైన పట్టు, పలు భాషలలో అనర్గళంగా మాట్లాడగలగటం వంటి అతడి ప్రత్యేక నైపుణ్యతలు హైదర్ అలీ దృష్టిలో పడ్డాయి. చాలా కాలంగా తాను వెతుకుతున్న మనిషి అతనేనని నిర్ణయించుకుని, అతనికి దివాన్ పదవిని అప్పగించాడు హైదర్ అలీ. అప్పటి నుంచి అతనిని దివాన్ పూర్ణయ్య అని పిలిచేవారు. అయితే హైదర్ అలీ చనిపోయే ముందు మాత్రం, తన తర్వాత కూడా పూర్ణయ్యను దివాన్ గా కొనసాగించమనీ, ఖజానా లెక్కలపై అతకి ఉండే పట్టు మరెవరికీ ఉండదనీ చెప్పాడు. అలా తండ్రి నిర్ణయించిన పూర్ణయ్యను తన అవసరం దృష్ట్యా ఆస్థానంలో కొనసాగనిచ్చాడు టిప్పు.

అలా పుర్ణయ్యతో పాటు, మరో ఇద్దరు బ్రాహ్మణలు కూడా టిప్పు సంస్థానంలో ఉండేవారు. వారిద్దరూ జ్యోతిష్యంలో అమోఘమైన ప్రతిభావంతులు. టిప్పుకు స్వయంగా జాతకాలపై అమితమైన నమ్మకం ఉండటంతో, ఆ ఇద్దరు బ్రాహ్మణులను కూడా టిప్పు తన దగ్గర ఉండనిచ్చాడని తెలుస్తోంది. తన స్వలాభం కోసం తప్పనిసరి పరిస్థితులలో తన దగ్గర కొనసాగనిచ్చిన ముగ్గురు బ్రాహ్మణులను చూపించి టిప్పును మహోన్నత వ్యక్తిగా నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు, నేటి కుహనా చరిత్రహీనులు.

M H Gopal అనే చరిత్రకారుడు రాసిన Tipu Sultan’s Mysore, an Economic History అనే పుస్తకం చదివితే, అతడు చేసిన దారుణాల గురించి కళ్ళకు కట్టినట్లు కనపడుతుంది. ఆయన రాసిన దాని ప్రకారం, నాడు టిప్పు రాజ్యంలోని హిందువులు ముస్లింలుగా మారితే, భారీ మొత్తంలో డబ్బు ముట్ట చెప్పవాడనీ, తన రాజ్యంలో విధించే పన్నులలో ముస్లింలకూ, ఇస్లాం మతంలోకి మారిన వారికీ, భారీ మినహాయింపులు ఉండేవనీ తెలుస్తోంది. హిందువులుగా కొనసాగిన వారిపై మాత్రం చిత్ర విచిత్రమైన పన్నులు విధించి, వారిని అష్టకష్టాల పాలు చేసేవాడు. ఆ పన్నులు కట్టలేక చేతులెత్తేసినవారిని ఇస్లాంలోకి మారమని బలవంత పెట్టే వాడనీ, అప్పటికీ ఒప్పుకోకపోతే వారి ఆస్థులను జప్తు చేసి, కట్టు బట్టలతో నడిరోడ్డుపైకి గెంటించేవాడనీ, M H Gopal రాసిన పుస్తకంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది.

టిప్పుకు ముందు వరకూ మైసూర్ లో ఉండే అధికారిక లెక్కలనూ, ఇతర వివరాలనూ గ్రంధస్తం చేయడానికి కన్నడ భాషనే ఉపయోగించే వారు. అలా రాసిన పుస్తకాలను ఆ తర్వాత మరాఠా భాషలోకి తర్జుమా చేసే వారు. అయితే టిప్పు ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టి, తన రాజ్యంలో అధికారిక లెక్కలూ, గ్రంధాలూ, ఉత్తర ప్రత్యుత్తరాలలో పర్షియన్ భాష ఉండేలా చర్యలు తీసుకున్నాడు.

ఇక టిప్పు రాసిన రక్త చరిత్రలో అత్యంత దారుణమైన అధ్యాయాలుగా మలబార్ యుద్ధాన్ని పేర్కొంటారు. అతడు చేసిన ఆ యుద్ధంలో మలబార్ పై ఘన విజయం సాధించాడు. అయితే ఈ క్రమంలో అతడు హిందువుల రక్తం ఏరులై పారించాడనీ, ఆడవారూ, పిల్లలు అనే తేడా లేకుండా హిందువులను చిత్ర హింసలు పెట్టి చంపించాడనీ, కొన్ని వేల హిందూ ఆలయాలను ధ్వంసం చేయించాడనీ, K. N. Panikkar తెలిపారు. ఇదే విషయాన్ని William Logan అనే ఆంగ్ల రచయిత, Malabar Manual అనే పుస్తకంలో వివరంగా వ్రాశారు.

మలబార్ యుద్ధంలో అతడు చేసిన దారుణ మారణకాండను గొప్ప విజయంగా భావిస్తూ, ఆఫ్ఘానిస్తాన్, పర్షియా దేశాలలోని ఇతర రాజులకు ఉత్తరాలు రాసేవాడు. ఆ ఉత్తరాలలో తాను ఏకంగా నాలుగు లక్షల మంది హిందువులను ముస్లింలుగా మార్చేశాననీ, దానికోసం కాఫిర్లుగా వారికి వారు పరిగణించుకునే హిందువులను, ముఖ్యంగా బ్రాహ్మణులను వేలాది మందిని చంపించాననీ వ్రాశాడు. హిందుస్థాన్ ని అల్లా రాజ్యంగా మర్చేవరకూ తన పోరాటం కొనసాగుతుందనీ, అందుకు వారి సహాయం కూడా కోరినట్లుగా ఆ ఉత్తరాలలో ఉన్నదని, వాస్తవ చరిత్రకారులంటున్నారు.

ఇలా చెప్పుకుంటూ పొతే టిప్పు సుల్తాన్ ఆగడాలకు పెద్ద పెద్ద పుస్తకాలు కూడా సరిపోవని వాస్తవ చరిత్రకారులంటున్నారు. అయితే అతను బ్రిటిష్ వారిపై చేసిన పోరాటం కారణంగా నేటి సెక్యులర్ నాయకులూ, కుహనా మేధావులూ టిప్పును గొప్ప దేశ భక్తుడిగా చిత్రీకరించడం మొదలు పెట్టారు. చరిత్ర ప్రకారం టిప్పుకూ బ్రిటిష్ వారికీ రెండు విషయాలలో వ్యవహారం చెడటం వల్లనే యుద్ధాలు జరిగాయని చరిత్రకారులంటున్నారు. మొదటి సందర్భంలో టిప్పు తండ్రి హైదర్ అలీ వడయార్ రాజుల దగ్గర సైన్యాధికారిగా ఉన్నప్పుడు, వడయార్ శత్రువైన ఒక సామంత రాజును యుద్ధంలో ఓడించి, అతని సంపదను దోచుకు వెళ్ళాడు. ఆ రాజ్యం రాయలసీమను ఏలుతున్న నవాబులకు సన్నిహిత రాజ్యం కావడం, వారికి బ్రిటిష్ వారి అండదండలు ఉడటంతో, బ్రిటిష్ వారితో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్న హైదర్ అలీ కి, ఆ ఘటన పెద్ద ఎదురు దేబ్బగా తయారయ్యింది. దాంతో అప్పటి నుంచీ బ్రిటిష్ పాలకులు హైదర్ అలీని అణచడానికి తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఇక టిప్పు సుల్తాన్ అయ్యాక.. దక్షిణ భారతాన్ని మొత్తం తన నియంత్రణలోకి తీసుకోవాలనే దురాశతో, బ్రిటిష్ పాలకుల ఆలోచనలపై నీళ్ళు చల్లాడు. ఎలాగైనా భారత దేశాన్ని తమ హస్తగతం చేసుకోవాలని భావించిన బ్రిటిష్ పాలకులు, టిప్పు ఆలోచనకు అడ్డుగా నిలిచారు. దాంతో టిప్పు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయక తప్పలేదు. ఒకపక్క బ్రిటిష్ వారికీ, మరో పక్క హిందువులను నాశనం చేస్తున్న టిప్పు కీ బుద్ధి చేప్పాలనే ఉద్దేశంతో, మరాఠాలు మైసూరు పై పలు దఫాలుగా దాడులు చేయడంతో, టిప్పు కి హిందువుల మద్దతు తప్పనిసరిగా మారింది. అప్పటి నుంచీ టిప్పు హిందువుల మద్దతుపొంది, వారి ద్వారా యుద్ధాలలో తాను బలం పుంజుకోవాలనే తలంపుతో, కొన్ని ఆలయాలకు మరమ్మతులు చేయించడం, శృంగేరీ పీఠానికి విరాళాలు ఇవ్వడం, తన ఆస్థానంలో హిందూ అధికారుల సంఖ్యను పెంచడం వంటి చర్యలు తీసుకున్నాడని, చరిత్రకారులు చెబుతున్నారు. దీనిని బట్టి, కుహనా మేధావులూ, సెక్యులర్ నాయకులూ చిత్రీకరిస్తున్న విధంగా టిప్పు మన దేశపు ఉత్తమ నాయకుడు మాత్రం కాదనీ, మిగిలిన ముస్లిం రాజులలాగానే అతను కూడా కరుడుగట్టిన రాక్షసుడేననీ వాస్తవ చరిత్రకారులు ఘంటాపధంగా చెబుతున్నారు. అసలైన చరిత్రను తెలుసుకుని భావితరాలకు తెలియజేయడం, సరైన నాయకులను జాగ్రత్తగా ఎన్నుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఒక్కరూ అలక్ష్యం చేయకుండా తమ ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకూ లోనుకాకుండా వినియోగించుకోవాలని ప్రార్ధిస్తున్నాను..

🚩 జై భారత్ 🙏

Comments

Popular posts from this blog

భారతంలో మూడు చేపల కథ! మహాభారతం Mahabharata in Telugu

శ్రీ కృష్ణ లీలలు! Sri Krishna Leelas

పోయిన వారి ఫోటోలను ఎక్కడ పెడితే మంచిది? Deceased person photos at home